తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ మనవడు దగ్గుబాటి హితేష్.!
Publish Date:Jul 9, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేవబోతోంది. నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న యువనేత దగ్గుబాటి హితేష్ త్వరలోనే పసుపు కండువా కప్పుకో వడానికి సిద్ధమవుతున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దివంగత ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ పురందేశ్వరిల కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం. దశాబ్దాలుగా నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యాలు, అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో ఉన్న విభేదాలన్నీ ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయని, అందువల్లే హితేష్ రాజకీయ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని అంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న అంతరాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా కుటుంబంలో జరిగిన కొన్ని శుభకార్యాలు, ప్రత్యేక కలయికల తర్వాత విభేదాలన్నీ పక్కన పెట్టి.. అందరూ కలిసిపోయారు. ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో ఉన్న చంద్రబాబు నాయుడు, హితేష్ చెంచురాంను పార్టీలోకి ఆహ్వానిం చడంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హితేష్ తల్లి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ లో కీలక నేతగా, ఎంపీగా కొనసాగుతుండగా, తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ రాజకీయ పార్టీలోనూ యాక్టివ్గా లేరు. ఈ నేపథ్యంలో హితేష్ను నేరుగా తెలుగుదేశం పార్టీ ద్వారా యాక్టివ్ పాలిటిక్స్లోకి తీసుకురావాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. దగ్గుబాటి హితేష్ చెంచురాం రాజకీయ రంగ ప్రవేశం కోసం గతంలోనే ప్రయత్నాలు జరిగాయి. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఆయన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే.. ఆ సమయంలో సాంకేతిక కారణాల వల్ల, ముఖ్యంగా ఆయనకు సంబంధించిన సిటిజన్షిప్, కొన్ని డాక్యుమెంటేషన్ ప్రక్రియలు సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారిపోయింది. ఆ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో కూడా ఆయన పోటీకి దూరంగానే ఉన్నారు.ఇప్పుడు ఆ సాంకేతిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోవడంతో, హితేష్ చెంచరాం.. పర్చూరు లేదా బాపట్ల జిల్లా పరిధిలోని ఏదైనా కీలక నియోజకవర్గం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దశాబ్దాల కాలంగా ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి కుటుంబం మళ్లీ టిడిపి గూటికి చేరితే, ఆ ప్రాంతంలో పార్టీ క్యాడర్కు కొత్త ఉత్సాహం రావడం ఖాయమంటున్నారు. చంద్రబాబు నాయుడు కూడా హితేష్కు ఒక స్పష్టమైన భవిష్యత్తు హామీని ఇచ్చి, పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుగుదేశం వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్ మనవడిగా, ఉన్నత విద్యావంతుడిగా, స్పష్టమైన విజన్ ఉన్న యువకుడిగా హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీకి కొత్త మైలేజ్ తీసుకువస్తారని భావిస్తున్నారు. హితేష్ తెలుగుదశంలో చేరిక విషయంలో అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు. daggubati hitesh tdp, ntr grandson hitesh, daggubati purandeswari son, chandrababu naidu, ap politics
http://www.teluguone.com/news/content/ntrs-grandson-daggubati-hitesh-to-joins-telugu-desam-party-45-225523.html





