political-news-img

నీట్ పేపర్ లీక్ కేసులో బిగ్ ట్విస్ట్..!

13 మందిపై 20,000 పేజీల భారీ సీబీఐ ఛార్జ్‌షీట్..! దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేసిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో అత్యంత కీలకమైన, సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్త సంచలనం సృష్టించిన ఈ లీకేజీ కేసులో విచారణను అత్యంత వేగవంతం చేసిన కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సిబిఐ - CBI), దాదాపు 13 మంది ప్రధాన నిందితులపై ఏకంగా 20,000 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానంలో దాఖలు చేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈ సుదీర్ఘ ఛార్జ్‌షీట్‌ను ఇప్పటికే పరిగణనలోకి తీసుకోగా, నిందితులపై నమోదైన తీవ్రమైన ఆరోపణలు మరియు ఆధారాలపై కోర్టు వాదనలను వినడానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రవేశ పరీక్ష విశ్వసనీయతను దెబ్బతీసిన ఈ కుట్ర వెనుక ఎవరెవరు ఉన్నారనే నిజాలను సీబీఐ తన పక్కా దర్యాప్తు ద్వారా బయటపెట్టింది. ఈ సుదీర్ఘ విచారణ ప్రక్రియలో సీబీఐ అధికారులు అత్యంత నిశితంగా ఆధారాలను సేకరించారు. ఈ కేసులో మొత్తం 360 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయగా, 422 విభిన్నమైన కీలక పత్రాలను మరియు 43 భౌతిక ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహణ లోపాలపై విమర్శలు వెల్లువెత్తిన వేళ, ఎన్టీఏకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే అత్యంత కుట్రపూరితంగా ఈ పేపర్ లీకేజీకి ఒడిగట్టినట్లు సీబీఐ తమ ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా ఆరోపించింది. పరీక్ష నిర్వహణలోని లొసుగులను ఆసరాగా చేసుకుని, అక్రమార్జనే ధ్యేయంగా రూపుదిద్దుకున్న ఒక పెద్ద ముఠా ఈ పేపర్ లీకేజీ వెనుక పనిచేసినట్లు ఆధారాలతో సహా అధికారులు నిరూపించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఆందోళనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడటంతో, తీవ్ర మనస్తాపానికి గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన తీవ్ర విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యార్థులు, యువజన సంఘాలు, తల్లిదండ్రులు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున నిరసనలు మరియు ధర్నాలు చేపట్టడంతో కేంద్ర విద్యాశాఖ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంది. రాజకీయంగా తీవ్ర దుమారం రేగడంతో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కేంద్రం పాత పరీక్షను పూర్తిగా రద్దు చేసి, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాల మధ్య మళ్లీ నీట్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆశావహుల కలలను దెబ్బతీసిన ఈ లీకేజీ కేసులో సీబీఐ దాఖలు చేసిన 20,000 పేజీల ఛార్జ్‌షీట్ ఇప్పుడు నిందితులకు చట్టపరంగా ఉచ్చు బిగించబోతోంది. పరీక్షల వ్యవస్థలో నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు అక్రమార్కులకు కఠినమైన శిక్ష పడేలా చేసేందుకు ఈ సీబీఐ ఛార్జ్‌షీట్ మరియు దర్యాప్తు పత్రాలు ఎంతో కీలకమైనవిగా మారనున్నాయి. కోర్టు పరిగణనలోకి తీసుకున్న ఈ కేసు రేపటి వాదనలతో మరింత ఆసక్తికరమైన మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. NEET paper leak, CBI chargesheet, NEET scam investigation, Rouse Avenue Court, NTA paper leak, NEET exam controversy

Publish Date: Aug 12, 2026 4:35PM

political-news-img

గ్రూప్ వన్ మూల్యాంకన తప్పుల తడక.. కోర్టుకు నివేదిక సమర్పించిన సిట్.!

ఏపీలో వైకాపా హయాంలో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన సిట్ తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో దర్యాప్తు బృందం, మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న నిబంధనల ఉల్లంఘనలను, సాంకేతిక, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా ధర్మాసనం ముందుంచింది. సిట్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఏపీపీఎస్సీ ప్రాథమిక నియమావళికి విరుద్ధంగా ఒకే జవాబు పత్రాలను మూడు విడతలుగా మూల్యాంకనం చేసినట్లు అధికారులు శాస్త్రీయంగా నిర్ధారించారు. డిజిటల్ విధానం, హైలాండ్ రిసార్ట్, అలాగే విజయవాడ కేంద్రంగా మూడు వేర్వేరు దశల్లో ఈ మూల్యాంకన సాగిందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఎంపికైన మొత్తం 165 మంది అభ్యర్థులలో 160 మంది జవాబు పత్రాలలో మార్కులకు సంబంధించి మార్పులు, చేర్పులు జరిగాయని సిట్ తేల్చింది. అలాగే ఎంపిక కాని 161 మందికి సంబంధించి 153 మంది పేపర్లలోనూ, న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 405 మంది రిట్ పిటిషనర్ల జవాబు పత్రాలలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేల్చింది. ఫోరెన్సిక్ తనిఖీలలో చీఫ్ ఎగ్జామినర్లు నేరుగా మార్కులను దిద్దడం, మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు రాతపూర్వక ఆధారాలు లభించాయని సిట్ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. దర్యాప్తు సమయంలో 61 జవాబు పత్రాల స్లిప్పులపై వైట్ కరెక్షన్ ఫ్లూయిడ్ ఉపయోగించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. దీనికి తోడు భద్రంగా ఉంచాల్సిన పరీక్ష పత్రాలను 84 రోజుల పాటు విజయవాడ సమీపంలోని ఒక రిసార్ట్‌లో ఉంచినట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం మూల్యాంకనం కోసం అందుబాటులో ఉంచాల్సిన 452 మంది అర్హులైన నిపుణుల ప్యానెల్‌ను పూర్తిగా పక్కనబెట్టి, 66 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల సహాయంతోనే ఈ మూల్యాంకన ప్రక్రియను నడిపించారని సిట్ పేర్కొంది. మూడోసారి అనధికారికంగా మూల్యాంకనం జరిపేందుకు కొత్తగా బార్‌కోడ్ షీట్లను ప్రత్యేకంగా ముద్రించినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఒకసారి మూల్యాంకనం పూర్తయిన తర్వాత ఇలా మళ్లీ మళ్లీ పేపర్లను దిద్దడం చట్టవిరుద్ధమని సిట్ కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో పారదర్శకత లోపించిందని, ఫోరెన్సిక్ ఆధారాలతో సహా దాదాపు 173 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి హైకోర్టుకు అందజేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. సుమారు 736 మంది అభ్యర్థుల జవాబు పత్రాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయిందని, మిగిలిన కొద్దిమంది నివేదికలను త్వరలోనే అందజేస్తామని సిట్ పేర్కొంది. కాగా అభ్యర్థుల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు సిట్ సమర్పించిన నివేదిక ప్రతులను తమకు అందించాలని కోర్టును కోరారు. దానికి అంగీకరించిన హైకోర్టు బెంచ్, నివేదిక ప్రతులను అందుబాటులో ఉంచాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. APPSC Group 1 Evaluation Irregularities, AP High Court Group1, SIT Report, AP High Court, Andhra Pradesh SIT Report, TeluguOne

Publish Date: Aug 12, 2026 4:09PM

political-news-img

ఎన్టీఆర్ విధానానికి బ్రేక్.. స్థానిక ఎన్నికలపై ఏపీ ప్రభుత్వ పునరాలోచన..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విధానంపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో రాజకీయ చర్చ నడుస్తోంది. మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ అధ్యక్షుల ఎన్నికలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ద్వారా కాకుండా, ప్రజల ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాథమికంగా ఆలోచన చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు ఐదేళ్లపాటు స్థిరత్వం లభిస్తుందని, క్యాంప్ రాజకీయాలు, బలనిరూపణ ఘర్షణలు, పదే పదే వచ్చే అవిశ్వాస తీర్మానాలకు అడ్డుకట్ట పడుతుందని భావించారు. అయితే, ఈ నిర్ణయంపై అధికార కూటమిలోని శాసనసభ్యులు, మంత్రుల నుంచి భిన్నమైన సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంలో టోన్ న్యూస్‌లో ఆసక్తిర చర్చ జరిగింది. వ్యూహం అంతర్లీన పరిణామాలు.. ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయం వెనుక రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, సంపూర్ణ ప్రజామోదం పొందిన నాయకులను స్థానిక పరిపాలనలో భాగస్వామ్యులను చేయడం ముఖ్య ఉద్దేశం. కానీ, క్షేత్రస్థాయి సమీకరణలు ఈ ఆలోచనకు సవాలుగా మారాయి. ఎమ్మెల్యేల ఆందోళన & ప్రచార భారం: ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే, ప్రతి మండలంలోనూ ఎమ్మెల్యే స్థాయి ప్రచారం, భారీ ఖర్చు అవసరమవుతాయి. ఇప్పటికే నాలుగు-ఐదు మండలాల బాధ్యత చూసే ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలు కూడా అసెంబ్లీ ఎన్నికలంత భారంగా మారే అవకాశం ఉంది. క్యాంప్ రాజకీయం vs ఖర్చు నియంత్రణ: పరోక్ష పద్ధతిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలను గెలిపించుకుని, అనంతరం ఎంపీపీ లేదా జెడ్పీ ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవడం పార్టీ నాయకులకు సులువైన మార్గంగా కనిపిస్తుంది. ధన, బల ప్రయోగాలతో కొన్ని స్థానాలను గెలుచుకోవడం పరోక్ష విధానంలో సాధ్యమవుతుందనేది వారి భావన. కార్యకర్తల అసంతృప్తి & క్షేత్రస్థాయి పరిస్థితులు: ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో హామీల అమలు సవాళ్లు, కరువు పరిస్థితులు, కేడర్‌లో ఉన్న అసంతృప్తి నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రతిఫలించే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. లోకేష్ సమక్షంలో జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశాల్లోనూ, అనధికారిక క్యాబినెట్ చర్చల్లోనూ ఎమ్మెల్యేలు తమ సందేహాలను స్పష్టం చేశారు. దీని ఫలితంగా, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రత్యక్ష ఎన్నికల విధానం కంటే పాత పరోక్ష పద్ధతినే కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం.. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదా పరోక్ష పద్ధతికే ప్రాధాన్యమివ్వడం అనేది రాబోయే స్థానిక సంస్థల సమరంలో కీలక పరిణామాలకు దారితీస్తుంది.పాలనా స్థిరత్వానికి గండి: పరోక్ష ఎన్నికల వల్ల ఎన్నికల అనంతర క్యాంప్ రాజకీయాలు, పార్టీ ఫిరాయింపులు మళ్లీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం మారిన ప్రతిసారీ స్థానిక సంస్థల అధ్యక్షులపై అవిశ్వాస తీర్మానాలు పెట్టే సంస్కృతి కొనసాగుతుంది. కూటమికి తక్షణ ఉపశమనం, దీర్ఘకాలిక సవాలు: తక్షణమే ప్రత్యక్ష ఎన్నికల రిస్క్ తీసుకోకుండా పరోక్ష పద్ధతికి వెళ్లడం వల్ల కూటమి ఎమ్మెల్యేలకు ఆర్థిక, ప్రచార ఉపశమనం లభిస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో గెలిచిన ప్రతినిధులను కాపాడుకోవడం పార్టీ యంత్రాంగానికి పెద్ద పరీక్షగా మారుతుంది. ప్రతిపక్షాలకు అవకాశం: పరోక్ష విధానంలో స్థానిక సమస్యల కంటే అధికార బలం ప్రయోగించే అవకాశాలు ఉన్నందున, ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి దీనిని రాజకీయ ఆయుధంగా మలచుకునే అవకాశం ఉంది. అంతిమంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు ప్రత్యక్ష ఎన్నికలే సరైన మార్గమైనప్పటికీ, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పరోక్ష విధానమే ఊపిరి పోసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. AP Local Body Elections, CM Chandrababu Naidu, Local Elections Plan, Direct Elections AP, MPP ZP Chairman Elections, TDP Local Elections Strategy, AP Politics

Publish Date: Aug 12, 2026 3:53PM

political-news-img

అసెంబ్లీ బహిష్కరణ కొనసాగింపునకే వైసీపీఎల్పీ సమావేశం నిర్ణయం.!

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వైసీపీ శాసనసభాపక్షం బుధవారం (ఆగస్టు 12)న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాధారణంగా ఏ పార్టీ అయినా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీంతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అనగానే.. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు స్వస్తి చెప్పి సభకు హాజరు కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అయితే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మాత్రం అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడూ ప్రతిపక్ష హోదాపై స్పష్టత రానందున సభను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. 2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్య సభ్యులతో సభలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకావం ఇసుమంతైనా లేదు. అయితే వైసీపీ మాత్రం నిబంధనలతో పని లేకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ డిమాండ్ తో నే అసెంబ్లీ బహిష్కరణ చేస్తున్నది. శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది. ముఖ్యంగా మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వాన్ని మండలిలో నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. AP Assembly, Monsoon Sessions, YSRCP Boycott, Jagan Leader of Opposition Status, AP Legislative Council, TeluguOne

Publish Date: Aug 12, 2026 3:46PM

political-news-img

కేసీఆర్ మనవడు హిమాన్షు టాలీవుడ్ ఎంట్రీ.!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్ ఎంట్రీపై ముహూర్తం ఖరారైపోయిందా? అంటే సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల నుంచీ ఔనన్న సమాధానమే వస్తోంది. కల్వకుంట్ల హిమాన్షు సినీ ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల హిమాన్షు సంగీత ప్రతిభ తెలిసిందే. తన గానంతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. కల్వకుంట్ల హిమాన్సు పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం గానం, సంగీతమే కాకుండా..సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ హిమాన్షు చురుగ్గా ఉంటారు. బెహతర్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామిగా మారి 29 వేల 482 కిలోగ్రాముల రీసైకిల్ వ్యర్థాలను సేకరించి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే త గజ్వేల్ సమీపంలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలను 90 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో అభివృద్ధి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలి కాలంలో హిమాన్షు రావు తన ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ లుక్కే హిమాన్షురావు త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న ప్రచారం జోరందుకునేలా చేసింది. ఇప్పటికే కొందరు ప్రముఖ దర్శకులు ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి సినీ ఎంట్రీ కొత్తేం కాదు... ఇప్పఇకే మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకుడు హిమాన్షు రావు పొలిటికల్ గ్లామర్, మాస్ ఫాలోయింగ్ కేసీఆర్ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేయనున్నారన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. KTR grand son tollywood entry, KTR son Himanshu, Himanshu Rao Cine debut, Kalvakuntla Himanshu Rao transformation, TeluguOne

Publish Date: Aug 12, 2026 3:28PM

political-news-img

టీడీపీలో 35 ఏళ్ల ప్రస్థానం.. గొట్టిపాటి ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ ఒకరు. సుమారు 35 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి, క్యాడర్ సంక్షేమానికి నిశ్శబ్దంగా శ్రమిస్తున్న ఆయన, తాజాగా టోన్ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన వ్యూహాలు సిద్ధాంతాలపై విశ్లేషణాత్మకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు పదవుల కంటే పార్టీ సిద్ధాంతాలకు, ప్రజాసేవకే ప్రాధాన్యమిచ్చే నాయకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న వారిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ ఒకరు. సుమారు 35 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి, క్యాడర్ సంక్షేమానికి నిశ్శబ్దంగా శ్రమిస్తున్న ఆయన తాజాగా టోన్ న్యూస్ ఇంటర్వ్యూలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, తన వ్యూహాలు సిద్ధాంతాలపై విశ్లేషణాత్మకమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వర్తమాన రాజకీయ పరిస్థితి సవాళ్లు..! గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్ష నాయకులపై నమోదైన కేసులు ఎదురైన వేధింపుల నేపథ్యాన్ని ఈ సంభాషణ ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అనేకమంది నాయకులు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లీగల్ రంగంలో అనుభవం ఉన్న రామకృష్ణ ప్రసాద్, ఆ క్లిష్ట సమయంలో పార్టీ శ్రేణులకు చట్టపరమైన సలహాలు, సూచనలు అందిస్తూ అండగా నిలిచారు. మద్యం దందాలు, ఇసుక వ్యాపారాలు, వడ్డీ వ్యాపారాలు లేదా కాంట్రాక్టులకు దూరంగా ఉంటూ కేవలం సిద్ధాంత పునాదులపై రాజకీయాలు చేయడం నేటి రాజకీయ వాతావరణంలో ప్రత్యేకమైనదిగా పరిగణించవచ్చు. సోషల్ మీడియా దుర్వినియోగం, తప్పుడు ప్రచారాలు మరియు రాజకీయ కక్షసాధింపు చర్యలు ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రక్రియకు సవాలుగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యూహం అంతర్లీన అంశాలు..! రామకృష్ణ ప్రసాద్ అవలంబించిన రాజకీయ వ్యూహం వ్యక్తిగత ప్రతిష్ట లేదా స్వలాభం కంటే 'పార్టీ మరియు నాయకత్వం' అనే సూత్రం చుట్టూ తిరుగుతుంది.సమిష్టి నాయకత్వం: పార్టీలో ఎప్పుడూ వర్గ రాజకీయాలకు, సొంత గ్రూపులకు తావు ఇవ్వకపోవడం ఆయన ప్రధాన వ్యూహం. నాయకుడు, పార్టీ, క్యాడర్ బలపడితేనే వ్యక్తిగతంగా మనగలుగుతామనేది ఆయన విశ్వాసం. అంకితభావం - ప్రజాసేవ: 35 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పదవులు కోరుకోకపోవడం, పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా క్యాడర్‌లో విశ్వసనీయతను సంపాదించారు. చట్టపరమైన మద్దతు: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు చట్టబద్ధమైన పోరాటానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీ శ్రేణులకు ధైర్యాన్ని అందించారు.సొంత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేసే ఇలాంటి వ్యూహాలు సుదీర్ఘకాలంలో పార్టీకి దృఢమైన పునాదిని నిర్మిస్తాయి. ధనబలం, పదవీకాంక్షతో నడిచే రాజకీయాల కంటే విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు పార్టీ స్థిరత్వానికి తోడ్పడతాయి. చట్టసభల్లో అర్హత, నిబద్ధత కలిగిన నాయకులకు ప్రాతినిధ్యం లభిస్తే రాజకీయ వ్యవస్థలో సానుకూల మార్పులు వస్తాయనేది రామకృష్ణ ప్రసాద్ అభిప్రాయం. ఒకవేళ ఆయనకు శాసనసభ లేదా చట్టసభల్లో అవకాశం దక్కితే:పరిపాలనా సంస్కరణలు: చట్టపరమైన అవగాహన ఉండటం వల్ల సమర్థవంతమైన చట్టాల రూపకల్పనకు, పరిపాలనా సంస్కరణలకు దోహదపడవచ్చు. క్యాడర్‌లో నూతన ఉత్సాహం: దశాబ్దాలుగా కష్టపడిన క్షేత్రస్థాయి నాయకులకు తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకం కార్యకర్తల్లో పెరుగుతుంది. ఇది పార్టీ క్రమశిక్షణను మరింత బలోపేతం చేస్తుంది.నాణ్యమైన రాజకీయం: ధనబలం కంటే సేవ, సిద్ధాంతాలకే ప్రాధాన్యత ఉందనే సందేశం భవిష్యత్ తరాల నాయకులకు అందుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా క్లిష్ట సమయాల్లో అండగా నిలిచిన నాయకులను ప్రోత్సహించడం వల్ల భవిష్యత్తులో పార్టీ స్థిరత్వం, ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతాయి. Gottipati Ravi, TDP, Telugu Desam Party, 35 Years Political Journey, Gottipati Comments, Andhra Pradesh Politics, TDP Leader, Political Career

Publish Date: Aug 12, 2026 3:22PM

MOVIE NEWS