ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ మైండ్ గేమ్ బూమరాంగ్.!

Publish Date:Jul 10, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా యూట్యూబర్ ప్రశ్న రావణ్  అరెస్ట్, ఆ తర్వాత అతనికి విధించిన జ్యుడీషియల్ రిమాండ్ అంశం పెను సంచలనంగా మారింది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో ఉండే ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం వెనుక ఉన్న రాజకీయం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా అసభ్యకరమైన, మతపరమైన విద్వేషాలు రేకెత్తించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

అయితే, ఈ అరెస్ట్ ఉదంతాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పూర్తిగా బెడసికొట్టడమే కాకుండా బూమరాంగ్ అయ్యింది. ఒక విధంగా ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా సాగే బూతుల సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు సాగుతూ ప్రజామోదం పొందితే.. అదే విషయంలో క్షణానికో మాట మార్చిన చందంగా వెసీపీ వేసిన అడుగులు ఆ పార్టీలో స్థిరత్వ లేమినీ, గందరగోళాన్నీ, అయోమయాన్ని వెల్లడి చేసి.. వైపీపీ ప్రతిష్ఠను మసకబార్చింది. 

ప్రశ్న రావణ్ వ్యవహారంలో వైసీపీ తొలి నుంచీ తొందరపాటుగా వ్యవహరించడమే కాకుండా, రోజుకో స్టాండ్ మారుస్తూ ప్రజల ముందు చులకన అయ్యింది.  ప్రశ్న రావణ్ వ్యవహారాన్ని రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ.. ప్రశ్న రావణ్ గతంలో  వైసీపీ అధినేత జగన్ ను, వైసీపీ విధానాలనూ విమర్శించిన  పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..  ప్రశ్న రావణ్ ను తెలుగుదేశం   మద్దతుదారుడంటూ ప్రచారం చేసింది.  అయితే..  వైసిపి ఆడిన ఈ మైండ్ గేమ్ ఎక్కువ సేపు నిలవలేదు. టిడిపి శ్రేణులు అంతే వేగంగా కౌంటర్ ఇస్తూ, వైసిపి నేతల అసలు రంగును బయటపెట్టారు.

ఇక అక్కడ నుంచీ వైసీపీ ఒకదాని వెంట ఒకటిగా వరుస తప్పిదాలు చేసింది. ప్రశ్న రావణ్ విషయంలో పూటకోమాట, రోజుకో స్టాండ్ అన్నట్లుగా వ్యవహరించి వరుసగా సెల్ఫ్ గోల్స్ చేసుకుంటూ పోయింది.  ఒకవైపు ప్రశ్న రావణ్‌ను తెలుగుదేశం సానుభూతి పరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తూనే.. అతడి కుటుంబ సభ్యులు వైసీపీ అధినేత జగన్ ను కలవడం, వారితో భేటీ తరువాత.. జగన్ సోషల్ మీడియా వేదికగా హే రామ్..సేవ్ ఆంధ్రా అంటూ కూటమిపై విమర్శలు గుప్పించి ప్రశ్న రావన్ కు మద్దతుగా నిలవడం జరిగింది. అక్కడితో ఆగకుండా.. ప్రశ్న రావణ్ కు వైసిపి తరఫున పూర్తి లీగల్ సపోర్ట్ అందిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆ పార్టీకి చెందిన సీనియన్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు.   

వాస్తవానికి ప్రశ్న రావణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మత విద్వేష పూరిత ప్రచారాల పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అతని అరెస్టును సాధారణ ప్రజలు, నెటిజన్లు పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇలాంటి నెగిటివిటీ ఉన్న వ్యక్తి విషయంలో వైసిపి అనుసరించిన ద్వంద్వ వైఖరి ఆ పార్టీకే  నష్టం చేకూర్చింది.  ప్రశ్న రావణ్ విషయంలో   రోజుకో మాట మారుస్తూ.. ఒకరోజు అతను టిడిపి మనిషి అని, మరుసటి రోజే అతనికి జగన్ పూర్తి లీగల్ సపోర్ట్ ఇస్తారని చెప్పడం వైసిపి సోషల్ మీడియా ఎకోసిస్టమ్‌లో ఉన్న గందరగోళం, అయోమయాన్ని బహిర్గతం చేసింది.  

సానుభూతి రాజకీయాల కోసం ఆరాటపడి, సమాజంలో   వ్యతిరేకత ఉన్న వ్యక్తిని వెనకేసుకురావడం ద్వారా వైసిపి తన ప్రతిష్ఠను తానే మసకబార్చుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైసీపీ నాయకులు ప్రశ్న రావణ్ కు మద్దతుగా మాట్లాడిన పాత వీడియోలు బయటకు రావడంతో వైసీపీ ఫౌల్ గేమ్ బహిర్గతమైందనీ,  ఫలితంగా, ఈ సినారియోలో వైసీపీ తనకు ఉన్న అన్ని కార్డులను ప్రయోగించి కూడా అభాసుపాలైందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ycp self goal, ys jagan prashna ravan, ambati rambabu press meet, ap political news, Telugu One

By
en-us Political News

  
హరీష్ రావు అతి తొందరలో కారు దిగి కాషాయ జెండా పట్టుకుంటారనీ, ఆ దిశగా హరీష్ ఇప్పటికే బీజేపీ కీలక నేతలతో సంప్రదింపులు కూడా జరిపారనీ రేవంత్ పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలు అవాస్తవమని హరీష్ రావు భద్రాద్రి రామునిపై ఓట్టేసి చెప్పగలరా అని సవాల్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.