అప్పుడు కేంద్రం... ఇప్పుడు ట్రిబ్యునల్... జగన్ సర్కారుకు దెబ్బ మీద దెబ్బ..!

Publish Date:Sep 3, 2019

Advertisement

 

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మొండిగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునసమీక్షిస్తూ రద్దు చేస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి విద్యుత్ అప్పిటల్ ట్రిబ్యునల్ షాకిచ్చింది. సౌర-పవన విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయొద్దని ఏపీ గవర్నమెంట్ ను ఆదేశించింది. అలాగే పీపీఏలపై ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాల్సిన అవసరం లేదని రెగ్యులేటరీ కమిషన్‌కు తేల్చిచెప్పింది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలను యథాతథంగా కొనసాగించాలని జగన్ సర్కారును ఆదేశించింది. పీపీఏల రద్దుపై మూడు కంపెనీలు అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ఈ ఆదేశాలిచ్చింది.

పీపీపీలను పునసమీక్షిస్తూ పలు సోలార్, విండ్ విద్యుత్ కంపెనీలకు జగన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో... అనంతపురం, కడపకి చెందిన మూడు కంపెనీలు... ఎస్‌బీఈ, అయన, స్పింగ్ కంపెనీలు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, భవిష్యత్ లో తాము అనేక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నాయి. అంతేకాదు పీపీఏలను సమీక్షించడమంటే... తమపై నమ్మకం లేకపోవడమేనని... ఇది తమ కంపెనీలకు తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ ట్రిబ్యునల్ ముందు కంపెనీలు వాదనలు వినిపించాయి. దాదాపు రెండు నెలలుగా సాగిన ఇరుపక్షాల వాదనలను విన్న విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్.... పీపీఏలను రద్దు చేయొద్దంటూ జగన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని సూచించింది.

ఏదేమైనా పీపీఏల సమీక్ష, రద్దు నిర్ణయాలపై జగన్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. జపాన్ లేఖతో ఇప్పటికే  కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వగా, ఇఫ్పుడు ఏకంగా విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునలే షాకిచ్చింది. మరి అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలపై జగన్ సర్కారు ఏవిధంగా స్పందిస్తుందో... ఎలా ముందుకెళ్తుందో చూడాలి.
 

By
en-us Political News

  
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
అధికారం కోల్పోయిన తర్వాత ప్రజల్లో సానుభూతిని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని శాంతిభద్రతల విషయంలో ఇరకాటంలో పెట్టడానికే వైసీపీ ఈ బాట ఎంచుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ప్లస్ అవ్వడం అటుంచి బూమరాంగ్ అవుతూ.. ఆ పార్టీకి మరింత వ్యతిరెకత జనంలో కలగడానికి మాత్రమే దోహదపడుతున్నదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాజకీయంగా తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్.. తాజాగా చంద్రబాబు పాలనా దక్షత, ఆయన ముందుచూపును అభినందించారు. కేటీఆర్ చంద్రబాబును అభినందించడం తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన హిట్ అండ్ రన్ కేసు విషయంలో జగన్ మాట్లాడిన మాటలు అసలాయనకు చట్టాలు తెలుసా? ఈ వ్యక్తా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం చెలాయించింది అన్న అనుమానాలు కలగక మానవు.
యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టుపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఒక బహిరంగ వేదికపై తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వేదికపై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. జగన్ హయాంలో తీవ్రంగా నష్టపోయిన ఏబీవీ, ఇలా వైసీపీ నేతలతో కలిసి ఒకే వేదికపై కనిపించడం రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.