కసబ్ చెప్పిన సినేమా కత
Publish Date:Aug 30, 2012
Advertisement
ముంబై మారణకాండ కేసులో ప్రథాన నిందితుడైన కసబ్ కి సుప్రీంకోర్ట్ ఉరిశిక్షని ఖరారు చేసింది. కసబ్ కి మరణ శిక్ష తప్ప మరో శిక్ష విధించడానికి వీల్లేదని సుప్రీంకోర్ట్ అభిప్రాయపడింది. రెండేళ్ల క్రితం కసబ్ను కోర్టులో హాజరుపరిచినప్పుడు న్యాయమూర్తి ముందు దొంగనాటకాలు ఆడాడు. తాను బాలీవుడ్ సినిమాలో నటించేందుకు వచ్చానని, తనకు ఎకె 47 అంటే ఏంటో తెలియదని, కేవలం సినిమాలో నటించేందుకే తాను భారత్ వచ్చానని జడ్జికి చెప్పాడు. విచారణ తరువాత కోర్టు కసబ్ కి ఉరిశిక్ష విధించింది. జైలులో కూడా కసబ్ విచిత్రంగా ప్రవర్తించాడు. తాను ఏ తప్పు చేయలేదని, తనకు ముంబయి ఘటనతో సంబంధం లేదని తొలుత చెప్పిన కసబ్ ఆ తర్వాత తప్పును అంగీకరించాడు. కసబ్ చిన్నప్పుడే తండ్రితో గొడవపడి ఇల్లు వదిలేసాడు. బతుకుదెరువు కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. దొంగతనాల కోసం ఆయుధాల కొనుగోలు సమయంలో లష్కరే తోయిబాతో పరిచయమయింది. కసబ్ చలాకీతనాన్ని గుర్తించిన లష్కరే తోయిబా అతనికి మంచి శిక్షణను ఇచ్చి భారత్పై దాడికి పంపింది.
http://www.teluguone.com/news/content/death-for-ajmal-kasab-24-16989.html





