జగన్ అరెస్టుపై పందాలు ...

Publish Date:Apr 12, 2012

Advertisement

కాదేది కవితకనర్హం అని మహాకవి అంటే నేటి పందాల రాయుళ్ళు మాత్రం ఐ.పి.ఎల్. క్రికెట్ పోటీల నుంచి జగన్ అరెస్టు వరకు తమ జూదాలకు కాదేదీ అనర్హమంటున్నారు. అక్రమ ఆస్తులు, అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత, పార్లమెంట్ సభ్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అరెస్టు అవుతారా? లేదా? అనే అంశంపై కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చర్చజరుగుతోంది. పందాల రాయుళ్ళు మరో అడుగు ముందుకువేసి ఏకంగా పందాలు కాస్తున్నారు.

కోవూరు ఉప ఎన్నికల్లో మెజారిటీపై పందాలు కాసి లాభాలు పొందినవారు నేడు జగన్ అరెస్టుపై పందాలు కాస్తున్నారు. సిబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ లో విజయసాయి రెడ్డి రెండో ముద్దాయిగా వున్నారు. రెండో ముద్దాయిగా వున్న విజయసాయిరెడ్డిని అరెస్టు చేయడంలో చూపిన శ్రద్ధ మొదటి ముద్దాయి జగన్ ను అరెస్టు చేయడంలో మీనమేషాలు లెక్కించడాన్ని బట్టి జగన్ ను అరెస్టు చేయడానికి సిబీఐ, కేంద్రప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అరెస్టు చేసేవారైతే ఈపాటికే అరెస్టు చేసేవారని. అందువల్ల ఇక జగన్ అరెస్టు కారని చెబుతూ ఈ మేరకు సవాల్ చేస్తూ పందాలకు సిద్ధం అవుతున్నారు. కొంచెం ఆలశ్యమైనా జగన్ అరెస్టు కాకతప్పదని ఇతరపార్టీ కార్యకర్తలు అంటున్నారు. జగన్ అసలు అరెస్టుకారాని పందాలు కాస్తుంటే మరికొందరు రానున్న 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తారని, మరికొందరు ఉప ఎన్నికలకు ముందే అరెస్టు అవుతారంటూ పందాలు కాస్తున్నారు. పందాల సంగతి ఎలా వున్నప్పటికీ వేలకోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నట్టు సిబీఐ అధికారులు స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా జగన్ ను అరెస్టు చేయకపోతే ప్రజాస్వామ్యం పట్ల, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలలో నమ్మకం లేకుండా పోతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో అధికారులను అరెస్టు చేసినంత సులభంగా రాజకీయ నాయకులను అరెస్టు చేయకపోవడం పట్ల కూడా ప్రజలలో చర్చ జరుగుతోంది.

By
en-us Political News

  
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు.
విచారణ తర్వాత ఆ భూములని దళితులకు పంచుతాము..!
సినీ ప్రపంచాన్నే గడగడలాడించడమే కాకుండా పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ రవిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.