పరకాలలో టార్గెట్ గా మారిన 'కొండా'

Publish Date:May 12, 2012

Advertisement

పరకాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న తాజమాజీ కొండా సురేఖ పోటీలో ఉన్న మిగిలిన అన్నిపార్టీలకూ టార్గెట్ గా మారారు. ఒకవైపు ఈమె రాజీనామా వల్లే ఎన్నికలోచ్చాయని చెబుతూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అధినేత జగన్మోహనరెడ్డి అరెస్టు అయితే సురేఖ సంగతేంటని ఓటర్లను పలు పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా సురేఖకు నిలకడ ఉండదని ప్రచారమూ చేస్తున్నారు. జగన్ జైలుకు వెళితే ఆ పార్టీని నమ్మి మీరెలా ఓటేయగాలుగుటారో ఒక్కసారి ఆలోచించమని కరపత్రాలతోనూ ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా సరే మీకోసమే ఎన్నికల్లో నిల్చున్నానని చెబుతూ కొండా సురేఖ ఇంటింటికి తిరుగుతుంటే ఆమె ప్రచారం పూర్తికాగానే మిగలిన పార్టీలు వెళ్ళి పై ప్రశ్నలను సంధిస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ ధీమాగా పనిచేసిన వై.ఎస్.ఆర్. కార్యకర్తలు ఈ పార్టీల ప్రచారంవల్ల తమ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న సందేహంలో పడ్డారు.

 

సురేఖతో పాటు ప్రచార కార్యక్రమాలు ఆపకుండానే వీరందరూ తమ పరిస్థితిపై అంచనాలు వేసుకుంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి సురేఖతో పాటు బిజెపి, తెలుగుదేశం, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. అభ్యర్థులు రంగంలో ఉన్నారు. బిజెపి తన ఎన్నికల ప్రచారాన్ని భరోసాయాత్రతో ప్రారంభించింది. ఈనెల 25వ తేదీనుంచి జిల్లాస్థాయి ప్రముఖులతో ప్రచారాన్ని ముమ్మరం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

 

 

 

అలానే తెలుగుదేశం పార్టీ కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కొండా సురేఖ భవిష్యత్తు అగాథమేనని విమర్శిస్తోంది. ఆ పార్టీ సీనియర్లు మాజీమంత్రి కడియం శ్రీహరి, తెలంగాణా ఫోరమ్ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే పూజలతో ప్రచారం ప్రారంభించింది. జగన్ లానే సురేఖ కూడా ఇరకాటంలో పడటం ఖాయమని ఆ పార్టీ నాయకులు తమ ప్రచారంలో విమర్శిస్తున్నారు. చివరగా టి.ఆర్.ఎస్. తన మొత్తం ప్రచారంలో ఎక్కువభాగం కొండా సురేఖ రాజీనామా వల్లే ఎన్నికలోచ్చి ప్రజలపై భారం పడిందని విమర్శిచింది. పైగా ఆ పార్టీ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు అయితే కొండాను ఘాటుగా విమర్శించారు. అసలు జాక్ అంటే జగన్ యాక్షన్ కమిటీనా అని ఆయన సురేఖను ప్రశ్నించారు. ఈ జాక్ వల్లే ఎన్నికలోచ్చాయని ఓటర్లు గుర్తుంచుకోవాలని కోరారు.

By
en-us Political News

  
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.