political-news-img

బహ్రెయిన్ లోని అమెజాన్ డేటా సెంటర్ పై ఇరాన్ దాడి.!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. అమెరికా, ఇరాన్ మధ్య రగులుతున్న ప్రతీకార దాడులు గల్ఫ్ రీజియన్ ను అగ్నిగోళంలా మార్చేశాయి. అమెరికా చేపట్టిన వైమానిక దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా వ్యాప్తంగా భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ జార్డన్ భూభాగంలో ఉన్న అమెరికన్ మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. నాసర్ 2 అనే పేరుతో చేపట్టిన ఈ రహస్య సైనిక ఆపరేషన్ ద్వారా శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ మెరుపు దాడి ఫలితంగా అక్కడ పనిచేస్తున్న అత్యాధునిక రాడార్ నియంత్రణ వ్యవస్థలతో పాటు విమాన నిల్వ కేంద్రాలలో సిద్ధంగా ఉన్న ఎఫ్ 15 పోరాట విమానాలుధ్వంసమైనట్లు సమాచారం. ముఖ్యంగా రుక్బాన్ సరిహద్దు ప్రాంతంలో నెలకొల్పిన ప్రధాన అమెరికన్ సైనిక ప్రాంగణంపై జరిగిన క్షిపణి దాడుల ధాటికి పలువురు అమెరికా సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు. మరోవైపు కువైట్ లో కూడా ఇరాన్ బలగాలు ఆపరేషన్ లైట్నింగ్ ప్రత్యేక దాడి చేశాయి. ఈ దాడిలో కువైట్‌లోని అమెరికన్ మిలిటరీ క్యాంపులైన అరిఫ్జాన్, అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌లలో ఏర్పాటు చేసిన ఎయిర్ డిఫెన్స్ కవచాలు, కమ్యూనికేషన్ టవర్లు, రాకెట్ లాంచర్ వ్యవస్థలను ధ్వంసం అయినట్లు సమాచారం. ఇంకా అలీ అల్-సలేమ్ ఎయిర్ బేస్‌లోని రీపర్ డ్రోన్ నిల్వ కేంద్రంపై జరిపిన దాడిలో అనేక అధునాతన నిఘా , దాడి డ్రోన్లు ధ్వంసమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. ఇరాన్ అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధం ఆరంభమైందని ప్రకటించింది. మిడిల్ ఈస్ట్ నుంచి అమెరికా తన దళాలను, మిలిటరీ సామాగ్రిని పూర్తిగా ఉపసంహరించుకునే వరకూ తమ ప్రతిదాడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. US Iran War, Gulf Conflict Escalation, Amazon Data Center Attack Bahrain, Jordan US Military Base Strike, Middle East Tension

Publish Date: Jul 21, 2026 7:03PM

political-news-img

హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు

హై ప్రోటీన్ కోసం ఖరీదైన ఫుడ్స్ అవసరం లేదు! ఈ మినుముల పులగమే చాలు మినుముల పులగం అనేది మన సంప్రదాయ ఆహారాల్లో ఎంతో విలువైనది. ఇది శరీరానికి అవసరమైన ప్రోటీన్, బలం, శక్తిని అందించే సహజమైన ఆహారం. ముఖ్యంగా శారీరక బలహీనత, కండరాల బలం తగ్గడం, అలసట వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పోషకాహారంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చిటిబొట్ల మధుసూదన్ శర్మ గారు మినుముల పులగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను సులభంగా వివరించారు. మినుములలో ఉండే అధిక ప్రోటీన్ శరీర కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికి, శక్తి పెరగడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: మినుముల పులగం ఆరోగ్యానికి ఎందుకు మంచిది? ఇందులో ఉండే పోషక విలువలు ఏమిటి? అధిక ప్రోటీన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? మినుముల పులగాన్ని ఎలా తయారు చేయాలి? ఎవరు తినాలి? ఎవరు పరిమితంగా తీసుకోవాలి? ఆయుర్వేదం ప్రకారం దీనిని తీసుకునే సరైన విధానం ఏమిటి? సహజమైన ఆహారంతో శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. గమనిక: ఈ వీడియోలో చెప్పిన విషయాలు ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

Publish Date: Jul 21, 2026 5:55PM

political-news-img

జెన్ జడ్ ఉద్యమానికి పరిమిత మద్దతు.. రాహుల్ చేజార్చుకున్న అవకాశం.!

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత కొన్ని రోజులుగా యువత చేపట్టిన ఉద్యమానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడంలో కాంగ్రెస్ వెనుకబడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఇండియాలో జన్ జడ్ చేపట్టిన అతి పెద్ద ఆందోళనను అవకాశంగా మలచుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభలో ప్రధాన పత్రిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ యువత ఉద్యమం విషయంలో స్పందించిన తీరు, ప్రకటించిన పరిమిత మద్దతు కాంగ్రెస్ కు అందివచ్చిన బంగారు అవకాశాన్ని ‘చే’జారేలా చేశాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఈ ఉధృత పోరాటాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు యువత పార్లమెంట్ ముట్టడికి పిలుపునిచ్చిన తరువాత కూడా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ వారికి మద్దతుగా కేంద్రాన్ని నిలదీయడంలోవిఫలమయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ వేదికగా మారుమోగుతున్న యువత ఉద్యమానికి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఆప్ అధినేత అరవిద్ కేజ్రీవాల్, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వంటి నేతలైతే.. స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహిస్తున్న యువతను కలిసి సంఘీభావం ప్రకటించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం జంతర్ మంతర్ నిరసన శిబిరానికి వచ్చి యువతకు సంఘీభావం తెలపలేదు. ఇదే విషయం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. పోలీసుల చర్యలు, ఉద్రిక్తతల మధ్య గాయపడిన కొందరు యువకులను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించినప్పటికీ రాహుల్ గాంధీ.. ఆందోళన జరుగుతున్న జంతర్ మంతర్ వద్దకు వెళ్ల లేదు. కేవలం మీడియా ముందు మాట్లాడటానికి, ప్రకటనలు విడుదల చేయడానికి మాత్రమే ఆయన పరిమితమయ్యారు. ప్రభుత్వంపై సమరశంఖం పూరించిన యువజనంతో నేరుగా మమేకం కాకుండా మద్దతు ప్రకటనలకు పరిమితం కావడం ద్వారా పొలిటికల్ మైలేజీకి ఈ ఉద్యమాన్ని ఊతం చేసుకోవడంతో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా ఉన్న యువతలో నెలకొన్న ఆందోళనను, వారి ఆగ్రహాన్ని సరైన దిశలో నడిపించగలిగితే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి అపారమైన రాజకీయ ప్రయోజనం లభించేది. అదే సమయంలో ఒక జాతీయ స్థాయి అగ్రనేత తమ మధ్యకు వస్తే, పోరాటం చేస్తున్న యువకులకు సైతం కొండంత అండ లభించేది. ఈ పరిణామం ఉభయతారకంగా ఇరు వర్గాలకు ఎంతో ఉపయోగపడేది. కానీ, రాహుల్ గాంధీ జంతర్ మంతర్‌కు వెళ్లకుండా దూరంగా ఉండటం వల్ల ఆందోళనకు కావాల్సిన స్థాయిలో ఊపు లభించకపోగా, కాంగ్రెస్‌కు దక్కాల్సిన మైలేజ్ కూడా దక్కకుండా పోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకుముందు రైతు చట్టాల రద్దు కోసం జరిగిన ఏడాది కాలపు రైతాంగ ఉద్యమంలో కానీ, మణిపూర్ హింసాకాండ బాధితుల పరామర్శలో కానీ రాహుల్ గాంధీ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు అండగా నిలిచారు. పార్లమెంట్ లోపలా, వెలుపలా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ దూకుడు ప్రదర్శించారు. గతంలో అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై స్వయంగా వీధుల్లోకి వచ్చిన రాహుల్, ఇప్పుడు అత్యంత కీలకమైన యువజన సమస్యపై మాత్రం జంతర్ మంతర్ ప్రాంగణానికి దూరంగా ఉండటం విచిత్రంగా కనిపిస్తోంది. మీడియా వేదికలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించినంత మాత్రాన క్షేత్రస్థాయిలో ఉద్యమ తీవ్రత పెరగదని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ వీధుల్లో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. ఈ దశలో ప్రతిపక్షాలు క్షేత్రస్థాయిలో నేరుగా పాల్గొనకపోతే, అధికార పక్షం ఈ ఆందోళనలను మరింత సులువుగా అణచివేసే ప్రమాదం ఉందని నిరసనకారులు భావిస్తున్నారు. అధికార ప్రతిపక్షాల నడుమ పార్లమెంట్ సమావేశాల్లో రసాభాస జరుగుతున్న నేపథ్యంలో, వెలుపల ఉవ్వెత్తున లేస్తున్న ప్రజా సమస్యలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ప్రతిపక్షం చూపుతున్న మందకొడి వైఖరిపై సొంత పార్టీ వర్గాల్లో కూడా అంతర్గతంగా అసంతృప్తి వ్యక్తమవుతోందని సమాచారం. ముందుముందు జరగబోయే రాజకీయ పరిణామాల దృష్ట్యా రాహుల్ గాంధీ తన వ్యూహాన్ని మార్చుకుని నేరుగా జంతర్ మంతర్ ఉద్యమ క్షేత్రంలోకి దిగుతారా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యువత సమస్యలను కేవలం రాజకీయ ప్రసంగాలకే పరిమితం చేయకుండా, స్వయంగా వారితో కలిసి పోరాటంలో పాల్గొంటేనే నిజమైన ప్రతిపక్ష నేతగా ప్రజలలో మరింత నమ్మకం ఏర్పడుతుందని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే ఎన్నికలు, పార్లమెంట్ లోపల వెలుపల జరగబోయే పోరాటాల దృష్ట్యా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధి, ఉద్యోగ పోరాటంలో ఉన్న యువతకు నేరుగా అండగా నిలబడుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది. Jantar Mantar Protest Delhi, Rahul Gandhi Youth Protest, Leader of Opposition Strategy, Opposition Leaders Support

Publish Date: Jul 21, 2026 5:48PM

political-news-img

బాల బాబాయ్ గెట్ వెల్ సూన్.. జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగ స్పందన.!

హిందుపురం ఎమ్మెల్యే, నటసింహం నందమూరి బాలకృష్ణ షూటింగ్‌లో గాయపడటం పట్ల యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలా బాబాయ్ త్వరగా కోలుకుని వెండితెరపై సింహంలా గర్జించాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణలో బాలయ్య గాయపడిన సంగతి తెలిసిందే. బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నందమూరి కుటుంబ సభ్యులు కూడా బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బాబాయ్ త్వరగా కోలుకుని, షూటింగ్ సెట్స్‌లోకి మళ్లీ సందడి చేయాలని ర్కొన్నారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ బాలకృష్ణకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తేరుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా షూటింగ్ తో గాయపడిన బాలయ్య, వైద్యుల సలహా మేరకు కొద్దిరోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోనున్నారు. అలాగే.. బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా నందమూరి అభిమానులు, సినీ దిగ్గజాలు, రాజకీయనాయకులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. Get Well Soon Bala Babai, Jr NTR Tweet, Balakrishna, Nandamuri Balakrishna Injury, Movie Shooting Injury

Publish Date: Jul 21, 2026 5:27PM

political-news-img

ఏపీ ఈడీబీతో యూఏఈ అవగాహనా ఒప్పందం..!

ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సమక్షంలో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు, విదేశీ వాణిజ్యం సహా యూఏఈకి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ఈ ఒప్పందం కుదిరింది. ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుపై ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో యూఏఈ ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. ఈ ఏడాది జనవరిలో దావోస్ పర్యటనలో ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి యూఏఈ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆహారశుద్ధి రంగంలో ఏపీలో వ్యాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యూఏఈ నిర్ణయించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేస్తూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మామిడి, అరటి, కోకో లాంటి వివిధ ఉద్యాన ఉత్పత్తులకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, విలువ జోడించిన ఉత్పత్తుల ఎగుమతులు, వాణిజ్యం లాంటి అంశాల్లో ఈ ఎంఓయూ సహకరించనుంది. ఈ ఒప్పందంలో తొలి అడుగుగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏపీలోని చిత్తూరులో రూ.100 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చింది. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ ప్రపంచ శ్రేణి ఉత్పత్తులను తయారు చేయనుంది. దుబాయ్, యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ దాదాపు 25 దేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఏపీలో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి కూడా అంతర్జాతీయ మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేయనుంది. క్వాంటం స్పీడ్ తో అవకాశాలు అందుకోండి.. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనపరిచిన యూఏఈ ఆరు నెలల్లోగా వాటిని సాకారం చేసే దిశగా ముందుకు వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులకు ఏపీ వేదిక కావటం సంతోషదాయకమని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యాన, ఆక్వా, ఐటీ రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని వైవిధ్యమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాది పొడవునా వివిధ రకాల ఉద్యాన ఉత్పత్తులు సాగు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. రాష్ట్ర స్థూల ఆదాయంలో 30 శాతం మేర ఉద్యాన, వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా వస్తోందని చెప్పారు. రూ. 1 లక్ష కోట్ల ప్రభుత్వం, ప్రైవేటు పెట్టుబడితో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. రిలయన్స్ సంస్థ భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్-ISAను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వివరించారు. 200కు పైగా ఉద్యాన క్లస్టర్లతో అక్వా మిర్చి, పామాయిల్, కోకో, కాఫీ తదితర పంటల్లో ఏపీ ఎగుమతులు చేస్తోందని సీఎం యూఏఈ ప్రతినిధి బృందానికి వివరించారు. కృష్ణా-గోదావరి డెల్టాలో నిరంతర నీటి సరఫరా కారణంగా వ్యవసాయ ఉత్పత్తి సాధించగలుగుతున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏపీకి ఓ విధానంగా మారిపోయిందని తెలిపారు. ప్రగతిశీల విధానాల వల్ల దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయన్నారు. పోర్టులు, రైల్వై, రోడ్డు వ్యవస్థతో ఏపీ లాజిస్టిక్స్ కేంద్రంగా మారిందని అన్నారు. ఆగస్టు 1 తేదీ నుంచి ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీలో అందుబాటులోకి వస్తోందని వివరించారు. విస్తృతమైన వనరులతో వివిధ రంగాల్లో విస్తృత వ్యాపార అవకాశాలను అందించేందుకు ఏపీ సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి యూఏఈ బృందానికి తెలిపారు. క్వాంటం స్పీడ్ తో అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్న అమరావతిని మరో నివాసంగా మార్చుకోవాలని యూఏఈ ప్రతినిధులను సీఎం కోరారు. ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్.. కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. భారత్- యూఏఈ వాణిజ్య బంధంలో భాగంగా ఏపీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేలా పని చేస్తున్నామని తెలిపారు. ఏపీలోని రొయ్యలు, అరటి లాంటి ఉద్యాన ఉత్పత్తులు వాణిజ్యంలో కీలకంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ఫుడ్ పార్క్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు వివరించారు. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ సహా వివిధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. సీఎం చంద్రబాబు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తూ వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని ప్రోత్సహించటం సంతోషదాయకమని ఆయన ప్రశంసించారు. అమరావతి నుంచి న్యూయార్క్ మార్కెట్ వరకూ కు డెయిరీ, పౌల్ట్రీ, సీఫుడ్ , పప్పు దినుసులు తదితర రంగాల్లో ఎగుమతులపై దృష్టి పెడతామని అన్నారు. కృష్ణపట్నం, కాకినాడ నుంచి యూఏఈకి షిప్పింగ్ రూట్లోనూ వాణిజ్యం మరింత పెరిగేందుకు సహకరిస్తామని యూఏఈ మంత్రి తెలిపారు. ఏపీ-యూఏఈల మధ్య బంధం మరింత వేగంగా బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ స్పష్టం చేశారు. ఈ అవగాహనా ఒప్పందం కార్యక్రమంలో యూఏఈకి ఫుడ్ క్లస్టర్ చైర్మన్ సలేహ్, యూఏఈ సహాయ కార్యదర్శి మారియా అల్ ఖాసిమ్, స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ అనూషా అల్ మర్జూఖీ, యూఏఈ ఎంబసీ నుంచి అహ్మద్ అల్ జ్నేబీ, ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, సీఎస్ సాయి ప్రసాద్ , పరిశ్రమలు, ఈడీబీ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Publish Date: Jul 21, 2026 5:26PM

political-news-img

వైసీపీలో ‘కాపు’ కలవరం.!

వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారా? సొంత పార్టీ లైన్ నే దాటుతూ, పార్టీ అధినేతకు తమ ధిక్కార స్వరం వినిపిస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తున్నది. పార్టీలో కాపు సామాజికవర్గ నేతల తీరు వైసీపీకి గుబులు పుట్టిస్తోందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీసీకి చెందిన కాపు సామాజికవర్గ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పార్టీ లైన్ ను ఇసుమంతైనా ఖాతరు చేయకుండా కాపు ఐక్యత జెండాను భుజానకెత్తుకోవడం పార్టీలో కలకలం రేపింది. ఒక వైపు వైసీపీ అధినేత జగన్.. అంబటి రాంబాబును పార్టీలో కాపు సామాజికవర్గ ఐకాన్ గా ప్రమోట్ చేస్తుంటే.. తోట త్రిమూర్తులు ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలను వేదిక చేసుకుని పార్టీలతీతంగా కాపు నేతలందరూ ఐక్యం కావాలని పిలుపునివ్వడం పార్టీలో కలకలం రేపింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో నిర్వహించతలపెట్టిన కాపుల ఐక్యత సభకు తాను హాజరవుతానని తోట త్రిమూర్తులు ప్రకటించడం వైసీపీకి మింగుడు పడటం లేదు. వైసీపీ అధినేత జగన్ నిర్ణయాలతో సంబంధం లేకుండా తోట త్రిమూర్తులు స్వతంత్రంగా కాపు సామాజికవర్గ ఐక్యత నినాదంతో ముందుకు సాగుతుండటంతో వైసీపీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అదు విధంగా వైసీపీలో సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం కాపు రిజర్వేషన్లు, కాపు సామాజిక వర్గ హక్కుల విషయంలో ఇండిపెండెంట్ లైన్ తీసుకోవడం కూడా వైసీపీలో కలవరం రేపుతోంది. కాపు సామాజికవర్గానికి మేలు జరగాలంటే.. హక్కుల కోసం పోరాడాలి అంటూ బొత్స సంచలన వ్యాఖ్యలు చేశారు. ముద్రగడ సంస్మరణ సభలు వేదికగా తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ లు జ్యోతుల నెహ్రూతో వేదిక పంచుకోవడం, తోట త్రిమూర్తులు బోండా ఉమా ఆధ్వర్యంలో కాపు ఐక్యత సభకు హాజరౌతానని ప్రకటించడంతో.. రానున్న రోజులలో కాపు సామాజికవర్గ ఐక్యత రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. ఉన్నట్లుగా కనిపిస్తోంది. Tense in ycp, botsa, totatrimurthulu, Kapu, Leaders, Cross, Partyline Telugu One

Publish Date: Jul 21, 2026 4:52PM

MOVIE NEWS