కడపజిల్లా కాంగ్రెస్ పార్టీకి కొద్దో, గొప్పో కార్యకర్తల బలం ఉన్న నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే గంటి ప్రసాద్ ఒకరు. రైల్వే కోడూరు ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టును ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం ఈశ్వరయ్యకు టిక్కెట్టు కట్టబెట్టడంతో గంటి ప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జిల్లాలో చాలామంది నేతలకు పదవులు ఇచ్చి న్యాయం చేసిన పార్టీ మాజీ ఎమ్మెల్యేగా పార్టీని నమ్ముకుని ఉన్న తనకు గుర్తింపు ఇవ్వడంలేదన్న అసంతృప్తితో గంటి ప్రసాద్ ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు గంటి ప్రసాద్ ను తమ పార్టీలోకి రప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వై.ఎస్. జగన్ కు సమీప బంధువైన ఒక నాయకుడు గంటి ప్రసాద్ తో ఇప్పటికే చర్చలు జరిపినట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు కలవరానికి గురవుతున్నారు. ఎన్నికలకు ముందు గంటి ప్రసాద్ పార్టీని వీడితే రైల్వేకోడూరులో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంటుందని వారు భయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/call-from-ysr-congress-to-ganti-prasad-of-congress-24-13891.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!