ఆయిల్ కంపెనీల తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్.. సరఫరా పునరుద్ధరించకుంటే చర్యలు తప్పవంటూ వార్నింగ్

Publish Date:Apr 26, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు. ప్రజలకు అత్యవసరమైన ఇంధన సరఫరాలో అంతరాయం కలగడం పట్ల  అసహనం వ్యక్తం చేసిన ఆయన సోమవారం (ఏప్రిల్ 27) నాటికి రాష్ట్రంలోని ఏ ఒక్క పెట్రోల్ బంకు వద్ద కూడా  నో స్టాక్ అనే బోర్డు కనిపించడానికి వీల్లేదని చమురు కంపెనీల ప్రతినిధులకు   అల్టిమేటం జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టించి ప్రజలను, ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే సదరు కంపెనీల అనుమతులపై పునరాలోచన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి  చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి  ఉన్నతాధికారులు,  ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం (ఏప్రిల్ 26)  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు. రిటైల్ అవుట్‌లెట్లకు ఇవ్వాల్సిన క్రెడిట్ సదుపాయాన్ని నిలిపివేసి..  సరఫరాను ఆపడం వల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ధోరణిని సహించేది లేదన్నారు.

రాష్ట్రంలో ముఖ్యంగా నయారా, రిలయన్స్ వంటి ప్రైవేట్ ఆపరేటర్లు సరఫరా  నిలిపివేయడం వల్లే సమస్య జటిలమైందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోతల సీజన్ నడుస్తుండటం, వ్యవసాయ,  ఆక్వా రంగాల నుండి డీజిల్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమైందన్నారు.  మూడు రోజుల క్రితమే ఈ సమస్య వెలుగులోకి వచ్చినా,  తక్షణమే ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను సీఎం నిలదీశారు. తనకు కేవలం నివేదికలు మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఫలితాలు కావాలని స్పష్టం చేశారు.

ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందన్న చంద్రబాబు. .   ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్,  కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన నిఘా ఉంచాలని పోలీసు, పౌర సరఫరాల శాఖలను ఆదేశించారు. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం డీజిల్ అవసరమయ్యే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనీ.. అవసరమైతే కూపన్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో చమురు కంపెనీలు తమ సరఫరా వ్యవస్థను వేగవంతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంధన నిల్వలు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలనీ.. డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని తరలించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి రాకపోతే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.  

ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజల నుండి సానుకూల స్పందన వస్తోంది. వేసవి,  వ్యవసాయ పనుల నేపథ్యంలో ఇంధన అవసరం ఎక్కువగా ఉన్న సమయంలో ప్రభుత్వం వేగంగా స్పందించడం ఊరటనిచ్చే అంశంగా చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి కృత్రిమ కొరతలు తలెత్తకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని సీఎం అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.  

By
en-us Political News

  
హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిపై వరంగల్ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ తక్షణం క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.
రిటైర్డ్ డీజీపీ బి. శివధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర భద్రతా సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు
వరంగల్ జిల్లాలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సు వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలు విషయంలో కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.