LATEST NEWS
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత ఆరు నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిలు పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.
అయితే సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి ఆ యాంటిసిపేటరీ బెయిలు రద్దు అయ్యేలా చేశారు. మాధవరెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు రద్దు కావడంతో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగల్లోలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవరెడ్డి ఉన్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అరెస్టు సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని తిరుపతికి తరలించారు. మాధవరెడ్డి అరెస్టుతో ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు.
జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం అడ్డూ అదుపూలేకుండా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డూ అదుపూ లేకుండా భూకజ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందువరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరూ భయంతో వణుకుతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాల యంలో అగ్నిప్రమాద కుట్రకు తెరలేపారన్న అనుమానాలు ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో పైళ్ల దగ్దం ప్రమాదశాత్తూ జరగలేదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని తేలింది. ఆ ఫైళ్లకు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచరులే అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్నది వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభు త్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేసులోనే పెద్దరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్టయ్యారు. దీంతో తరువాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
వైసీపీ అధికారంలో ఉండగా అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్, లోకేష్లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ... మధ్యలో దివ్వెల మాధురి. ఈ ఫ్యామిలీ డ్రామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. మాధురితో కలిసి హైదరాబాద్లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా దువ్వాడపై జగన్ తీసుకున్నది క్రమశిక్షణ చర్యే అయితే.. ఆ పని ఎప్పుడో చేసి ఉండాలి. దివ్వెల మాదురి వ్యవహారంలో రచ్చకెక్కినప్పుడు సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇన్స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫొటోషూట్, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.
అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్ను పొగడటమే దువ్వాడపై వేటుకు కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు... లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్ను అంతగా పొడిగితే జగన్ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు.. ఇదేనేమో..?
ఏమిటీ సింధూ జలాల ఒప్పందం?
ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ లో ఏర్పడనున్న సంక్షోభాల తీవ్రత ఎంత?
ఇప్పటికే క్రికెట్ సంక్షోభంతో విలవిల ఇక ఆహార, ఆర్ధిక, సామాజిక, రాజకీయంగానూ అవస్థలేనా?
కొన్ని శతాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగతి. అప్పట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. సముద్ర జలాలపై ప్రయాణిస్తూ.. వివిధ రకాల ప్రాంతాల్లో సెటిలయ్యేవని అంటుంది మన పురాతన భౌగోళిక చరిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్రయాణిస్తూ వచ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టిందనీ.. అలా మనకు హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు. ఎప్పుడయితే ఇక్కడ మంచు శిఖరాలు ఏర్పడ్డాయో.. అప్పటి వరకూ ఎడారిలాంటి ఈ ప్రాంతంలోకి బిందువులు సింధువులుగా మారి.. ఒక ప్రవాహం ఏర్పడిందనీ.. తద్వారా ఇక్కడొక నాగరికత ఏర్పడిందనీ.. దాన్నే సింధూ నాగరికత అంటారనీ చెబుతుంది మన నైసర్గిక భౌగోళిక చరిత్ర.
ఎప్పుడైతే ఇక్కడ జల ప్రవాహం ఏర్పడిందో దాన్ని ఆశించి.. ఆఫ్ఘన్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి కొందరు జీవనాన్ని వెతుక్కుంటూ వచ్చారనీ.. వారే తర్వాతి కాలంలో ఆర్యులుగా అవతరించారనీ అంటారు. ఇక, ఆఫ్రికా ఖండంతో పాటు వచ్చిన వారు దక్షిణాదిన ద్రవిడులుగా స్థిరపడ్డారనీ చెబుతుంటారు. ఇది బేసిక్ ఆర్య ద్రవిడ థియరీ అయితే.. ఈ థియరీలో మేజర్ పార్ట్ సింధూ జలాలదే. ఈ జలాలను వెతుక్కుంటూ వచ్చిన వారే ఆర్యులుగా చెబుతుందీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం.
ఇదిలా ఉంటే కాలక్రమేణా ఉత్తర దక్షిణ భారతాలు కలసి ఒక దేశంగా ఏర్పడ్డం.. ఒకప్పట్లో అఖండ భారతంగా ఉన్న ఈ దేశం తర్వాతి రోజుల్లో పాక్, బంగ్లాతో పాటు శ్రీలంక, నేపాల్ అంటూ విడిపోయిందని అంటుంది మన సుదీర్ఘ కాల చరిత్ర.
1947 నాటి నుంచి మనం భారత్- పాకిస్థాన్ లు గా విడివడ్డాం. 1960ల కాలంలో నాటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా వచ్చిందే సింధూ నదీ జలాల ఒప్పందం. ఇప్పటి వరకూ మొత్తం మూడు సార్లు అంటే, 1965- 1971- 1999 భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగినా.. ఈ జల ఒప్పందాలు మాత్రం చెక్కు చెదరలేదు. మధ్యలో.. భారత్ పాక్ కి వచ్చిన జలవివాదం ఎలాంటిదంటే.. ఇది ప్రపంచ బ్యాంకు వరకూ వెళ్లింది. కిషన్ గంగ పై ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది భారత్. కిషన్ గంగ, రాట్లే ప్రాజెక్టులు నిర్మించిన భారత్ పై పాక్ ఆరోపణలు గుప్పించింది. అంతే తప్ప.. ఈ సింధూ జలాల ఒప్పందం మీద ఇంత వరకూ మనకూ పాకిస్థాన్ కి ఎలాంటి గొడవా రాలేదు. ఈ ఒప్పందం రద్దు అప్పుడప్పుడూ తెరపైకి వచ్చినా అవన్నీ తామరాకు మీద నీటిబొట్టులాంటిదే అయ్యింది.
అయితే ఇప్పుడు పహెల్గాం దాడి తర్వాత.. భారత్ ఈ జల ఒప్పందం నుంచి తప్పుకుంటే మొదట జరిగే పని.. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ వంటి నదీ జలాలు పాక్ కి వెళ్లకుండా కట్టడి చేసే అవకాశముంది. వీటిపై భారత్ మరింత విస్తృతంగా ప్రాజెక్టులు కట్టే ఛాన్సుంది. ఎప్పుడైతే.. ఈ డ్యాముల నిర్మాణం జరుగుతుందో అప్పటి నుంచీ పాకిస్థాన్ కి జల సంక్షోభం సంభవించే ప్రమాదముంది. ఎప్పుడైతే ఈ నదీ జలాల ప్రవాహం కట్టడి చేయబడుతుందో అప్పటి నుంచీ ఆహార సంక్షోభం మొదలౌతుంది. ఎప్పుడైతే ఆహార సంక్షోభం వస్తుందో ఆ నాటి నుంచి పాక్ లో కరవు విలయ తాండవం చేస్తుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు మటాష్ అయిపోతుంది. అంటే ఒక్క బొట్టు కూడా రక్తం చిందించకుండానే ఈ నిర్జల ఉత్పాతాన్ని సృష్టించవచ్చన్నమాట.
ఇది పాకిస్తాన్ తనకు తాను చేజేతులా చేసుకుంటున్న ఒకానొక దుశ్చర్య. పహెల్ గాం దుండగులు పాకిస్తాన్ సంబంధించిన వారేనంటూ ఇక్కడి నుంచి పాకిస్థాన్ దిశగా వెళ్లిన డిజిటల్ లింకులు చెబుతూనే ఉన్నాయి. దీని వెనక లష్కరే తోయిబాకి చెందిన రెసిస్టెంట్ గ్రూప్ ఉన్నా.. దీని మూలాలు పాక్ లోనే తేలుతున్నాయి. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, గతంలో ఈ దేశపు గూడాచార సంస్థ ఐఎస్ఐకి చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలోనే మునీర్ కి లష్కరే వంటి టెర్రరిస్టు గ్రూపులతో విపరీతమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అతడే ఈ దుశ్చర్యకు కర్త-కర్మ- క్రియ అంటూ కేవలం భారత్ మాత్రమే కాదు అమెరికా సైతం విశ్వసిస్తోంది.
ఒక పక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటిస్తుండగా జరిగిందీ ఉగ్ర దాడి. దీని వెనక పాక్ హస్తం ఉన్నట్టు గట్టిగా భావిస్తోన్న అమెరికా.. అంతే కాదు మునీర్ కీ లాడెన్ కీ పెద్ద తేడా లేదని యూఎస్ వాఖ్యానిస్తోందంటే.. ప్రపంచ స్థాయిలో పాక్ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు సింధూ జల ఒప్పందాల రద్దు ద్వారా పాకిస్థాన్ కి జరిగే నష్టం ఎలాంటిదో ఉదహరించడానికి.. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణే అతి పెద్ద ఉదాహరణ. భారత్ ఈ టోర్నీలో ఆడటానికిగానూ పాకిస్థాన్ భూభాగంలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పింది. దానికి తోడు రోహిత్ సైన ఫైనల్ కి చేరడంతో.. పాకిస్థాన్ లో జరగాల్సిన ఫైనల్ కాస్తా దుబాయ్ లో జరిగింది. దీంతో అప్పటి వరకూ పాక్ ఈ టోర్నీ కోసం పెట్టిన ఖర్చు మొత్తం వృధా అయ్యి... భారీ నష్టం మిగిలింది.
భారత్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇక సింధూ జలాలతో పాటు.. పాకిస్థాన్ లోని భారత దౌత్య అధికారుల ను సైతం తిరిగి రప్పిస్తున్నారు. ఇక్కడున్న పాక్ యాంబసీని కూడా పెట్టేబేడ సర్దుకోమంటున్నారు. అంతేనా దేశంలో ఉన్న పాకిస్తానీయులు, ఇతర పర్యాటకులను వారం లోగా దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
ఇకపై పాకిస్థాన్ కి గతంలో లా ఉండదు. పహెల్ గామ్ దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. ఇప్పటికే ఆ దేశం ఎల్ఓసీ దగ్గర భద్రత అప్రమత్తం చేసింది. ఇక ఏ ముహుర్తాన భారత సైనికులు ఏ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారో అన్న భయంకరమైన భయాన్ని అనుభవిస్తోందీ పాపిష్టి దేశం. ఒక పక్క మన రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంతకింత అనుభవిస్తారన్న హెచ్చరికలు జారీ చేసిన సమయాన.. ఎలాంటి భయానక పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందో అన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది పాకిస్తాన్ లో.
ఒక రకంగా చెప్పాలంటే ఇది తాత్కాలికం. సిందూ జలాల ఒప్పందం కారణంగా పాకిస్థాన్ నానాటికీ తీసికట్టుగా మారిపోతుంది. ఇటు జాలాల ఒప్పందం మాత్రమే కాకుండా, అటు దౌత్య పరమైన సంబంధాలన్నిటినీ భారత్ పూర్తిగా తెంచుకుంటే పాకిస్థాన్ పరిస్థితి వచ్చే రోజుల్లో అగమ్య గోచర పరిస్థితి ఎదుర్కోవడం ఖాయం.
ఇప్పటికే అమెరికా నుంచి నిధుల నిలిపివేత వేధన అనుభవిస్తోన్న పాకిస్థాన్ కి మిగిలిన దిక్కల్లా చైనా మాత్రమే. అలాగని పహెల్ గామ్ వంటి దాడులతో రెచ్చిపోతున్న పాక్ కి అది బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఇప్పటికే అమెరికా నుంచి విపరీతమైన సుంకాల దాడి ఎదుర్కుంటున్న చైనా.. తన కాళ్ల మీద తాను నిలబడ్డానికే ఆపసోపాలు పడుతుంటే.. పాకిస్థాన్ కి ప్రత్యక్ష సాయం చేసే ఛాన్స్ లేదు.
ఎందుకంటే భారత్ కూడా పొమ్మన లేక పొగబెడితే.. వరల్డ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ చైనా తాను చేసిన ప్రాడక్టులు తానే అమ్ముకోలేదు. పాకిస్తాన్ని ఆ దేశం దగ్గరకు చేర్చేదే.. అతి పెద్ద మార్కెట్ అయిన భారత్ ను నయానా భయానా ఒప్పించడానికి. ఇప్పుడు పాక్ విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించడంతో చైనా కూడా హ్యాండ్సప్ అనాల్సిందే.
వీటిన్నిటి దృష్ట్యా చూస్తే పాకిస్థాన్ వచ్చే రోజుల్లో చూసే సామాజిక- రాజకీయ- ఆర్ధిక- ఆహార- సంక్షోభం అతి భయంకరమైనదిగా అంచనా వేయక తప్పదు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఆర్మీకున్న అధికారాలను కత్తెరించి.. టెర్రరిస్టులను సమూలంగా ఏరి వేస్తే తప్ప... ఈ దేశానికి మరో మార్గాంతరం లేదు.
ALSO ON TELUGUONE N E W S
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన మారణ కాండ భారతదేశాన్నే కాదు, ప్రపంచ దేశాలను కూడా షాక్కి గురి చేసింది. ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యాత్రికులు పహల్గామ్కి విహార యాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది. ఈ ఘటనపై అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నారు. అలాగే వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ దాడిలో వైజాగ్కి చెందిన చంద్రమౌళి, నెల్లూరు వాసి మధుసూదనరావు ప్రాణాలు కోల్పోయారు.
పహల్గామ్ ఘటనలో అసువులు బాసిన వారికి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడయా ద్వారా నివాళులు అర్పించారు. అయితే వారి కుటుంబాలను స్వయంగా ఎవరూ కలవలేదు. కానీ, హీరోయిన్ అనన్య నాగళ్ళ మాత్రం నెల్లూరు సమీపంలోని కావలికి చెందిన మధుసూదనరావు నివాసానికి వెళ్లి ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ పెట్టారు. ‘పహల్గామ్ సంఘటన నాకెంతో బాధను కలిగించింది. ఈరోజు నేను ఒక ఈవెంట్ కోసం నెల్లూరుకి వచ్చాను. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వ్యక్తి నెల్లూరు పక్కన కావలి అని తెలుసుకొని చూసేందుకు వచ్చాను. మతం పేరు తెలుసుకుని మరీ చంపేయడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. మధుసూదనరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత యువతగా మనం ఇలాంటి ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మన ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ అనన్య నాగళ్ల ట్వీట్ చేసారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టి సరిపుచ్చుకోకుండా స్వయంగా మధుసూదనరావు నివాసానికి వెళ్లి నివాళి అర్పించడం, ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చడం మెచ్చుకోవాల్సిన విషయమని నెటిజన్లు అనన్యను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఆయా కుటుంబాల్లో మానసిక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉందని కామెంట్ చేస్తున్నారు.
"కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ.. రావడం మాత్రం పక్కా". ఇది 'గోపాల గోపాల' సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. పవన్ కళ్యాణ్ రాబోయే చిత్రం 'హరి హర వీరమల్లు'కి ఈ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన వీరమల్లు.. రావడం లేట్ కావచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా అన్నట్టుగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. రావడం మాత్రమే కాదు, వచ్చి రికార్డులు కొట్టడం కూడా పక్కా అని హింట్ కూడా ఇస్తోంది.
'హరి హర వీరమల్లు' షూటింగ్ దాదాపు పూర్తయింది. పవన్ మరో నాలుగైదు రోజులు డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని సమాచారం. త్వరలో వీరమల్లు బ్యాలెన్స్ షూట్ ని పూర్తి చేస్తానని పవన్ ఇప్పటికే మేకర్స్ కి మాట ఇచ్చారట. దీంతో మే చివరిలో లేదా జూన్ ప్రారంభంలో సినిమాని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే థియేట్రికల్ బిజినెస్ చర్చలు మొదలయ్యాయట. ఒక్క ఆంధ్రా ఏరియాకే దాదాపు రూ.100 కోట్లు చెబుతున్నారని వినికిడి. ఇప్పటిదాకా ఎన్నో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు విడుదలైనా.. ఆంధ్రాలో వంద కోట్ల బిజినెస్ చేసిన దాఖలాలు లేవు. అలాంటిది వీరమల్లు టీం ఏకంగా వంద కోట్లు చెబుతుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.
'హరి హర వీరమల్లు' సినిమాకి ఎన్నో విశేషాలు ఉన్నాయి. పవన్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. అలాగే మొదటిసారి చారిత్రాత్మక యోధుడు పాత్రలో కనువిందు చేయనున్నారు. ముఖ్యంగా పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ లెక్కన అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి ఫైనల్ రిలీజ్ డేట్ ని లాక్ చేసి, ట్రైలర్ రిలీజ్ చేస్తే.. అంచనాలు మరో స్థాయికి వెళ్లే అవకాశముంది. అందుకే నిర్మాతలు బిజినెస్ విషయంలో కాంప్రమైజ్ కావట్లేదని తెలుస్తోంది. ఒక్క ఆంధ్రాకే రూ.100 కోట్లు చెబుతున్నారంటే.. నైజాం, సీడెడ్ కూడా తోడైతే.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.200 కోట్ల బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక వరల్డ్ వైడ్ బిజినెస్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో ఉంటుంది అనడంలో సందేహం లేదు.
దర్శకధీరుడు రాజమౌళి, న్యాచురల్ స్టార్ నాని మధ్య మంచి అనుబంధం ఉంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఈగ'లో నాని నటించారు. అలాగే నాని హీరోగా యాక్ట్ చేసిన 'మజ్ను'లో రాజమౌళి గెస్ట్ రోల్ చేశారు. అంతేకాదు, నాని సినిమా వేడుకలకు రాజమౌళి గెస్ట్ గా హాజరవుతుంటారు. ఇప్పుడు మరోసారి నాని కోసం ఆయన రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. (Hit 3)
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హిట్-3'. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో 'హిట్-3'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉంది. ఏప్రిల్ 27న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో జరగనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
హిట్ ఫ్రాంచైజ్ లో రూపొందిన 'హిట్-1', 'హిట్-2' సినిమాల వేడుకలకు రాజమౌళి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి, 'హిట్-3' కూడా విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి.
Cast: Sundar C, Vadivelu, Catherine Tresa, Vani Bhojan, Bagavathi Perumal, Hareesh Peradi, Mime Gopi, Munishkanth, Redin Kingsley, Deepa Shankar
Crew:
Written by Sundar C, Venkat Raghavan, Badri
Cinematography by E. Krishnasamy
Music by C. Sathya
Edited by Praveen Antony
Directed by Sundar C
Produced by Khushbu Sundar, A. C. Shanmugam, A. C. S. Arun Kumar
Sundar C has become a huge blockbuster director in Tamil Cinema with comedy being his major go-to element. He delivered cult comedy films like Ullathai Allitha, Mettukudi, Arunachalam, Winner, Kalakalappu, and Madha Gaja Raja. He kept himself relevant with Aranmanai Series, even though he started 3 decades ago. He even shocked everyone with Madha Gaja Raja becoming a blockbuster even releasing after 12 years. Now, he joined hands with Vadivelu again after a long time for his Gangers movie. The movie released on 24th April 2025 and let's discuss about the film, in detail.
Plot:
A school girl goes missing and her school teacher Sujitha (Catherine) complaints to local police. As many girls have gone missing, the police appoint an undercover cop. Saravanan (Sundar C) joins as a PT teacher and Singaram (Vadivelu) another master starts to compete with Saravanan, mainly for the affection of Sujitha. While the investigation is going on, Saravanan also collects data about missing black money of Rs.100 crores. Finally, he plans an heist with some other losers like Singaram. Why he is conducting this heist? Will he be successful? What is his major motive behind all this? Watch the movie to know more.
Analysis:
Sundar C throws everything at the wall in this film to see what exactly sticks. He tries to use Vadivelu in almost every scene and he tries to write scenes that the legend pulled off in his prime. And this seems to be the positive and overwhelming negative of the film, too. Vadivelu is still trying to find his true self in comic timing at this moment, as he had a long break between films. He is not close to his prime, where even his simple reaction could turn a shot hilarious.
He is able to make the heist episodes more enjoyable as they offered more for him to play but in the first hour, he cracks few good one-liners but still not at his best. While Vadivelu is good in second half providing us with some entertainment, Sundar C, seem to have sticked to Aranmanai range of writing in this film. People who expect Kalakalappu kind of through and thorough comedy, Sundar C, is not in the same level of form.
The writing finds its pace only when the heist part starts and marginally becomes better with even the jokes and one-liners. We do not get any low brawling attempts like in the first hour. It works to a level where we get a decent comedy that doesn't hurt our senses or stretch too much. Vadivelu is the key in these portions and there are some inventive ways, Sundar C, used him as well. Still, the comedy doesn't really make us laugh out loud at consistent levels.
On the whole, Sundar C is able to deliver another timepass entertainer that doesn't really become a must watch but has decent enough elements that doesn't hurt us through the run-time. Still, we cannot call it a comeback of Sundar C and Vadivelu combination. Santhanam did deliver a great comedy stretch in Madha Gaja Raja but here Vadivelu is not effective yet he is good.
Bottomline:
Film doesn't live up to expectations but doesn't hurt our senses too.
Rating: 2.25/5
Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the reviewer and organisation does not hold a liability to them. Viewer discretion is encouraged.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ పాల్గొంటున్న ఈ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసన్ భాగం కానుందని ప్రచారం జరుగుతోంది. (Dragon)
'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రత్యేక గీతం కోసం శృతి హాసన్ ని రంగంలోకి దింపుతున్నట్లు వినికిడి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో.. సాంగ్స్ విషయంలో ప్రశాంత్ నీల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. ఎన్టీఆర్ డ్యాన్స్ అదరగొడతాడు. పైగా మాస్ లో ఫాలోయింగ్ ఎక్కువ. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే.. మంచి మాస్ సాంగ్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. ఆ అంచనాలకు తగ్గట్టుగా మంచి ఆల్బమ్ తో అలరించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్ కూడా పెట్టాలని నిర్ణయించారట. అంతేకాదు, ఈ సాంగ్ లో శృతి హాసన్ చిందేయనుందని టాక్. నీల్ గత చిత్రం 'సలార్'లో శృతినే హీరోయిన్. ఆ సెంటిమెంట్ తో 'డ్రాగన్' కోసం ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం. మలేరియా గురించి అవగాహన పెంచడానికి, వ్యాధిని నియంత్రించడానికి, నివారించడానికి, చివరికి మలేరియాను రూపుమాపడానికి చర్యలను ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఏర్పాటు చేసిన రోజిది. ప్రతి సంవత్సరం మలేరియా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తారు. ఈ సంవత్సరం మలేరియా దినోత్సవం థీమ్.. "మలేరియా మనతోనే అంతం అవుతుంది. ఇది మలేరియా నిర్మూలన వైపు పురోగతిని వేగవంతం చేయడానికి అన్ని స్థాయిలలో ప్రయత్నాలను శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా సంక్రమించే పరాన్నజీవుల వల్ల వచ్చే మలేరియా లక్షలాది మంది ప్రజలను, ముఖ్యంగా ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాలలో ప్రభావితం చేస్తూనే ఉంది. మలేరియా దినోత్సవం మలేరియాను ఎదుర్కోవడంలో సాధించిన పురోగతిని అందరికీ గుర్తు చేస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకునేందుకు అవకాశం ఇస్తుంది. వ్యాధి భారాన్ని తగ్గించడానికి వనరులు, ఆవిష్కరణలు, ప్రజల భాగస్వామ్యాన్ని సమీకరిస్తుంది. చికిత్సతో పాటు, ఈ ప్రాణాంతక అనారోగ్యం నుండి వ్యక్తులు, సమాజాలను రక్షించడంలో నివారణ చిట్కాలు కీలకమైనవి.
మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు & లక్షణాలు..
మలేరియా ముందస్తు హెచ్చరిక సంకేతాలు, లక్షణాలు ఇతర వైద్య పరిస్థితులకు దగ్గరగా ఉండవచ్చు. అయితే మలేరియా తీవ్రత మారవచ్చు. మలేరియాను వ్యాప్తి చేసే దోమ కుట్టిన 10-15 రోజుల తర్వాత లక్షణాలు అభివృద్ధి చెందుతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, మలేరియా అవయవ వైఫల్యం, కోమా లేదా మరణం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మలేరియా అని అనుమానించినట్లయితే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
మలేరియా సాధారణ ముందస్తు హెచ్చరిక సంకేతాలు..
జ్వరం
అకస్మాత్తుగా వచ్చే అధిక జ్వరం అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి.
చలి
చాలా మందికి చలి వస్తుంది. అది తీవ్రంగా ఉండవచ్చు. తరువాత చెమట పడుతుంది.
చెమటలు పడటం
చలి తర్వాత, జ్వరం తగ్గవచ్చు, విపరీతంగా చెమట పట్టవచ్చు.
తలనొప్పి
మలేరియా కేసుల్లో తలనొప్పి, తరచుగా మధ్యస్థం నుండి తీవ్రంగా ఉండటం సాధారణం.
అలసట
చాలా అలసటగా లేదా బలహీనంగా అనిపించడం విలక్షణమైనది, ఇతర లక్షణాలు తగ్గిన తర్వాత కూడా ఇది కొనసాగవచ్చు.
వికారం, వాంతులు
మలేరియా ఉన్న చాలా మంది వ్యక్తులు వికారం, వాంతులు అనుభూతి చెందుతారు.
కండరాలు, కీళ్ల నొప్పి
కండరాలు, కీళ్లలో నొప్పులు సర్వసాధారణం.
రక్తహీనత
ఈ పరాన్నజీవి ఎర్ర రక్త కణాలను నాశనం చేస్తుంది. ఇది రక్తహీనతకు (తక్కువ ఎర్ర రక్త కణాల సంఖ్య) దారితీస్తుంది. దీని వలన అలసట, బలహీనత, పాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దగ్గు
కొంతమందికి తేలికపాటి దగ్గు వస్తుంది.
కడుపు నొప్పి
కొంతమంది వ్యక్తులు పొత్తికడుపులో అసౌకర్యం లేదా నొప్పిని అనుభవిస్తారు.
పై లక్షణాలు కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.
*రూపశ్రీ.
వివాహం అనేది భారతీయ సమాజంలో జీవితాంతం నిలిచే బంధంగా పరిగణించబడే సంబంధం. అయితే ఈ జీవిత బంధాన్ని సంతోషంగా గడపాలనుకుంటే ఆ సంబంధంలో ప్రేమ, గౌరవం అవసరం. చాలా మంది భార్యాభర్తలు ఒకరినొకరు చాలా ప్రేమిస్తారు కానీ వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, వాటిలో ఒకటి నిరాశ.
ఒక అమ్మాయి తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని వదిలి తన భర్త ఇంటికి వచ్చినప్పుడు, ఆమె అతన్ని అంగీకరించడమే కాకుండా తన భర్త పద్ధతులను, ఇష్టాయిష్టాలను కూడా స్వీకరిస్తుంది. కానీ ఒక పురుషుడు తన భార్య తనకు ఎంత ప్రత్యేకమైనదో ఆమెకు తెలియజేయడంలో విఫలమవుతాడు. ఈ కారణంగా స్త్రీలు తమ భర్తల పట్ల, ఆ సంబంధం పట్ల నిరాశ చెందుతారు. భర్త భార్యను నిరాశపరచకూడదనుకుంటే, ఆమె భర్తను ఎల్లప్పుడూ ప్రేమించాలని, సంబంధం సంతోషంగా ఉండాలని కోరుకుంటే ప్రతి భర్త ఈ ఐదు పనులు ప్రతిరోజూ చేయాలి.
ప్రేమను వ్యక్తపరచడం..
అవకాశం దొరికినప్పుడల్లా భార్యతో "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాలి. ప్రేమను వ్యక్తపరచడం వల్ల భార్య పట్ల శ్రద్ధ వహిస్తున్నారని ఆమెకు భరోసా లభిస్తుంది. రోజూ ప్రేమను వ్యక్తపరచడంతో పాటు వారితో రోజుకు రెండు మూడు సార్లు ప్రేమగా మాట్లాడితే మహిళలు కూడా దీన్ని చాలా ఇష్టపడతారు. ప్రేమ ఉంది కానీ దానిని వ్యక్తపరచకపోతే లేదా చూపించకపోతే భార్యకు ఎలా తెలుస్తుంది?
కలిసి తినడం..
దంపతులు ఎంత బిజీగా ఉన్నా కనీసం భోజనం కలిసి తినాలి. భర్త రోజుకు ఒకసారి అయినా భార్యతో కూర్చుని భోజనం చేయాలి. అల్పాహారం అయినా, భోజనం అయినా, రాత్రి భోజనం అయినా ఇద్దరూ కలిసి కూర్చుని భోజనం చేసినప్పుడు వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే కుటుంబం ఉన్నప్పటికీ భర్త లేకుండా భార్య భోజనం చేసినప్పుడు ఆమె ఒంటరిగా ఫీలవుతుంది. కాబట్టి భర్త తన భార్యతో కలిసి భోజనం చేయడానికి సమయం కేటాయించాలి.
బయటకు వెళ్ళే ముందు..
ఆఫీసుకు వెళ్లే ముందు భార్యతో సమయం గడపాలని కోరుకుంటున్నారని, కానీ మీరు పనికి వెళ్లాలని ఆమెకు అనిపించేలా చేయండి. దీనికోసం మీరు ప్రేమపూర్వకమైన ఒక నోట్ రాయవచ్చు లేదా ఇంటి నుండి బయలుదేరే ముందు వారిని కౌగిలించుకుని జాగ్రత్త చెప్పవచ్చు. ఈ చిన్న విషయాలు వారికి ప్రేమను అర్థం అయ్యేలా చేస్తుంది.
కౌగిలి..
ఉదయం నిద్ర లేవగానే భార్యను కౌగిలించుకోవడం ప్రతి భార్య చాలా సేఫ్ ఫీలింగ్ అనుభూతి చెందుతుంది. ప్రతి భార్య తన భర్త చేతుల్లో సురక్షితంగా, సుఖంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తపరచడానికి, భార్య హృదయాన్ని గెలుచుకోవడానికి కౌగిలించుకోవడం మంచి మార్గం. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా తిరిగి వచ్చినప్పుడు భార్యను కౌగిలించుకోవడం ఇద్దరికీ చాలా ఊరట ఇస్తుంది.
ఫిర్యాదు వద్దు, మద్దతు ఇవ్వాలి..
మహిళలు తమ భర్తలను, అత్తమామలను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. ఇందుకోసం ఆమె తన భర్త మద్దతు మాత్రమే కోరుకుంటుంది. అయితే, భర్త తమ భార్య లోపాల గురించి ఫిర్యాదు చేసినప్పుడు భార్య నిరుత్సాహపడుతుంది. మీరు వారితో ఉన్నారనే భావన వారికి కలిగించాలి. ఫిర్యాదు చేయడానికి బదులుగా, చిన్న పనులలో వారికి మద్దతు ఇవ్వాలి. మంచం సర్దడం లేదా టీ తయారు చేయడం వంటి చిన్న చిన్న పనులు చేయడం ద్వారా వారి హృదయాలను గెలుచుకోవచ్చు.
*రూపశ్రీ
మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ దుర్వాసన కారణంగా నలుగురిలో కలవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్యతో ఇబ్బంది పడేవారు స్నానపు నీటిలో కొన్ని వస్తువులను జోడించడం ద్వారా చెమట వాసనను వదిలించుకోవచ్చు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
వేప ఆకులు..
చెమట వాసనతో ఇబ్బంది పడుతుంటే, స్నానపు నీటిలో వేప ఆకులు వేసి మరిగించాలి. దీని కోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వేప ఆకులు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత దానిని వడకట్టి స్నానపు నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించాలి.
రోజ్ వాటర్..
రోజ్ వాటర్ ఉంటే చెమట వాసనను తొలగించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి స్నానపు నీటిలో రెండు నుండి మూడు చెంచాల రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ ని నీటిలో కలిపి ప్రతిరోజూ ఆ నీటితో స్నానం చేయాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా చెమట వాసన నుండి ఉపశమనం పొందవచ్చు.
బేకింగ్ సోడా..
బేకింగ్ సోడా ప్రతి భారతీయ వంటగదిలో కనిపిస్తుంది. చెమట దుర్వాసనను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను స్నానపు నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయాలి. ఈ నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అందరికీ సరిపోదు. దీని కారణంగా అలెర్జీలను ఎదుర్కోవలసి రావచ్చు.
అలోవెరా జెల్..
ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే స్నానం చేసే నీటిలో అలోవెరా జెల్ కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఈ నీరు చర్మాన్ని చల్లబరుస్తుంది, శరీరం తాజాగా అనిపిస్తుంది.
*రూపశ్రీ.
మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం సంఘటనలో కుట్ర అన్నకోణంలో దర్యాప్తు చేస్తున్న సిట్ దూకుడు పెంచింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని సిట్ అరెస్టు చేసింది. మదనపల్లి ఫైళ్ల దగ్ధం కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న మాధవరెడ్డి గత ఆరు నెలలుగా కోర్టు నుంచి ముందస్తు బెయిలు పొంది అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.
అయితే సిట్ అధికారులు కోర్టును ఆశ్రయించి ఆ యాంటిసిపేటరీ బెయిలు రద్దు అయ్యేలా చేశారు. మాధవరెడ్డికి యాంటిసిపేటరీ బెయిలు రద్దు కావడంతో అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలోని పెద్దగొట్టిగల్లోలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవరెడ్డి ఉన్నట్లుగా అందిన పక్కా సమాచారం మేరకు సిట్ పోలీసులు అక్కడకు వెళ్లి ఆయనను అదుపులోనికి తీసుకున్నారు. అరెస్టు సమయంలో మాధవరెడ్డి తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను నీటిలో పడేసేందుకు చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డిని అదుపులోనికి తీసుకుని తిరుపతికి తరలించారు. మాధవరెడ్డి అరెస్టుతో ఇక మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని అంటున్నారు.
జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం అడ్డూ అదుపూలేకుండా సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అలా అడ్డూ అదుపూ లేకుండా భూకజ్జాలకు పాల్పడిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందువరుసలో ఉన్నారని అప్పట్లోనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఒక్కొక్కరూ భయంతో వణుకుతున్నారు. పోలీసు కేసులకు భయపడి సాక్ష్యాలను తారుమారు చేయడానికి పెద్దరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి తన భూ ఆక్రమణలకు సంబంధించిన సాక్ష్యాలను గల్లంతు చేయడం కోసమే మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాల యంలో అగ్నిప్రమాద కుట్రకు తెరలేపారన్న అనుమానాలు ఉన్నాయి.
ప్రాథమిక విచారణలో పైళ్ల దగ్దం ప్రమాదశాత్తూ జరగలేదని, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని తేలింది. ఆ ఫైళ్లకు నిప్పుపెట్టి కాలిపోయేలా చేసింది పెద్దిరెడ్డి అనుచరులే అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఫైళ్ల దగ్ధం వెనుక కుట్ర ఉందన్నది వెల్లడైంది. దీంతో ఈ కేసు దర్యాప్తునకు ప్రభు త్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కేసులోనే పెద్దరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి అరెస్టయ్యారు. దీంతో తరువాతి వంతు పెద్దిరెడ్డిదేనా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైమ్ అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు. గతంలో ప్రత్యర్ధి పార్టీ నేతలపై బూతు పురాణం వల్లె వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది. వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. అదే జగన్ ఇప్పుడు ఆయన్ని ఇక నీ అవసరం లేదంటూ.. పక్కన పెట్టేశారు. క్రమశిక్షణ చర్యలు పేరుతో సస్పెన్షన్ వేటు వేశారు.
వైసీపీ అధికారంలో ఉండగా అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న ఆ పార్టీ నాయకుల్లో శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటారు. చంద్రబాబునాయుడు, పవన్కళ్యాణ్, లోకేష్లపై అసభ్యకర భాషతో విమర్శలు గుప్పిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు. అందుకే దువ్వాడ వైసీపీ స్థాపించాక ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయినా జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి ... మధ్యలో దివ్వెల మాధురి. ఈ ఫ్యామిలీ డ్రామా గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం వారి వివాదం కోర్టులో కొనసాగుతోంది. మాధురితో కలిసి హైదరాబాద్లో వస్త్ర వ్యాపారం చేసుకుంటున్న దువ్వాడ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మళ్లీ మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్సీ స్పందించారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఇన్నాళ్లు గౌరవం ఇచ్చిన జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని.. అకారణంగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని దువ్వాడ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత కారణాలను బూచిగా చూపించి రాజకీయ క్రీడలో బలిపశువును చేశారన్నారు.
దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోడ్డుకెక్కడంతోపాటు.. మాధురితో ఆయన కలిసి ఉండడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. నిజంగా దువ్వాడపై జగన్ తీసుకున్నది క్రమశిక్షణ చర్యే అయితే.. ఆ పని ఎప్పుడో చేసి ఉండాలి. దివ్వెల మాదురి వ్యవహారంలో రచ్చకెక్కినప్పుడు సస్పెన్షన్ వేటు వేయాలి. మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ ఇన్స్టా రీల్స్, తిరుమల పర్యటనలో ఫొటోషూట్, కుటుంబ వివాదాలతో దువ్వాడ ఎప్పుడో రచ్చకెక్కారు. కానీ... జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు.
అలాంటిది... ఉన్నట్టుండి ఆయనను ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. మంత్రి లోకేష్ను పొగడటమే దువ్వాడపై వేటుకు కారణమని తెలిసింది. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి పాల్గొన్నారు. బాలయ్య తర్వాత స్వీటెస్ట్ పర్సన్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు... లోకేష్ అని ఇద్దరూ కూడబలుక్కున్నట్లు ఒకే సారి సమాధానం చెప్పారు. లోకేష్ తెలివైనవాడని, ముఖ్యమంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చేస్తారని, యువకుడనీ తెగ పొగిడేశారు. ఆ లోకేష్ జపం ఆ నోటా ఈ నోటా జగన్ చెవిన పడిందంట. లోకేష్ను అంతగా పొడిగితే జగన్ ఊరుకుంటారా.. అందుకే దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేశారంట. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు.. ఇదేనేమో..?
ఏమిటీ సింధూ జలాల ఒప్పందం?
ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ లో ఏర్పడనున్న సంక్షోభాల తీవ్రత ఎంత?
ఇప్పటికే క్రికెట్ సంక్షోభంతో విలవిల ఇక ఆహార, ఆర్ధిక, సామాజిక, రాజకీయంగానూ అవస్థలేనా?
కొన్ని శతాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగతి. అప్పట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. సముద్ర జలాలపై ప్రయాణిస్తూ.. వివిధ రకాల ప్రాంతాల్లో సెటిలయ్యేవని అంటుంది మన పురాతన భౌగోళిక చరిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్రయాణిస్తూ వచ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టిందనీ.. అలా మనకు హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు. ఎప్పుడయితే ఇక్కడ మంచు శిఖరాలు ఏర్పడ్డాయో.. అప్పటి వరకూ ఎడారిలాంటి ఈ ప్రాంతంలోకి బిందువులు సింధువులుగా మారి.. ఒక ప్రవాహం ఏర్పడిందనీ.. తద్వారా ఇక్కడొక నాగరికత ఏర్పడిందనీ.. దాన్నే సింధూ నాగరికత అంటారనీ చెబుతుంది మన నైసర్గిక భౌగోళిక చరిత్ర.
ఎప్పుడైతే ఇక్కడ జల ప్రవాహం ఏర్పడిందో దాన్ని ఆశించి.. ఆఫ్ఘన్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి కొందరు జీవనాన్ని వెతుక్కుంటూ వచ్చారనీ.. వారే తర్వాతి కాలంలో ఆర్యులుగా అవతరించారనీ అంటారు. ఇక, ఆఫ్రికా ఖండంతో పాటు వచ్చిన వారు దక్షిణాదిన ద్రవిడులుగా స్థిరపడ్డారనీ చెబుతుంటారు. ఇది బేసిక్ ఆర్య ద్రవిడ థియరీ అయితే.. ఈ థియరీలో మేజర్ పార్ట్ సింధూ జలాలదే. ఈ జలాలను వెతుక్కుంటూ వచ్చిన వారే ఆర్యులుగా చెబుతుందీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం.
ఇదిలా ఉంటే కాలక్రమేణా ఉత్తర దక్షిణ భారతాలు కలసి ఒక దేశంగా ఏర్పడ్డం.. ఒకప్పట్లో అఖండ భారతంగా ఉన్న ఈ దేశం తర్వాతి రోజుల్లో పాక్, బంగ్లాతో పాటు శ్రీలంక, నేపాల్ అంటూ విడిపోయిందని అంటుంది మన సుదీర్ఘ కాల చరిత్ర.
1947 నాటి నుంచి మనం భారత్- పాకిస్థాన్ లు గా విడివడ్డాం. 1960ల కాలంలో నాటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా వచ్చిందే సింధూ నదీ జలాల ఒప్పందం. ఇప్పటి వరకూ మొత్తం మూడు సార్లు అంటే, 1965- 1971- 1999 భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగినా.. ఈ జల ఒప్పందాలు మాత్రం చెక్కు చెదరలేదు. మధ్యలో.. భారత్ పాక్ కి వచ్చిన జలవివాదం ఎలాంటిదంటే.. ఇది ప్రపంచ బ్యాంకు వరకూ వెళ్లింది. కిషన్ గంగ పై ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది భారత్. కిషన్ గంగ, రాట్లే ప్రాజెక్టులు నిర్మించిన భారత్ పై పాక్ ఆరోపణలు గుప్పించింది. అంతే తప్ప.. ఈ సింధూ జలాల ఒప్పందం మీద ఇంత వరకూ మనకూ పాకిస్థాన్ కి ఎలాంటి గొడవా రాలేదు. ఈ ఒప్పందం రద్దు అప్పుడప్పుడూ తెరపైకి వచ్చినా అవన్నీ తామరాకు మీద నీటిబొట్టులాంటిదే అయ్యింది.
అయితే ఇప్పుడు పహెల్గాం దాడి తర్వాత.. భారత్ ఈ జల ఒప్పందం నుంచి తప్పుకుంటే మొదట జరిగే పని.. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ వంటి నదీ జలాలు పాక్ కి వెళ్లకుండా కట్టడి చేసే అవకాశముంది. వీటిపై భారత్ మరింత విస్తృతంగా ప్రాజెక్టులు కట్టే ఛాన్సుంది. ఎప్పుడైతే.. ఈ డ్యాముల నిర్మాణం జరుగుతుందో అప్పటి నుంచీ పాకిస్థాన్ కి జల సంక్షోభం సంభవించే ప్రమాదముంది. ఎప్పుడైతే ఈ నదీ జలాల ప్రవాహం కట్టడి చేయబడుతుందో అప్పటి నుంచీ ఆహార సంక్షోభం మొదలౌతుంది. ఎప్పుడైతే ఆహార సంక్షోభం వస్తుందో ఆ నాటి నుంచి పాక్ లో కరవు విలయ తాండవం చేస్తుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు మటాష్ అయిపోతుంది. అంటే ఒక్క బొట్టు కూడా రక్తం చిందించకుండానే ఈ నిర్జల ఉత్పాతాన్ని సృష్టించవచ్చన్నమాట.
ఇది పాకిస్తాన్ తనకు తాను చేజేతులా చేసుకుంటున్న ఒకానొక దుశ్చర్య. పహెల్ గాం దుండగులు పాకిస్తాన్ సంబంధించిన వారేనంటూ ఇక్కడి నుంచి పాకిస్థాన్ దిశగా వెళ్లిన డిజిటల్ లింకులు చెబుతూనే ఉన్నాయి. దీని వెనక లష్కరే తోయిబాకి చెందిన రెసిస్టెంట్ గ్రూప్ ఉన్నా.. దీని మూలాలు పాక్ లోనే తేలుతున్నాయి. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, గతంలో ఈ దేశపు గూడాచార సంస్థ ఐఎస్ఐకి చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలోనే మునీర్ కి లష్కరే వంటి టెర్రరిస్టు గ్రూపులతో విపరీతమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అతడే ఈ దుశ్చర్యకు కర్త-కర్మ- క్రియ అంటూ కేవలం భారత్ మాత్రమే కాదు అమెరికా సైతం విశ్వసిస్తోంది.
ఒక పక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటిస్తుండగా జరిగిందీ ఉగ్ర దాడి. దీని వెనక పాక్ హస్తం ఉన్నట్టు గట్టిగా భావిస్తోన్న అమెరికా.. అంతే కాదు మునీర్ కీ లాడెన్ కీ పెద్ద తేడా లేదని యూఎస్ వాఖ్యానిస్తోందంటే.. ప్రపంచ స్థాయిలో పాక్ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు సింధూ జల ఒప్పందాల రద్దు ద్వారా పాకిస్థాన్ కి జరిగే నష్టం ఎలాంటిదో ఉదహరించడానికి.. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణే అతి పెద్ద ఉదాహరణ. భారత్ ఈ టోర్నీలో ఆడటానికిగానూ పాకిస్థాన్ భూభాగంలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పింది. దానికి తోడు రోహిత్ సైన ఫైనల్ కి చేరడంతో.. పాకిస్థాన్ లో జరగాల్సిన ఫైనల్ కాస్తా దుబాయ్ లో జరిగింది. దీంతో అప్పటి వరకూ పాక్ ఈ టోర్నీ కోసం పెట్టిన ఖర్చు మొత్తం వృధా అయ్యి... భారీ నష్టం మిగిలింది.
భారత్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇక సింధూ జలాలతో పాటు.. పాకిస్థాన్ లోని భారత దౌత్య అధికారుల ను సైతం తిరిగి రప్పిస్తున్నారు. ఇక్కడున్న పాక్ యాంబసీని కూడా పెట్టేబేడ సర్దుకోమంటున్నారు. అంతేనా దేశంలో ఉన్న పాకిస్తానీయులు, ఇతర పర్యాటకులను వారం లోగా దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
ఇకపై పాకిస్థాన్ కి గతంలో లా ఉండదు. పహెల్ గామ్ దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. ఇప్పటికే ఆ దేశం ఎల్ఓసీ దగ్గర భద్రత అప్రమత్తం చేసింది. ఇక ఏ ముహుర్తాన భారత సైనికులు ఏ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారో అన్న భయంకరమైన భయాన్ని అనుభవిస్తోందీ పాపిష్టి దేశం. ఒక పక్క మన రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంతకింత అనుభవిస్తారన్న హెచ్చరికలు జారీ చేసిన సమయాన.. ఎలాంటి భయానక పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందో అన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది పాకిస్తాన్ లో.
ఒక రకంగా చెప్పాలంటే ఇది తాత్కాలికం. సిందూ జలాల ఒప్పందం కారణంగా పాకిస్థాన్ నానాటికీ తీసికట్టుగా మారిపోతుంది. ఇటు జాలాల ఒప్పందం మాత్రమే కాకుండా, అటు దౌత్య పరమైన సంబంధాలన్నిటినీ భారత్ పూర్తిగా తెంచుకుంటే పాకిస్థాన్ పరిస్థితి వచ్చే రోజుల్లో అగమ్య గోచర పరిస్థితి ఎదుర్కోవడం ఖాయం.
ఇప్పటికే అమెరికా నుంచి నిధుల నిలిపివేత వేధన అనుభవిస్తోన్న పాకిస్థాన్ కి మిగిలిన దిక్కల్లా చైనా మాత్రమే. అలాగని పహెల్ గామ్ వంటి దాడులతో రెచ్చిపోతున్న పాక్ కి అది బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఇప్పటికే అమెరికా నుంచి విపరీతమైన సుంకాల దాడి ఎదుర్కుంటున్న చైనా.. తన కాళ్ల మీద తాను నిలబడ్డానికే ఆపసోపాలు పడుతుంటే.. పాకిస్థాన్ కి ప్రత్యక్ష సాయం చేసే ఛాన్స్ లేదు.
ఎందుకంటే భారత్ కూడా పొమ్మన లేక పొగబెడితే.. వరల్డ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ చైనా తాను చేసిన ప్రాడక్టులు తానే అమ్ముకోలేదు. పాకిస్తాన్ని ఆ దేశం దగ్గరకు చేర్చేదే.. అతి పెద్ద మార్కెట్ అయిన భారత్ ను నయానా భయానా ఒప్పించడానికి. ఇప్పుడు పాక్ విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించడంతో చైనా కూడా హ్యాండ్సప్ అనాల్సిందే.
వీటిన్నిటి దృష్ట్యా చూస్తే పాకిస్థాన్ వచ్చే రోజుల్లో చూసే సామాజిక- రాజకీయ- ఆర్ధిక- ఆహార- సంక్షోభం అతి భయంకరమైనదిగా అంచనా వేయక తప్పదు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఆర్మీకున్న అధికారాలను కత్తెరించి.. టెర్రరిస్టులను సమూలంగా ఏరి వేస్తే తప్ప... ఈ దేశానికి మరో మార్గాంతరం లేదు.
మునక్కాయలు వేసవి కాలంలో విరగకాస్తాయి. చాలామందికి మునగ కాయలతో చేసే వంటకాలు అంటే చాలా ఇష్టం. ఈ మధ్య కాలంలో చాలామందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. ఇలా కిడ్నీలో రాళ్ల సమస్యకు మునక్కాయ మంచి పరిష్కారం అవుతుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో పూర్తీగా తెలుసుకుంటే..
మునగకాయలను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు విచ్చిన్నమవుతాయట. అవి బయటకు వచ్చేస్తాయట. ఈ విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు మునక్కాయలను ఎడాపెడా తింటున్నారు. మునక్కాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పోషకాలు కూడా మెరుగ్గా ఉంటాయి. మునక్కాయలు శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని, ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా మెరుగుపరుస్తుంది. ఇవన్నీ నిజమే కానీ.. మూత్రపిండాలలో రాళ్లను విచ్చిన్నం చేసి వాటిని బయటకు రావడంలో మునక్కాయలు సహాయపడతాయి అనే మాట మాత్రం అస్సలు నిజం కాదని వైద్యులు అంటున్నారు.
మునక్కాయలు మాత్రమే కాదు.. ఏ కూరగాయ కూడా కిడ్నీలో రాళ్లు పోగొట్టడంలో నేరుగా సహాయపడదు అని వైద్యులు అంటున్నారు. మునక్కాయలు తినడం వల్ల కిడ్నీలో రాళ్లు పోతాయనే అపోహతో వాటిని ఎక్కువ తింటే అది ఆరోగ్యానికి హాని చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.
మునగతో లాభం..
మునగ తినడం వల్ల ఖనిజాలు పేరుకుపోవడాన్ని నిరోధిస్తుంది. ఇది కొత్త రాళ్ళు ఏర్పడే ప్రక్రియను ఖచ్చితంగా ఆపుతుంది. ఈ కూరగాయలోని యాంటీఆక్సిడెంట్లు, నిర్విషీకరణ లక్షణాలు మూత్రపిండాల నిర్విషీకరణకు, మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. మునగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కానీ మునగను తినడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు పోతాయనే మాట మాత్రం వాస్తవం కాదు. కిడ్నీలో రాళ్ల సమస్యకు ఇలాంటి ప్రయోగాలు చేయకుండా వైద్యులను సంప్రదించడమే మంచిది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
గసగసాలు స్వీట్లలోనూ, కొన్ని రకాల వంటలలోనూ ఉపయోగిస్తారు. ఆవాల కంటే చిన్న తెలుపు, గోధుమ రంగులో ఉండే గసగసాలు ఖరీదు పరంగా ఎక్కువే ఉంటాయి. కానీ ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గసగసాలు వేడిని క్షణాల్లోనే తరిమివేస్తాయట. ఆయుర్వేదం కూడా గసగసాల గురించి గొప్పగా చెప్పింది. వేలాది సంవత్సరాల నుండే గసగసాలు ప్రజల ఆహారంలో భాగంగా ఉన్నాయి. చరక సంహితలో దీనిని పిత్త దోషాన్ని శాంతింపజేసే మూలికగా పేర్కొన్నారు. ఇంత అద్బుతమైన గసగసాలు వేసవిలో మనకు చేకూర్చే మేలు ఏంటో తెలుసుకుంటే..
కూలింగ్ ప్రభావం..
చరక సంహితలో గసగసాల గురించి చెప్పబడింది. దీని శీతలీకరణ ప్రభావం శరీర వేడిని తగ్గిస్తుంది. వేసవిలో కడుపు చికాకు, పాదాలలో మంట, చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. గసగసాల పానీయం శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా మనసును కూడా ప్రశాంతపరుస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. "వేసవిలో పిత్తం పెరిగినప్పుడు, గసగసాల పాలు లేదా పానీయం తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందట.
శాస్త్రీయ కోణం..
శాస్త్రీయ కోణం నుండి చూస్తే, గసగసాలు పోషకాల నిధి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గసగసాలలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వేసవిలో వచ్చే కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
గసగసాలలో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు కారణమవుతుందని ఒక పరిశోధన చూపిస్తుంది. ఈ కారణంగానే అమ్మమ్మలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో గసగసాలు కలిపి పిల్లలకు ఇచ్చేవారు, తద్వారా వారు గాఢమైన, ప్రశాంతమైన నిద్ర పొందేవారు.
గసగసాలలోని ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి, దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.
వేడి నుండి రక్షించడంలో గసగసాల అద్భుత లక్షణాల గురించి మాట్లాడుకుంటే..ఇది సూపర్ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. గసగసాల పానీయం లేదా పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. గసగసాల నీరు కడుపు pH ని సమతుల్యం చేస్తుంది. ఇది వేసవిలో ఆమ్లతత్వం, కడుపు చికాకు నుండి ఉపశమనం ఇస్తుంది.
ఆయుర్వేదంలో గసగసాల వాడకం..
గసగసాల నూనెను ఆయుర్వేదంలో నొప్పి నివారిణిగా కూడా ఉపయోగిస్తారు. ఇది కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గసగసాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.
గసగసాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. గసగసాలను పాలతో కలిపి రుబ్బి ముఖానికి రాసుకుంటే చర్మపు చికాకు, మొటిమలు తగ్గుతాయి. గసగసాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి వేసవిలో సూర్య కిరణాల వల్ల కలిగే చర్మ సమస్యలకు కూడా బాగా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లను అందరూ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి కాలంలో తేలికైన ఆహారం తినడానికి ఇష్టపడతారు. పైగా పండ్లలో నీటి శాతం ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవచ్చు అనేది ముఖ్యమైన విషయం. అందువల్ల పండ్లు, పెరుగు, లస్సీ వంటి చల్లని పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచే పండ్లైన పుచ్చకాయ, కర్భూజ వంటి పండ్లకు చాలా డిమాండ్ ఉంటుంది ఈ కాలంలో.
కానీ కొంతమంది పండ్లు కొనేటప్పుడు తరచుగా తప్పులు చేస్తారు. ఇంటికి వచ్చి పండు కోసిన తర్వాత, అది పచ్చిగా ఉందని, రుచి తక్కువగా ఉందని, తియ్యగా లేదని నిరాశ పడుతుంటారు. అయితే ఇలా జరగకుండా కొనుగోలు చేసేటప్పుడే పండ్లు తియ్యగా ఉన్నాయని కేవలం చూడటంతోనే తెలుసుకునే టిప్స్ ఉన్నాయి. దీనివల్ల తియ్యని పండ్లను కొని ఆస్వాదించవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
దానిమ్మ..
దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లలో దానిమ్మకు మంచి డిమాండ్ ఉంది. దానిమ్మపండు కొంటుంటే మొదట దాని నోరు(దానిమ్మ పైన పువ్వు లాంటి ఆకారం) చూడాలి. అది తెరిచి ఉంటే దానిమ్మపండు తియ్యగా ఉంటుందని అర్థం. కానీ దాని నోరు మూసుకుని ఉంటే అది తక్కువ తీపిగా ఉంటుందని అర్థం.
పుచ్చకాయ..
కర్భూజ లాగే, పుచ్చకాయ కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీరంలోని నీటి లోపాన్ని భర్తీ చేస్తుంది. కానీ పుచ్చకాయ కొనేటప్పుడు పొరపాటు జరగకుండా జాగ్రత్త పడాలి . పుచ్చకాయకు చారలు ఉండి, అది పొడవుగా ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. ఇది చారలు లేకుంటే కొద్దిగా పచ్చిగా ఉండవచ్చు.
నారింజ..
తీపి, పుల్లని నారింజను కొనాలంటే దానిమ్మపండులా దాని ముఖాన్ని చూడాలి. దాన్ని లోపలికి నొక్కితే దాని రంగు ముదురు రంగులో ఉంటే అది తీపిగా, పుల్లగా ఉంటుందని అర్థం. అయితే లేత రంగు, పెద్ద నోరు కలిగిన నారింజలు తక్కువ రుచిని కలిగి ఉంటుందట.
డ్రాగన్ ఫ్రూట్..
మార్కెట్లో అధిక ధరకు అమ్ముడవుతున్న డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . కానీ ఖరీదైన ఖరీదైన డ్రాగన్ ఫ్రూట్ కొనడంలో తప్పు చేస్తే చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు దాని ముఖాన్ని చూడండి. అది తాజాగా, ఆకుపచ్చ ఆకులతో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం. కానీ అది వాడిపోతే రుచి తక్కువగా ఉంటుందని అర్థం.
బొప్పాయి..
చాలా మంది తెలియకుండానే ఇంటికి పచ్చి బొప్పాయిని తెస్తారు. ఇది పండటానికి చాలా సమయం పడుతుంది. వెంటనే దీన్ని తినలేము. తియ్యటి బొప్పాయి కొనాలనుకుంటే దాని రంగు చూడాలి. పూర్తిగా పసుపు రంగులో ఉంటే అది తియ్యగా ఉంటుందని అర్థం . అయితే పచ్చి బొప్పాయి పచ్చిగా ఉంటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...