LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే.. సైబరాబాద్, మల్కాజ్గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్, తుది తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది.
2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ.. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం.. శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections
మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్కు బయలుదేరింది. ఈ వర్గాన్ని అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది.
రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone
వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు. మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
ALSO ON TELUGUONE N E W S
అఖిల్ అక్కినేని రేపు 'లెనిన్'తో సెల్యులాయిడ్ పై సత్తా చాటడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. త్రీ ఇయర్స్ గ్యాప్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ గా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా థియేటర్స్ ఇప్పటికే అఖిల్ కట్ అవుట్స్ తో నిండిపోవడంతో పాటు అఖిల్ నినాదాలతో మారుమోగిపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద లెనిన్ క్లీన్ హిట్ లేదా సూపర్ హిట్ హోదాని దక్కించుకోవాలంటే ఏ స్థాయిలో వసూళ్లని రాబట్టాలనే లెక్కలపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం అన్ని ఖర్చులు కలుపుకొని థియేట్రికల్ రన్లో సేఫ్ జోన్కు రావాలన్నా, సూపర్ హిట్ స్టేటస్ సాధించాలన్నా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లని రాబట్టాల్సి ఉంటుంది. షేర్ పరంగా చూసుకుంటే, డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చి లాభాల బాట పట్టడానికి కనీసం 25 కోట్ల రూపాయల మేర వరల్డ్వైడ్ షేర్ సాధించాల్సి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ విడుదలకు ముందే ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా 34 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసి జాక్పాట్ కొట్టడం నిర్మాతలకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
Also read: Rashmika: రష్మిక భారీ రిస్క్..ఫ్యాన్స్ కోసం 80 అడుగుల నుంచి దూకేసింది
ఈ 34 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్లో డిజిటల్, శాటిలైట్ హక్కులని ప్రముఖ సంస్థ జీ (ZEE) నెట్వర్క్ ఏకంగా 19 కోట్ల రూపాయలకు సొంతం చేసుకోగా, హిందీ డబ్బింగ్ హక్కుల ద్వారా మరో 9 కోట్ల రూపాయలు వచ్చాయి. అలాగే ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ-సిరీస్ 6 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఆర్టిస్టుల పారితోషికాలు, ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్స్ అన్నీ కలిపి సుమారు 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి విడుదలకు ముందే ఈ స్థాయి రికవరీ రావడం గమనార్హం. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు కొన్ని డబ్బింగ్ చిత్రాల నుండి గట్టి పోటీ ఉన్నప్పటికీ, మొదటి రోజు థియేటర్లలో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం 50 కోట్ల రూపాయల గ్రాస్ టార్గెట్ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ , మనం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో లెనిన్ మీ అందరకి పరిచయం కాబోతున్నాడు.
పెళ్లి తర్వాత అయినా సరే తగ్గేదెలే అంటూ రష్మిక వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతుంది. హజ్బండ్ విజయ్ దేవరకొండతో 'రణబలి' చేస్తుండగా తన లిస్ట్ లో ఉన్న మరో మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతుండగా రష్మిక గ్లామర్ రోల్ లో కాకుండా, వ్యవస్థపై ధిక్కార స్వరం వినిపించే గోండు తెగకి చెందిన ఒక పవర్ఫుల్ గిరిజన మహిళగా, నక్సలైట్ క్యారక్టర్ కనిపించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. భావోద్వేగాలు, కోపం, ఆవేశం కలగలిపిన ఈ విలక్షణమైన రోల్ కోసం రష్మిక పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.
'మైసా' లో హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సహజత్వం కోసం రష్మిక మందన్న ఏకంగా అంతర్జాతీయ స్థాయి యాక్షన్ డైరెక్టర్ ఆండిలాంగ్, అలాగే ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంపక్డీ పర్యవేక్షణలో థాయ్లాండ్లోని బ్యాంకాక్లో వారం రోజుల పాటు ప్రత్యేక కంబాట్ శిక్షణ తీసుకున్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజూ ఏకంగా 8 గంటల పాటు కఠోర శ్రమతో కూడిన మార్షల్ ఆర్ట్స్, గిరిజనుల సాంప్రదాయ పోరాట విధానాలపై కసరత్తులు చేయడం విశేషం. శారీరకంగా, మానసికంగా మరింత దృఢంగా మారాలని నిర్ణయించుకుని ఈ రిస్క్ తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షెడ్యూల్ను కేరళలో పూర్తి చేశారు. కొచ్చిలోని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, నిరంతరం కురిసే వర్షాల మధ్య దాదాపు 16 రోజుల పాటు ఈ యాక్షన్ షెడ్యూల్ సాగింది. ఈ షూటింగ్ సమయంలో రష్మిక నిజంగానే ప్రాణాలకు తెగించి సాహసాలు చేసింది. కేరళలోని ప్రసిద్ధ అతిరపల్లి జలపాతం వద్ద ఎలాంటి డూప్ సహాయం తీసుకోకుండా, ఏకంగా 80 అడుగుల ఎత్తు నుండి కిందకు జంప్ చేసి చిత్ర యూనిట్తో పాటు సినీ వర్గాలని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నీటిలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక తన మోకాళ్లు, కాళ్లకు ప్రత్యేకమైన మెడికల్ టేపింగ్ వేసుకుని మరీ అత్యంత ప్రమాదకరమైన స్టంట్స్ పూర్తి చేసింది.
Also read: మన్మధ రీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక యూత్ ని ఎవరు ఆపలేరు
ఈ కేరళ షెడ్యూల్ అనుభవాలను రష్మిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అవి కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. ప్రకృతి అందాలు, జలపాతాల మధ్య సాగిన ఈ ప్రయాణం తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని, అయితే శారీరకంగా ఈ యాక్షన్ సీన్ల కోసం తాను ఎంతో కష్టపడాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అన్ఫార్ములా ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. యాక్షన్తో పాటు బలమైన ఎమోషన్స్కు పెద్దపీట వేస్తున్న 'మైసా' చిత్రం రష్మిక కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. గ్లామర్ ఇమేజ్ను పక్కనపెట్టి ఆమె చేస్తున్న ఈ వీరోచిత పోరాటం వెండితెరపై ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin). మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాలతో రేపు(జూలై 10) థియేటర్లలో అడుగు పెట్టనుంది. అయితే ఈ సినిమా నుంచి మొదట హీరోయిన్గా అనుకున్న శ్రీలీలను ఉన్నట్టుండి మార్చేసి, ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ హీరోయిన్ చేంజ్పై సోషల్ మీడియా వేదికగా రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. శ్రీలీలకు లక్ కలిసిరావడం లేదని, అందుకే సెంటిమెంట్ పరంగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారంటూ కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అఖిల్ అక్కినేని 'ఏజెంట్' డిజాస్టర్ తర్వాత ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలనే పట్టుదలతో ఈ సినిమా చేయడంతో, ఈ హీరోయిన్ మార్పు వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకోవాలని అక్కినేని అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
ఈ నేపథ్యంలో, 'లెనిన్' చిత్ర నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఈ హీరోయిన్ రీప్లేస్మెంట్ వివాదంపై, శ్రీలీలపై వస్తున్న నెగెటివ్ ట్రోల్స్పై స్పందిస్తూ అసలు నిజాన్ని చెప్పారు. ఒక మంచి సినిమా రూపొందే క్రమంలో కొన్నిసార్లు అన్నీ అనుకూలంగా కలిసి వస్తాయని, ఈ సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత కూడా హీరోయిన్, కెమెరామన్ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయని ఆయన అంగీకరించారు. అయితే సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా శ్రీలీల వల్ల సినిమాకు బ్యాడ్ జరుగుతుందనే పుకార్లలో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో పాపం శ్రీలీల తప్పేం లేదని, కేవలం డేట్స్ అడ్జస్ట్మెంట్ సమస్యల వల్లే శ్రీలీలను మార్చాల్సి వచ్చిందని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఫైనల్ ప్రొడక్ట్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ అంతా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నామని నిర్మాత పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు మంచి జరగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఊహించని మార్పులు సహజంగానే జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు స్క్రీన్ మీద భాగ్యశ్రీ బోర్సే పెర్ఫార్మెన్స్ చూసుకున్న తర్వాత.. అసలు ఈ పాత్రను దర్శకుడు మురళి కిషోర్ కేవలం ఆమె కోసమే రాశాడా అన్నంత అద్భుతంగా కుదిరిందని ప్రశంసించారు. భాగ్యశ్రీ ఈ సినిమాలో నటన పరంగా చాలా బాగా చేసిందని, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక పెద్ద అసెట్ కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. నాగవంశీ ఇచ్చిన ఈ సాలిడ్ క్లారిటీతో శ్రీలీల ఎగ్జిట్పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రచారాలకు పూర్తిగా తెరపడినట్లయింది.
Lenin Movie, Akhil Akkineni, Bhagyashri Borse, Naga Vamsi, Sreeleela
20 ఏళ్ల క్రితం కుర్రకారుని ఒక ఊపు ఊపేసిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'మన్మధ'(Manmadha). పన్నెండేళ్ల వయసు వాళ్ళు కూడా టికెట్ల కోసం థియేటర్ దగ్గర తిష్ట వేసి మరి చూశారంటే మన్మధ ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు వంటి ప్రాంతాల్లో అయితే చాలా రోజులు హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. మెంబర్ ఆఫ్ సెంటర్స్ లో అర్ధ శతదినోత్సవం కూడా జరుపుకుంది. శింబు, జ్యోతిక జంటగా చేసారు.
జూలై 18న ఆంధ్రప్రదేశ్, నైజాం ప్రాంతాల్లో రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర బృందం అధికారకంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి.నేటి జనరేషన్ ప్రేక్షకులు ఎగబడి చూస్తున్న రొమాంటిక్ సైకో థ్రిల్లర్ జోనర్కి 2004లోనే ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇప్పుడొస్తున్న 'ఆర్ఎక్స్ 100', 'బేబీ' వంటి సినిమాల కంటే ఎంతో భిన్నమైన, బలమైన కథాంశంతో, అద్భుతమైన ట్విస్టులతో అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. కేవలం 5 కోట్ల బడ్జెట్తో రూపొందగా తమిళ్తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించని రేంజ్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. శింబు ద్విపాత్రాభినయం (డ్యూయల్ రోల్) లో అద్భుతంగా నటించి మెప్పించారు. ప్రేమికుడిగా అమాయకత్వాన్ని, సైకో కిల్లర్గా క్రూరత్వాన్ని శింబు పండించిన తీరు ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తిండిపోయింది.
ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించినప్పటికీ, హీరో శింబు స్వయంగా ఈ సినిమాకు కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం. శింబు కెరీర్లోనే మైల్స్టోన్గా నిలిచిన ఈ సినిమా విజయానికి మరో ముఖ్య కారణం సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా. అందించిన ప్రతీ పాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ (BGM) ఒక అద్భుతం. ముఖ్యంగా లవ్ థీమ్స్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఎలివేట్ చేసే మ్యూజిక్ ప్రేక్షకులని థియేటర్లలో కట్టిపడేసింది. ఇరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. సింధు తులాని, మందిరా బేడి, అతుల్ కులకర్ణి, యాగా గుప్తా వంటి వారు కీ రోల్స్ పోషించారు. ఇప్పటికే పలు డబ్బింగ్ సినిమాలు రీ-రిలీజ్లో తెలుగు బాక్సాఫీస్ వద్ద ఊహించని కలెక్షన్స్ సాధించాయి, మరి జూలై 18న థియేటర్లలోకి రాబోతున్న ఈ కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'మన్మధ' ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి. ఒకరితో ప్రేమలో ఉండి మరొకరితో శృంగారం చేసే యువతులే టార్గెట్ గా చిత్ర కధాంశం తెరకెక్కింది.
అక్కినేని వారసుడు అఖిల్ నటించిన 'ఏజెంట్' సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, ఈసారి ఎలాగైనా పెద్ద హిట్ పట్టుదలతో ఉన్నాడు. అందుకే గ్యాప్ తీసుకుని, పూర్తి వైవిధ్యమైన కథతో వస్తున్నాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ రూరల్ యాక్షన్ డ్రామా 'లెనిన్' (Lenin). మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్లో, మాస్ అవతారంలో కనిపించనున్నాడని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్థమవుతోంది.
నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ను టార్గెట్ చేసింది. తొలుత మే 1న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల ఆలస్యం వల్ల జూన్ 26 కి పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత నాగార్జున స్వయంగా ఈ చిత్రాన్ని జులై 10న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే అఖిల్కు ఒక పెద్ద ట్విస్ట్ ఎదురైంది. సమ్మర్లో సోలోగా రావాలనుకున్న 'లెనిన్' చిత్రానికి ఇప్పుడు జులై 10న సోలో రిలీజ్ దక్కే ఛాన్స్ లేకుండా పోయింది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ బరిలో ఏకంగా నాలుగైదు డబ్బింగ్ సినిమాలతో గట్టి పోటీ పడాల్సి వస్తోంది.
ఈ పోటీలో మొదటిగా చెప్పుకోవాల్సింది మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ గురించి. ప్రభాస్ 'సలార్' సినిమాలో వరదరాజ్ మన్నార్గా తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన పృథ్విరాజ్, ఇప్పుడు 'ఐ నో బడీ' (I, Nobody) అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్తో జులై 10న థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ను తెలుగులోనూ భారీగా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ స్రవంతి మూవీస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ సంయుక్తంగా ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుండటంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
దీనితో పాటు కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ మురళి కూడా టాలీవుడ్ మార్కెట్పై కన్నేశాడు. ఆయన నటించిన 'ఇదయం మురళి' అనే చిత్రాన్ని తెలుగులో 'హృదయం మురళి' (Hrudhayam Murali) పేరుతో అదే రోజున విడుదల చేస్తున్నారు. కయాదు లోహర్, ప్రీతి ముకుందన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఒక కీలక పాత్ర పోషించడం విశేషం.
ఇక వీటితో పాటు తమిళ స్టార్ హీరో ధనుష్ మేనల్లుడు పవిష్ హీరోగా నటించిన 'లవ్ ఓ లవ్' (Love Oh Love) అనే చిత్రం కూడా జులై 10నే థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాతో తెలుగు యూట్యూబర్ నాగదుర్గ హీరోయిన్ గా పరిచయమవుతుండటం విశేషం. అలాగే మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వసుదేవ సుతం' సినిమా కూడా అదే రోజున లక్ను పరీక్షించుకోబోతోంది.
ఒక్కోసారి డబ్బింగ్ సినిమాలు కూడా బాక్సాఫీస్ ఫైట్ లో తెలుగు స్టార్స్ కి షాకిచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి ఆ అవకాశం ఉండదని, లెనిన్ అవుట్ పుట్ అదిరిపోయిందని అంటున్నారు. అఖిల్ సహా టీమ్ అంతా 'లెనిన్' రిజల్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఈ డబ్బింగ్ సినిమాల బాక్సాఫీస్ క్లాష్ను తట్టుకుని 'లెనిన్' ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
Akhil Akkineni, Lenin Movie, I Nobody, Hrudayam Murali, Vasudheva Sutham
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు, గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే..
మైక్రోప్రైవసీ..
మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్ అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్ వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది.
ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది.
మైక్రో ప్రైవసీలో అసలు అర్థం..
మైక్రోప్రైవసీలో ఉండే ముఖ్యమైన అంశం భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్ సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది.
మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం..
మైక్రో ప్రైవసీ సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి వారి స్వంత సమయం, స్పేస్ ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు. ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి.
ఇలా చేయాలి..
భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ. ఇది ఈ రోజు కొత్తగా చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు. ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.
*రూపశ్రీ.
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.
అలాగే మొబైల్కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.
మొబైల్ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు.
మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం. అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు. అసలు డింక్ అంటే ఏమిటి? దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే..
దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది, సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా, వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా నెమ్మదిగా అలవాటు పడుతున్నారు.
డింక్ అంటే..
DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం.
డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్..
కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఆర్థిక భారం..
చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే.. ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది.
క్వాలిటీ లైఫ్..
పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం. పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు. పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు.
మరొక మార్గం..
చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు. కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా, కుటుంబాన్ని కాపాడుకోవడం , జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.
*రూపశ్రీ.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వంఒక వినూత్న తరహా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈసారి హైదరాబాద్ నగర పరిధిలోని మున్సిపల్ ఎన్నికలను ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే.. సైబరాబాద్, మల్కాజ్గిరి కంటే ముందే జీహెచ్ఎంసీ పరిధిలో పోలింగ్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎన్నికలను నవంబర్ నెలలో నిర్వహించేలా కసరత్తు జరుగుతున్నప్పటికీ, అధికారిక షెడ్యూల్, తుది తేదీలపై స్పష్టత రావాల్సి ఉంది.
2020 జీహెచ్ఎంసీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడు తెలంగాణ రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. 2020 ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ ఏకంగా 56 స్థానాలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 48 స్థానాలతో గట్టి పోటీ ఇవ్వగా, ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకుంది. కానీ, నాటి అధికార పీఠం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పు చోటు చేసుకుంది.
ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని పార్టీలూ.. గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే తెరవెనుక వ్యూహాలు, ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఒకేసారి ఎన్నికలు పెడితే యంత్రాంగంపై పడే భారం.. శాంతిభద్రతల సమస్యలు, రాజకీయంగా వచ్చే లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ప్రభుత్వం జీహెచ్ఎంసీకి విడతల వారీ ఎన్నికల ప్లాన్ ను తెరపైకి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ అయిన సైబరాబాద్, అత్యంత పెద్ద నియోజకవర్గ పరిధి కలిగిన మల్కాజ్గిరిలను పక్కన పెట్టి, మొదట కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీపైనే ఫోకస్ పెట్టడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
Hyderabad Municipal Elections, GHMC Polls 2026, Telangana Political News, Cyberabad Elections
మండల అధ్యక్ష పదవులు కాంగ్రెస్ లో చిచ్చు రేపాయి. సూర్యాపేట జిల్లా అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ లో రెండు వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. రాళ్లు, కర్రలతో పరస్పర దాడులకు తెగబడ్డాయి. విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల నియామకాలపై చెలరేగిన అసంతృప్తి రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది.
మండల అధ్యక్షుల నియామకాలను వ్యతిరేకిస్తూ అసమ్మతి వర్గం చలో గాంధీభవన్కు బయలుదేరింది. ఈ వర్గాన్ని అర్వపల్లి చౌరస్తా వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్యా తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది.
రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. లాఠీ చార్జితో పరిస్థితిని అదుపు చేశారు. ఈ ఘటనతో అర్వపల్లి చౌరస్తా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
conflict among Congress factions, flare up over posts, Suryapet district, Arvapalle, Stones, Sticks, Teluguone
వైసీపీలో అంతర్గత వైషమ్యాలు, కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీలో రెండు వర్గాలు రోడ్డున పడి కొట్టుకున్నాయి. వైసీపీ మహిళా కార్యకర్తలైతే జుట్టూ జట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇక పురుష క్యాడర్ చొక్కాలు చించుకుని మరీ వీరంగమాడారు. ఈ గొడవ ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ కార్యాలయం సాక్షిగా, అదీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జరిగింది. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కాళ్లు తొక్కుతున్నారంటూ కొంతమంది పురుష క్యాడర్ ను నిలదీశారు. దీంతో అక్కడ రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడులకు పాల్పడ్డారు. మహిళలు జుట్టూజుట్టూ పట్టుకుని కొట్టుకుంటే... పురుషులు చొక్కాలు చించుకున్నారు. దీంతో ఒక్కసారిగా పార్టీ కార్యాలయంలో గందరగోళం ఏర్పడింది. వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఘర్షణకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
YSR, Birth Anniversary, Ongole, Groups, Quarrel
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి.
ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు.
ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు:
థైరాయిడ్ అంటే ఏమిటి?
థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం?
థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు
తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు
అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత
థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు
జీవనశైలిలో చేయాల్సిన మార్పులు
థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వారు ఆహారంలో రొట్టెలు తీసుకోవడం మంచిదని అనుకుంటారు. చపాతీలు, సజ్జ, జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా జొన్నరొట్టెలు శరీరానికి చక్కని పోషణ ఇస్తాయి. అంతేకాదు.. 30 రోజులు అన్నానికి బదులుగా జొన్న రొట్టెలు తింటే ఆరోగ్య పరంగా అద్బుతమైన ఫలితాలు చూస్తారు. 30రోజులు జొన్న రొట్టెలు తింటే ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
30రోజులు అన్నానికి బదులు జొన్న రొట్టెలు తింటే కలిగే ఫలితాలు..
భారతీయులు ఉపయోగించే తృణదాన్యాలలో జొన్నలు చాలా శ్రేష్టమైనవి. జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ కారణంగా అన్నానికి బదులు జొన్న రొట్టెలు తినడం వల్ల చాలాసేపటి వరకు ఆకలి అవ్వదు. ఈ కారణంగా పదే పదే ఏదో ఒకటి తినడం అనే అలవాటు కూడా తగ్గుతుంది. దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. రోజూ అన్నానికి బదులు జొన్నరొట్టెలు తినేవారు బరువు సులువుగా తగ్గుతారు.
డయాబెటిస్ ఉన్న వారికి జొన్నలు గొప్ప వరం అని చెప్పవచ్చు. అన్నంతో పోలిస్తే జొన్నరొట్టెలలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల జొన్నరొట్టెలు తింటే షుగర్ లెవెల్స్ నిలకడగా ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు అన్నం, చపాతీ బదులు రోజూ జొన్నరొట్టెలు తింటే బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్ అవుతాయి.
జొన్నలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడంలో ఎలా ఇబ్బందులు ఉండవు. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు రోజూ జొన్నరొట్టెలు తీసుకుంటే మలబద్దకం సమస్య తొగ్గిపోతుంది. జీర్ణాశయం స్థితి మెరుగవుతుంది.
జొన్నరొట్టెలలో ఉండే గ్లైసెమిక్ సూచీ చాలా తక్కువ. ఇది రక్తంలో గ్లూకోజ్ ను చాలా నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఈ కారణంగా నెమ్మదిగా అరుగుతుంది. దీనివల్ల చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉండటమే కాదు.. చాలా సేపు ఎనర్జీగా కూడా ఉంచుతుంది. అన్నం అయితే తొందరగా అరిగిపోతుంది. అందుకే జొన్నరొట్టెలు తింటే ఎక్కువ సేపు ఎనర్జీగా ఉండవచ్చు.
పూరీ, బేకరీ ఫుడ్స్, కేక్స్, ఆయిల్ ఫుడ్స్ వంటివి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు ఏ ఆహారం తినాలన్నా చాలా భయపడుతూ ఉంటారు. కానీ రోజూ జొన్న రొట్టెలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
జొన్నరొట్టెలు శరీరానికి చలువ చేస్తాయి, బలాన్ని ఇస్తాయి, ఎక్కువ సేపు శరీరానికి శక్తిని ఇస్తాయి, రోజూ కనీసం ఒక్కపూట అయినా జొన్న రొట్టెలు తింటే శరీరాన్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అందుకే కనీసం రోజులో ఒక్క పూట అయినా జొన్న రొట్టెను ఆహారంలో తీసుకోవడం మంచి అలవాటని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు.
*రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.
ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు:
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి?
స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది?
స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి?
స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి?
చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి?
"గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం?
ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి?
స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి?
స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి.
