LATEST NEWS
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ వారి పట్ల సవతితల్లి ప్రేమను చూపుతోందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు.
ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 13) నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని హల్దియా, ఖరగ్పుర్ వంటి ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ.. ముర్షీదాబాద్ వంటి జిల్లాలో కనీసం ఒక్కటంటే.. ఒక్క ప్రత్యేక ఆర్థిక మండలి కూడా కూడా ఎందుకు ఏర్పాటు కాలేదని విమర్శించారు.
బిజెపి బూచి చూపి.. ముస్లింలలో భయాందోళనలు సృష్టించి ఎన్నికలలో లబ్ధి పొందాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునాథ్ గంజ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముర్షీదాబాద్ రూపురేఖలు మారుస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఎంఐఎం పోరాడుతుందన్న ఆయన, ముర్షీదాబాద్లో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎంఐఎం అభ్యర్థిని గెలిపిం చాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎన్నికలలో ఏ మూరకు ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతును బలంగా వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. ఈ పర్యటన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం హస్తిన వేదికగా గళమెత్తడినికే అని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైనే ఇండియా కూటమి నేతలతో చర్చించనున్నారు. వీలైతే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అంశంపై కూడా ఈ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో రేవంత్ చర్చిస్తారు. ఇక పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి కూడా చర్చించే అవకాశా లున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రోజుల ముందు ఈడీ ఐప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ ను అరెస్టు చేసింది. ఇటీవల ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఈడీ దూకుడు వెనుక రాజకీయం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదలా ఉంటే.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్ ను ఈడీ అధికారులు ఢిల్లీలో సోమవారం (ఏప్రిల్ 13) రాత్రి అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయనను హస్తినలోని పీఎంఎల్ఏ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనను పది రోజులు ఈడీ కస్టడీకి ఆదేశించింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారన్నది వినేష్ చందేల్పై ఉన్న అభియోగం. కాగా ప వినేష్ చందేల్ అరెస్టును తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వినేల్ చందేల్ ను ఈడీ అరెస్టు చేసిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
ALSO ON TELUGUONE N E W S
టాక్సిక్ పై ఫ్యాన్స్ , ప్రేక్షకుల్లో భారీ అంచనాలు
మార్చి 19 నుంచి జూన్ 4 కి వాయిదా
మళ్ళీ వాయిదా అంటు న్యూస్
షాక్ లో ఫ్యాన్స్
సౌత్ ఇండియాలో మీ ఇష్టమొచ్చిన సినీ ప్రేమికుడ్నికదిలించి కేజిఎఫ్ చాప్టర్ 1 ,చాప్టర్ 2 కి మధ్య రిలీజ్ గ్యాప్ ఎంతని అడగండి. టక్కున చెప్తారు. పైగా మనం అడగకుండానే ఆ సినిమాల స్థాయిలోనే నెక్స్ట్ చిత్రం కూడా ఉండాలని నాలుగేళ్ల గ్యాప్ తీసుకొని 'టాక్సిక్'(Toxic)తో రాబోతున్నాడని చెప్తారు. అంతలా యష్ వాళ్లందరితో కనెక్ట్ అయి ఉన్నాడు.
టాక్సిక్ గత నెల మార్చి 19 న రిలీజ్ అవ్వాల్సింది. కానీ యుఎస్ తో పాటు గల్ఫ్ కంట్రిస్ లో కమ్ముకున్న యుద్ధ నేపథ్యంలో జూన్ 4 కి వాయిదా వేశారు. కానీ ఈ డేట్ నుంచి కూడా వెనక్కి వెళ్లనుందనే రూమర్స్ ఫ్యాన్స్ కి ఈ సమ్మర్ మరింత హీట్ గా ఉంది కదా అనేలా చేస్తుంది. ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ అధికారంగా వెల్లడి చేసారు. యధావిధిగా జూన్ 4 నే వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కానుందని చెప్పారు.
also read: Ananya Nagalla: అలా అయితేనే ఒప్పుకుంటా.. అనన్య సీక్రెట్ బయటపడింది
రూమర్స్ గాళ్ళు మరింత కుళ్ళుకునే తాజా న్యూస్ ఏంటంటే ఓవర్ సీస్ లో యష్ ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కుతున్న అత్యధిక హై బడ్జెట్ మూవీగా కూడా ప్రాచుర్యం పొందిన టాక్సిక్ ఒక వినూత్నమైన కదాంశంతో తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన ప్రచార చిత్రాలైతే హాట్ టాపిక్ గా కూర్చొని ఉన్నాయి. యష్ డ్యూయల్ రోల్ లో చేస్తుండగా రుక్మిణి వసంత్,కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తార సుతారియా ముఖ్యమైన క్యారెక్టర్స్. గీతు మోహన్ దాస్(Geethu Mohandas)దర్శకురాలు కాగా హిస్టారికల్ డ్రామాతో కూడిన గ్యాంగ్ స్టర్ ఫిలిం. జననాయగన్(Jananayagan)ప్రొడక్షన్ కంపెనీ కె వి ఎన్ ప్రొడక్షన్ నే నిర్మించింది.
- ఆ రిస్కీ స్టంట్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- వాయువేగంతో మెగా పోరాటం
- క్లాసిక్ యాక్షన్ అప్డేట్.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మాస్ మరియు సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ కలగలిసిన విభిన్నమైన చిత్రం 'శివుడు శివుడు శివుడు'. ఈ సినిమాలో పంచభూతాల సాక్షిగా జరిగే క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అప్పట్లో ఒక సంచలనం. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్గా నటించారు. ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో కూడిన ఈ వీడియో మీకు అందిస్తున్నాం.
మెగాస్టార్ చిరంజీవి రౌద్ర రూపం.. 'శివుడు శివుడు శివుడు'లో పంచభూతాలను గడగడలాడించిన వైనం!
తెలుగు సినీ యవనికపై మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆయన యాక్షన్ సీక్వెన్స్లు థియేటర్లలో ఈలలు, గోలలతో మారుమోగిపోయేవి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'శివుడు శివుడు శివుడు' క్లైమాక్స్ వీడియో చూస్తుంటే వింటేజ్ మెగాస్టార్ పవర్ ఏంటో మరోసారి అర్థమవుతోంది. విలన్ భానుజీ బందీగా ఉంచుకున్న పంచభూతాల వంటి ఐదుగురు మహా యోధులను ఎదుర్కొనే ఈ సీన్ సినిమాకే హైలైట్.
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం అప్పట్లోనే అద్భుతమైన ప్రిపరేషన్ జరిగినట్లు స్పష్టమవుతోంది. గురువు రవీంద్ర ఆశయాల కోసం, సమాజ హితం కోసం హీరో చేసే ఈ పోరాటం కేవలం శారీరక శక్తితో కాకుండా మంత్ర, తంత్ర అస్త్ర విద్యల కలయికగా సాగుతుంది. ఒక్కో భూతాన్ని (శక్తిని) జయించే క్రమంలో చిరంజీవి చూపించిన టైమింగ్, ఆ వేగం మెగా అభిమానులకు కనువిందు చేస్తాయి.
స్టంట్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఈ విన్యాసాలు అప్పట్లో ఒక విజువల్ వండర్. అగ్ని, వాయువు, ఆకాశం వంటి శక్తులను ప్రతిబింబించే యోధులతో చిరంజీవి తలపడే తీరు అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. ముఖ్యంగా మంటల మధ్యలో చేసే విన్యాసాలు మరియు గాలిలో ఎగురుతూ చేసే ఫైట్స్ ఆ కాలపు టెక్నాలజీ పరిమితుల్లో కూడా అద్భుతంగా తెరకెక్కించారు. హీరో పడే శ్రమ, పలికించే రౌద్ర రసం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి.
ప్రతి దశలోనూ శత్రువు పైచేయి సాధిస్తున్నట్లు కనిపించినా, చివర్లో తన గురువు ఇచ్చిన స్ఫూర్తితో చిరంజీవి పుంజుకునే తీరు అద్భుతం. "ఉత్తిష్ట.. ఉత్తిష్ట" అంటూ సాగే నేపథ్య సంగీతం ఈ యాక్షన్ సీక్వెన్స్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ పోరాటంలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్ మరియు కళ్లలో కనిపించే తీవ్రత ఆయనను మాస్ హీరోగా ఎలా నిలబెట్టాయో నిరూపిస్తాయి.
చివరికి ఆ ఐదుగురు బలవంతులను ఓడించి, విలన్ గర్వాన్ని అణచివేసి, ప్రజాస్వామ్యమే సర్వోత్తమమని చాటిచెప్పే ఘట్టంతో ఈ పోరాటం ముగుస్తుంది. ఈ వీడియో చూస్తున్న నెటిజన్లు "మెగాస్టార్ గ్రేస్ ఎప్పటికీ తగ్గదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ టచ్ ఉన్న ఇటువంటి యాక్షన్ డ్రామాలు చిరంజీవి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతాయి.
ఈ చిత్రం కేవలం కమర్షియల్ యాక్షన్ మాత్రమే కాకుండా, సమాజంలో మార్పు రావాలనే బలమైన సందేశాన్ని కూడా ఇస్తుంది. నేటి యాక్షన్ సినిమాలతో పోల్చినా 'శివుడు శివుడు శివుడు'లోని ఈ క్లైమాక్స్ ఫైట్ ఇప్పటికీ ఫ్రెష్గా ఉండటం విశేషం. వింటేజ్ చిరంజీవి మేజిక్ను ఇష్టపడే వారందరికీ ఈ వీడియో ఒక స్వీట్ మెమరీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం కేరళలోనే కాకుండా యావత్ భారత దేశవ్యాప్తంగా ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచింది. అయితే తాజాగా ఈ సిరీస్లోని రెండో భాగం ‘దృశ్యం 2’ థియేటర్లలో రీ-రిలీజ్ కాగా, బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫలితాన్ని చవిచూసింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ చూసి ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి.
నిజానికి ‘దృశ్యం 2’ సినిమా కరోనా సమయంలో నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయినప్పటికీ, ఈ చిత్రం రికార్డు స్థాయి వ్యూస్తో సంచలనం సృష్టించింది. దీంతో ఈ చిత్రాన్ని వెండితెరపై చూడలేకపోయామన్న అభిమానుల కోరిక మేరకు, మేకర్స్ ఇటీవల ఏప్రిల్ 10న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేశారు. కానీ, థియేటర్లలో జార్జ్ కుట్టి కథను మళ్లీ చూడటానికి ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
తాజా సమాచారం ప్రకారం, కేరళ వ్యాప్తంగా ఈ రీ-రిలీజ్ కేవలం 5 లక్షల రూపాయల లోపు మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని చోట్ల అసలు షోలు కూడా రన్ చేయలేని పరిస్థితి నెలకొందని టాక్. థియేటర్ అద్దెలు, పబ్లిసిటీ ఖర్చులు కూడా రాని స్థాయిలో ఈ సినిమా చతికిలపడటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఓటీటీలో ఇప్పటికే కోట్లాది మంది ప్రేక్షకులు ఈ సినిమాను పలుమార్లు చూసేయడం, అలాగే ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాల జోరు ఉండటమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
మోహన్లాల్ కెరీర్లో ‘దృశ్యం’ ఒక మైలురాయి. 2013లో వచ్చిన మొదటి భాగం అప్పట్లో మలయాళ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా స్క్రిప్ట్ పరంగా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. సాధారణంగా మోహన్లాల్ పాత సినిమాలు ‘స్ఫటికం’, ‘దేవదూతన్’ వంటివి రీ-రిలీజ్లో కోట్లు కొల్లగొట్టాయి. కానీ ‘దృశ్యం 2’ విషయంలో సీన్ రివర్స్ అవ్వడం మేకర్స్ను ఆలోచనలో పడేసింది.
సోషల్ మీడియాలోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. "ఇప్పటికే టీవీల్లో, మొబైల్స్లో చూసిన సినిమానే మళ్లీ థియేటర్లలో చూడటం ఎందుకు?" అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం ట్రై చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా, రీ-రిలీజ్ స్ట్రాటజీ ఈ సినిమా విషయంలో వర్కౌట్ కాలేదని స్పష్టమవుతోంది.
అయితే ఈ పరాజయం రాబోయే ‘దృశ్యం 3’పై ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మే 21న మోహన్లాల్ పుట్టినరోజు సందర్భంగా ‘దృశ్యం 3’ నుంచి ఏదైనా క్రేజీ అప్డేట్ వస్తుందేమోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక పక్క ఈ ఫెయిల్యూర్ డిస్కషన్ నడుస్తున్నా, మరోపక్క జార్జ్ కుట్టి నెక్స్ట్ ప్లాన్ ఏంటా అన్న క్యూరియాసిటీ మాత్రం అందరిలోనూ బలంగా ఉంది.
టాలీవుడ్ లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్ లలో 'డ్రాగన్' (Dragon) ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తాజాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) నటించబోతోందనే వార్త నెట్టింట వైరల్గా మారింది.
మళ్ళీ కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ - అలియా!
'డ్రాగన్'లో ఇప్పటికే రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ఒక పవర్ ఫుల్ రోల్ కోసం అలియా భట్ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాలో ఎన్టీఆర్ (కొమురం భీమ్), అలియా (సీత) కలిసి నటించిన సంగతి తెలిసిందే. 'ఆర్ఆర్ఆర్'లో రామ్ చరణ్ కి జోడిగా అలియా నటించినప్పటికీ.. ఎన్టీఆర్-అలియా మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఆఫ్ స్క్రీన్ లోనూ వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్-అలియా కాంబో అనగానే ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది.
భారీ అంచనాలు.. మరింత స్టార్ పవర్!
ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే విజువల్ గ్రాండియర్, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లకు పెట్టింది పేరు. ఇప్పటికే 'కెజిఎఫ్', 'సలార్' సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన నీల్.. ఎన్టీఆర్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టును సిద్ధం చేశారని టాక్. అలియా వంటి స్టార్ నటి ఈ ప్రాజెక్ట్లో చేరితే సినిమా స్థాయి మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.
కీలక పాత్రలో అలియా?
డ్రాగన్ సినిమాలో అలియా భట్ హీరోయిన్గా కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో మహిళా పాత్రలను ఎంతో శక్తివంతంగా తీర్చిదిద్దుతారు. ఈ క్రమంలోనే డ్రాగన్ కోసం ఒక పవర్ ఫుల్ రోల్ రాసి, ఆ రోల్ కోసం అలియాను సంప్రదించినట్లు టాక్.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపులు
ప్రస్తుతం ఈ వార్తలపై అటు చిత్ర యూనిట్ నుంచి కానీ, ఇటు అలియా భట్ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ కావాలని బలంగా కోరుకుంటున్నారు. అలియా నిజంగానే ఈ ప్రాజెక్ట్లో భాగమవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
-వకీల్ సాబ్ తో ప్రత్యేక గుర్తింపు
-ఈ సారి హిట్ పక్కా అంటా
-ఆ సీక్రెట్ నే కారణమా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)పవర్ ప్యాక్డ్ మూవీ వకీల్ సాబ్ తో మూవీ లవర్స్ చాయ్, బిస్కెట్ డిస్కర్షన్ లో చోటు సంపాదించిన భామ అనన్య నాగళ్ళ(Ananya Nagalla). అంతలా దివ్య నాయక్ గా నాచురల్ పెర్ఫార్మ్ తో కట్టిపడేసింది. దీంతో తన సినీ రేంజ్ ఎలాంటి మలుపు తిరగబోతుందా అని అందరు ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ ఎలాంటి హడావిడి లేదు. మధ్యలో కొన్ని చిత్రాలు చేసినా అవి పేరుకి మాత్రమే ఉన్నట్లయ్యింది. చిత్రాల కౌంట్ కూడా పెద్దగా లేదు. ఎందుకని ఇలా అనుకుంటున్న తరుణంలో తనే ఆ విషయాన్నీ బయటపెట్టింది. మరి ఆ విషయమేంటో చూసేద్దాం.
అనన్య తన కొత్త మూవీ 'లీసా'(Leesa)తో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవ్వబోతుంది. ఈ మేరకు నిన్న టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా అనన్య మాట్లాడుతు ఏ మూవీ స్క్రిప్ట్ విన్నా, నేను కొత్తగా చేయడానికి ఏముంది అనుకుంటా. అలా కొత్తగా ఉండబట్టే 'లీసా' ఒప్పుకున్నాను. హీరోయిన్ కి ఇలాంటి క్యారెక్టర్స్ అరుదుగా వస్తుంటాయి. ఖచ్చితంగా నా కెరీర్ లో మైలురాయిలా గుర్తిండిపోయే మూవీ అవుతుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
also read: Ott: ఊహకి అందని తెలుగు ఓటిటి హర్రర్ థ్రిల్లర్.. ఈ నెల 17న మీ కోసమే వస్తుంది
టైటిల్ చూస్తుంటే అనన్య మెయిన్ రోల్ అనే విషయం అర్ధమవుతుంది. మరి ఈ చిత్రంతోనైనా హిట్ ని తన సినీ లాకర్ లో భద్రపరుచుకుంటుందేమో చూడాలి. జవహర్ లాల్ దర్శకత్వంలో యుఎస్ మేకర్స్ వెంకట్ దుగ్గిరెడ్డి, రమేష్ ఐలా నిర్మిస్తున్నారు.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు.
టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.
జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది.
"ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు.
సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు.
గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.
*నిశ్శబ్ద.
ఏదయినా ఒక వస్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు చేజారి పడి పగిలిపోయినా, దొంగతనం జరిగినా, ఎక్కడో మర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొందలేమని దిగులు పట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్టమయిన పెయింటింగ్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దూరమయింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడగలి గింది.
అదంటే మరి ఆమెకు ప్రాణ సమానం. చాలా కాలం దొరుకుతుందని, తర్వాత ఇక దొరకదేమో అనీ ఎంతో బాధపడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గతేడాది ఆమెను చేరింది. ఆమెది నెదర్లాండ్స్. ఆమె తండ్రి నెదర్లాండ్స్లోని ఆర్నెహెమ్లో చిన్నపిల్లల ఆస్పత్రి డైరెక్టర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విషయానికి వస్తే.. అది 1683లో కాస్పర్ నెషర్ వేసిన స్టీవెన్ ఓల్టర్స్ పెయింటింగ్.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల ఆదేశాలను చార్లెట్ తండ్రి వ్యతిరేకించారు. ఆయన రహస్య జీవనం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్ని మాత్రం తన నగరంలోని ఒక బ్యాంక్లో భద్ర పరచమని ఇచ్చారట. 1940లో నాజీలు నెదర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద పడి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ ఎక్కడున్నదీ ఎవరికీ తెలియలేదు. చిత్రంగా 1950ల్లో డసల్డార్ష్ ఆర్ట్ గ్యాలరీలో అది ప్రత్యక్షమయింది. 1969లో ఆమ్స్టర్డామ్లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాలరీలో వుందని చూసినవారు చెప్పారు. వేలంపాట తర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్ను 1971లో ఒక కళాపిపాసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.
మొత్తానికి వూహించని విధంగా ఎంతో కాలం దూరమయిన గొప్ప కళాఖండం తిరిగి తన వద్దకు చేరడంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే కదా.. పోయిందనుకున్న గొప్ప వస్తువు తిరిగి చేరితే ఆ ఆనందమే వేరు! అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్ను భద్రంగా చూసుకునే ఆసక్తి వున్నప్పటికీ శక్తి సామర్ధ్యాలు లేవు. అందుకనే త్వరలో ఎవరికయినా అమ్మేసీ వచ్చిన సొమ్మును పిల్లలకు పంచుదామనుకుంటోందిట! చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్నదమ్ములు అక్కచెల్లెళ్లు వున్నారు. అలాగే ఇరవై మంది పిల్లలు ఉన్నారు. అందరూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అందరం ఒకే కుటుంబం, చాలాకాలం తర్వాత ఇల్లు చేరిన కళాఖండం మా కుటుంబానిది అన్నది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు.
చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్ విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది.
ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.
అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి 15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్ పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు.
అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది.
మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.
అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు ఒకే సారి ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.
రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్లకు మద్దతుగా ఉత్తమ్, భట్టి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్.రాంచందర్రావు, ప్రేమేందర్రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.
ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు. వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి. ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే..
అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు.
అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు..
రాజ్యాంగ నిర్మాత..
భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత రాజ్యాంగమే.. ఈ బారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు.
విద్యావంతుడు..
అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు. అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి అయ్యారు.
సామాజిక సంస్కర్త..
ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు.
భారతరత్న..
1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు.
సత్యాగ్రహి..
నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే.
న్యాయ శాఖ మంత్రి..
అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.
*రూపశ్రీ.
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర. ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుని పాటల పల్లకిలో కోయిలలా ప్రయాణిస్తూ వచ్చింది. కానీ సంగీత ప్రపంచాన్ని విషాదం కమ్మేసింది. ఆమె గాత్రానికి ఇక మౌనంగా ఉండిపోమని విధి శాసించిందేమో.. ఆమె పూర్తీగా తన శ్వాసనే వదిలేసింది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మరణం ఇప్పుడు భారతదేశాన్ని, ప్రపంచాన్ని కూడా విషాదంలోకి నెట్టివేసింది. వైవాహిక జీవితంలో విషాదం నుండి, కూతురిని కోల్పోవడం.. ఆమె జీవితంలో ఎన్నెన్నో విషాదాలు కూడా ఉన్నాయి, ఆమె సాధించిన ఘనతలు ఉన్నాయి. ఆశా భోస్లే గురించి చాలా మందికి తెలియని విషయాల గురించి తెలుసుకుంటే..
ఆశాభోస్లే ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు.. శనివారం ఆమె గుండెపోటుకు గురవడంతో ఆసుపత్రిలో చేరిందని సమాచారం. ఆయాసం ఎక్కువ కావడం, ఛాతీ ఇన్పెక్షన్ కారణంగా ఆమె మరణించిందని సోషల్ మీడియా వార్తల సారాంశం.
బాలీవుడ్లో పెద్ద బ్రేక్ రాకముందు, ఆశా భోస్లే తన 10 ఏళ్ల చిన్న వయసులోనే సినిమాల కోసం మరాఠీ పాటలు పాడుతూ తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారట. గాయనిగా ఆమె ప్రయాణం అక్షరాలా 80 ఏళ్లకు పైమాటే..
ఆశా బోస్లే ను ముద్దుగా ఆశా తాయ్ అని పిలుచుకుంటారు. ఆమె రష్యన్, మలయ్ బాషలతో సహా 20 కి పైగా భాషలలో 12వేలకు పైగా పాటలు పాడారు. ఇలా ఇన్ని పాటలు పాడిన నేపథ్య గాయనిగా, అత్యధిక స్టూడియో ట్రాక్ లను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ వర్డ్ రికార్డ్ లో కూడా ఆమె స్థానం సంపాదించారు.
16 ఏళ్ల వయసులో ఆశా బోస్లే 1949లో తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా తనకంటే రెట్టింపు వయసున్న 31ఏళ్ల గణప్రతాప్ భోస్లే తో పారిపోయి వివాహం చేసుకున్నారు. వీరికి హేమంత్, వర్ష, ఆనంద్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆశా, గణ ప్రతాప్ 1960లో విడిపోయారు.
1980లో ఆశా బోస్లే తనకంటే ఆరు సంవత్సరాల చిన్న వాడైన ప్రఖ్యాత సంగీత స్వరకర్త ఆర్.డి బర్మన్ ను వివాహం చేసుకున్నారు. ఆయనను ముద్దుగా పంచమ్ దా అని పిలిచేవారు. వీరిద్దరూ కలిసి దమ్ మారో దమ్.. పియా తు అబ్ తో ఆజా వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ హిట్ లను అందించారు.
కొన్ని వార్తా సమాచారాల ప్రకారం ఆశా కూతురు వర్ష డిప్రెషన్ తో బాధపడుతూ 56 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆమె చిన్న కుమారుడు హెమంత్ 2015లో క్యాన్సర్ తో మరణించాడు.
ఆశా ఒక విజయవంతమైన వ్యాపారవేత్త కూడా, ఆమె పలు దేశాలలో “ఆశాస్” అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను నడుపుతున్నారు.
గానంపై ఉన్న అభిరుచితో పాటు, ఆశా భోస్లే తన వంట నైపుణ్యాలకు కూడా ప్రసిద్ధి చెందారు. ఆమె దుబాయ్, కువైట్, అబుదాబి, దోహా , బహ్రెయిన్ వంటి నగరాల్లో 'ఆశాస్' అనే పేరుతో రెస్టారెంట్ల చైన్ ను నడుపుతున్నారు.
ఆశా గారెకి శాస్త్రీయ సంగీతంలో చాలా లోతైన పరిజ్ఞానం ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్తో కలిసి 'లెగసీ' అనే ఆల్బమ్లో పనిచేసినందుకు ఆమె గ్రామీ నామినేషన్ గెలుచుకుంది.
పాప్ , ఫ్యూజన్ ప్రధాన స్రవంతిగా మారడానికి చాలా కాలం ముందే, వాటితో ప్రయోగాలు చేసిన తొలి భారతీయ గాయకులలో ఆమె ఒకరు.
ఆశా భోస్లే కూడా నటనారంగంలోకి అడుగుపెట్టి, 2013లో 'మై' అనే మరాఠీ చిత్రంలో తల్లి పాత్రతో రంగప్రవేశం చేశారు.
తన విశిష్టమైన కెరీర్లో ఆశా భోస్లే అనేక గౌరవాలను అందుకున్నారు. 2000లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేయగా, 2008లో పద్మవిభూషణ్ను ప్రదానం చేసింది.
ఆమె జీవితం క్రమశిక్షణ, సాహసోపేతమైన నిర్ణయాలు,
నిరంతరం కొత్త ఆవిష్కరణలు చేయడం వంటి వాటితో ఆమె జీవితం నిండి ఉంది.
*రూపశ్రీ.
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా, సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు, నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు.. ఇలా జీవితం ఎంత సాఫీగా గడుస్తోంది అనుకున్నా.. మనిషి లోపల మాత్రం మనసు తృప్తిగా, సంతోషంగా అనుభూతి చెందడం లేదు. చాలామందిలో ఈ గందరగోళం కనిపిస్తూ ఉంటుంది. ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటారు. అయితే దీనికి రివర్స్ గా.. సంతోషంగా ఉండే వ్యక్తులు మాత్రం జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా సులువుగా అధిగమించగలరు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కోగలరు, వీరికి జీవితం అసలు కష్టంగా అనిపించదు. కానీ సంతోషంగా ఉండటం ఎలా.. మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండటం కేవలం నాలుగు అలవాట్ల వల్ల సాధ్యం అవుతుందని అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. ఆ నాలుగు అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే..
జాగ్రత్తగా వినడం..
కొంతమంది తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు, ఇతరులు చెప్పేది వినడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. ఇతరులు చెప్పేది శ్రద్దగా వినగలిగే వ్యక్తులు జీవితంలో ఎన్నో సమస్యలను క్లిష్టతరం కాకుండా, అసలు సమస్యలుగా మారకుండా ముందుగానే వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. తద్వారా జీవితాన్ని డిస్టర్బ్ చేసేంత సమస్యలు ఏవీ వారికి ఉండవు.
పాజిటివ్ మైండ్ సెట్..
సానుకూల భావాలు అంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ తమ జీవితాలతో సంతోషంగా ఉంటారు, వారికి దొరికే ఏ కొద్ది సమయాన్ని అయినా సంతోషంగా గడపడానికి, ఆ సమయాన్ని మధురమైన జ్ఞాపకాలుగా మార్చుకోవడానికి, పదిలపరుచుకోవడానికి ఇష్టపడతారు. ఈ విషయాలు క్రమంగా వారిని సంతోషంగా ఉంచుతాయి.
ఒత్తిడికి దూరంగా ఉండటం..
సంతోషంగా ఉండే వ్యక్తులకు ఒత్తిడి లేకుండా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది. ఈ అలవాటు సంతోషంగా ఉంచడానికి సహాయపడుతుంది. నిద్రపోయేటప్పుడల్లా అస్సలు ఏ చింతా లేకుండా, ఏ సమస్య గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోయేందుకు ప్రయత్నం చేయాలి. ఇది ఒత్తిడిని దూరంగా ఉంచుతుంది.
తమ మీద తాము జాలి పడటం..
ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వ్యక్తులు తమ మీద తాము జాలి పడటం అస్సలు పాటించరు. వారు ఏదో ఒకటి నేర్చుకుని, తప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ తప్పులను తాము దాచిపెట్టడం లేదా తమ అసమర్థతను ఒప్పుకోకుండా ఇతరులతో గొడవ పడటం లాంటివి చేయరు.
పైన చెప్పుకున్న లక్షణాలు ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. ఆ లక్షణాలు వ్యక్తులను సంతోషంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి, సహాయపడతాయి కూడా.
*రూపశ్రీ
తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తృణమూల్ కాంగ్రెస్ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని విరుచుకుపడ్డారు. మమతా బెనర్జీ వారి పట్ల సవతితల్లి ప్రేమను చూపుతోందన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించి, వారిని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారన్నారు.
ముర్షీదాబాద్ జిల్లాలో సోమవారం (ఏప్రిల్ 13) నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
రాష్ట్రంలోని హల్దియా, ఖరగ్పుర్ వంటి ప్రాంతాల అభివృద్ధిని ప్రస్తావించిన అసదుద్దీన్ ఒవైసీ.. ముర్షీదాబాద్ వంటి జిల్లాలో కనీసం ఒక్కటంటే.. ఒక్క ప్రత్యేక ఆర్థిక మండలి కూడా కూడా ఎందుకు ఏర్పాటు కాలేదని విమర్శించారు.
బిజెపి బూచి చూపి.. ముస్లింలలో భయాందోళనలు సృష్టించి ఎన్నికలలో లబ్ధి పొందాలని తృణమూల్ ప్రయత్నిస్తోందన్నారు. రఘునాథ్ గంజ్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముర్షీదాబాద్ రూపురేఖలు మారుస్తామని ఆయన ఓటర్లకు హామీ ఇచ్చారు. జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం ఎంఐఎం పోరాడుతుందన్న ఆయన, ముర్షీదాబాద్లో పారిశ్రామికాభివృద్ధి కోసం ఎంఐఎం అభ్యర్థిని గెలిపిం చాలని కోరారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మైనారిటీల ఓట్లు కీలకం కావడంతో అసదుద్దీన్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానంగా ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న ముర్షీదాబాద్ జిల్లాలో అసదుద్దీన్ వ్యాఖ్యలు ఎన్నికలలో ఏ మూరకు ప్రభావితం చేస్తాయన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసదుద్దీన్ వ్యాఖ్యలు బీజేపీకి మేలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాల గొంతును బలంగా వినిపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం (ఏప్రిల్ 15) దేశ రాజధాని ఢిల్లీ వెడుతున్నారు. ఈ పర్యటన దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణ కోసం హస్తిన వేదికగా గళమెత్తడినికే అని అంటున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జనాభాకు 50 శాతం, జీఎస్డీపీకి 50 శాతం ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గాల పునర్విభజన జరగాలని బలంగా డిమాండ్ చేస్తున్న రేవంత్ రెడ్డి ఈ విషయంపైనే ఇండియా కూటమి నేతలతో చర్చించనున్నారు. వీలైతే నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అంశంపై కూడా ఈ పర్యటనలో ఇండియా కూటమి నేతలతో రేవంత్ చర్చిస్తారు. ఇక పనిలో పనిగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధుల గురించి కూడా చర్చించే అవకాశా లున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు రోజుల ముందు ఈడీ ఐప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ ను అరెస్టు చేసింది. ఇటీవల ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ దాడులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణం కేసు విచారణలో భాగంగా ఈడీ దూకుడు వెనుక రాజకీయం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదలా ఉంటే.. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ వినేష్ చందేల్ ను ఈడీ అధికారులు ఢిల్లీలో సోమవారం (ఏప్రిల్ 13) రాత్రి అరెస్టు చేశారు. ఆ తరువాత ఆయనను హస్తినలోని పీఎంఎల్ఏ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనను పది రోజులు ఈడీ కస్టడీకి ఆదేశించింది. బొగ్గు అక్రమ రవాణా ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల నిధులను హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ రిజిస్టర్డ్ కంపెనీకి మళ్లించారన్నది వినేష్ చందేల్పై ఉన్న అభియోగం. కాగా ప వినేష్ చందేల్ అరెస్టును తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వినేల్ చందేల్ ను ఈడీ అరెస్టు చేసిందని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.
మన శరీరంలో మెదడు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన అవయవం కాలేయం (Liver). జీర్ణక్రియను మెరుగుపరచడం నుంచి, రక్తాన్ని శుద్ధి చేయడం వరకు కాలేయం సుమారు 500 పైగా పనులను నిర్వహిస్తుంది. అయితే, ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్, ఆల్కహాల్, అధిక ఒత్తిడి మరియు సరైన వ్యాయామం లేకపోవడం వల్ల లివర్ తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది.
చాలా సందర్భాల్లో లివర్ 70% నుండి 80% వరకు దెబ్బతినే వరకు మనకు ఎటువంటి బయటి లక్షణాలు కనిపించవు. అందుకే దీన్ని 'సైలెంట్ కిల్లర్' అని కూడా అంటారు. అయితే, మన శరీరం ఇచ్చే కొన్ని ముందస్తు హెచ్చరికలను గమనిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
ఈ ప్రత్యేక వీడియోలో, ప్రముఖ నాడిపతి (Nadipathy) నిపుణులు డాక్టర్ పెన్మెత్స కృష్ణమ్ రాజు (Dr. P Krishnam Raju) గారు లివర్ ఆరోగ్యం గురించి, అది దెబ్బతిన్నప్పుడు శరీరం చూపే లక్షణాల గురించి లోతుగా వివరించారు. ఈ Video లింక్ను క్లిక్ చేసి తెలుసుకుందాం.
ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధానాంశాలు:
అలసట మరియు నీరసం:- ఎటువంటి పని చేయకపోయినా విపరీతమైన నీరసంగా అనిపించడం లివర్ సమస్యకు ప్రాథమిక సంకేతమా?
చర్మం మరియు కళ్ళ రంగు:- కళ్లు పసుపు రంగులోకి మారడం (Jaundice) మరియు చర్మంపై దురదలు రావడం వెనుక ఉన్న అసలు కారణాలు.
ఆకలి మందగించడం:- ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, వాంతులు వచ్చేలా ఉండటం దేనికి సంకేతం?
పొత్తికడుపులో మార్పులు:- కడుపు ఉబ్బరంగా ఉండటం లేదా కుడి వైపున నొప్పి రావడం ఎందుకు జరుగుతుంది?
నాడిపతి చికిత్స:- మందులు లేకుండా కేవలం నాడి నిదానం మరియు ప్రకృతి సిద్ధమైన పద్ధతులతో లివర్ సమస్యలను ఎలా నయం చేసుకోవచ్చు?
మీరు లేదా మీ కుటుంబ సభ్యులు తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియో తప్పక చూడండి. కాలేయాన్ని సహజ పద్ధతుల్లో ఎలా శుద్ధి చేసుకోవాలో డాక్టర్ గారి సూచనలను పాటించండి.
మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా TeluguOne Health Youtube Channel సందర్శించండి! మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో కొంతకాలంగా యువతలో గుండెపోటులు సంభవిస్తున్నాయి. గుండెను బలోపేతం చేయడానికి ఆహారంలో నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవడం ఎంతో ఉత్తమం అని ఆహార నిపుణులు అంటున్నారు. నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు గుండెను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అసలు గుండె బలంగా ఉండటానికి నైట్రేట్ ఎందుకు అవసరం? నైట్రేట్ ఆ కూరగాయలలో అధికంగా ఉంటుంది? ఆహార నిపుణులు ఏం చెబుతున్నారు? పూర్తీగా తెలుసుకుంటే..
ఆరోగ్యకరమైన గుండెకు నైట్రేట్ ఎందుకు ముఖ్యం?
శరీరంలో నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్గా మార్చబడుతుంది. నైట్రేట్ ఆక్సైడ్ రక్తనాళాలను విస్తరింపజేస్తుంది, ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య..
కొన్ని సంవత్సరాల క్రితం అధిక రక్తపోటును వృద్ధాప్య వ్యాధిగా పరిగణించేవారు. ఆ తరువాత 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు గలవారిలో అధిక రక్తపోటు కనిపించేది. ఇప్పుడు 20 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు కూడా అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. అధిక రక్తపోటును సకాలంలో కంట్రోల్ చేయలేకపోతే అది గుండె జబ్బులు, పక్షవాతం , మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అంటే ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉండటం.
నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు..
పాలకూర..
పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి. పాలకూరను తినడం వల్ల రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది , గుండె కండరాలను బలపరుస్తుంది.
బీట్రూట్ ..
బీట్రూట్ రసంలో నైట్రేట్లు ఉంటాయి. బీట్రూట్ రసం తాగడం వల్ల ఓపిక పెరిగి, గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఆకుకూర సలాడ్లు..
ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లలో నైట్రేట్లు ఉంటాయి. ఆహారంలో సలాడ్లను చేర్చుకోవచ్చు. ఆహారంలో ఆకుపచ్చ ఆకు కూరల సలాడ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరం.
మెంతులు..
మెంతిలో పీచుపదార్థం, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో నైట్రేట్లు కూడా ఉంటాయి, ఇవి గుండె జబ్బులను నివారించడంలో , చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
కాలీఫ్లవర్..
క్యాబేజీలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మాత్రమే కాకుండా ధమనులలో కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడే నైట్రేట్లు ఉంటాయి.
*రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు. ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు. కొబ్బరి నీరు, మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే..
కొబ్బరి నీరు..
కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది. తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది. అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది.
మజ్జిగ..
మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ , ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే శరీరం చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
తేడా..
కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి.
ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?
డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది.
భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు.
మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి, వేర్వేరుగా ఉపయోగపడతాయి.
*రూపశ్రీ.
