LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సినిమా పరిభాషను వాడుతూ రేవంత్ రెడ్డి పాలనను అత్యంత ఘాటుగా విమర్శించారు.  సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే అది హిట్టా లేదా ఫట్టా అని ప్రేక్షకులు ఎలా అంచనా వేస్తారో, అదే విధంగా తెలంగాణ ప్రజలు కేవలం కొన్ని నెలల కాంగ్రెస్ పాలనను చూసి ఒక స్పష్టమైన తీర్పుకు వచ్చేసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటర్వెల్ పడిపోయిందని, వారి పాలనలో మొదటి సగం అంటే 'ఫస్ట్ హాఫ్' పూర్తిగా డిజాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, నిరాశతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. కొత్తగా ఇళ్ళు కట్టడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని మండిపడ్డారు.  పేదలకు అందించాల్సిన వివిధ సంక్షేమ పథకాల ఆర్థిక సహాయాల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలను పెంచుకుంటూ పోతోందని, లబ్ధిదారులకు పైసలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను రాజకీయంగా పక్కన పెట్టాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలు చేసిందని, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 2,00000 (రెండు లక్షల) ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతకు తప్పుడు హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. గద్దెనెక్కిన తర్వాత ఆ 2 లక్షల ఉద్యోగాల హామీని అటకెక్కించి, నిరుద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. కేవలం ప్రజలనే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులను, నమ్ముకున్న వాళ్ళను కూడా ఘోరంగా మోసం చేశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాల వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఒక సమగ్రమైన నివేదికను సమర్పించారని కేటీఆర్ వెల్లడించారు.  ఆ నివేదిక ఇచ్చిన కారణంగానే మీనాక్షి నటరాజన్‌పై తీవ్ర కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి, ఆమెపై దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టించి వేధించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమెకు దక్కాల్సిన రాజ్యసభ అవకాశాలను కూడా రేవంత్ రెడ్డి రాజకీయంగా అడ్డుకుని తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలు, పేరు మార్పిడి సంస్కృతిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు.  గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఆకలి తీర్చడం కోసం కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించే అద్భుతమైన పథకాన్ని ప్రారంభించి, దానికి 'అన్నపూర్ణ' అని దైవచింతనతో కూడిన పేరు పెట్టారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పేరులో ఉన్న అమ్మవారి పేరును తొలగించి, దానికి 'ఇందిరమ్మ' భోజన పథకంగా మార్చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి కలిగిన కాంగ్రెస్ నాయకులకు అవకాశం దొరికితే జూబ్లీహిల్స్‌లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి పేరును కూడా మార్చేయడానికి వెనుకాడరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా విశ్రమించకుండా, ప్రతి ఒక్కరూ తమ సొంత డివిజన్‌ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో అంకితభావంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.  నాయకులు పక్క డివిజన్ల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి, తమ పరిధిలోని ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో, పట్టుదలతో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం, బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఈ తుఫాను రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, శరవేగంగా అరెస్టుల పర్వం వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.   ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే  విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  విశ్లేషించారు. సాధారణంగా లోకల్ పోలీసులు లేదా సిట్ చేసే విచారణకు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేసే పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కేసుపై సుమారు నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేసి, 33 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ ముగిసిందని సిట్ ప్రకటించినప్పటికీ..  అక్కడితో కథ ఆగిలేదు. ఆ నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కొత్తగా ఈసీఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ఒకరిని అరెస్ట్ చేసిందంటేనే 80 శాతం కేసు నిర్ధారణ అయినట్లేనని రామకృష్ణ అన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తుందని వివరించారు. ఈ కుంభకోణం తాలూకు ఆర్థిక మూలాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్య ఒక మద్యం కార్టన్ రవాణా చేయడానికి కాంట్రాక్ట్ ధర 13 రూపాయలుగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే..  మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. కేవలం రవాణా చార్జీలనే ఏకపక్షంగా 13 రూపాయల నుండి  32 రూపాయలకు పెంచేశారు. అంటే ప్రతి కార్టన్‌పై 21 రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ రవాణా గోల్‌మాల్ వల్లే ప్రభుత్వ ఖజానాకు సుమారు 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ, సిట్ ప్రాథమికంగా లెక్క తేల్చాయి. అయితే ఇది కేవలం  పిల్ల స్కామ్  మాత్రమేనని, అసలు  పెద్ద స్కామ్ అయిన మొత్తం మద్యం కుంభకోణం విలువ సుమారు 3500 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అంటున్నారు.  బలంగా ఆరోపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్‌లో కేవలం ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  సిట్ దాఖలు చేసిన రెండవ చార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఐదు నుండి ఏడు సార్లు   ప్రస్తావించారు. అక్రమంగా ఆర్జించిన ఈ 3500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో దాదాపు 70 శాతం మేర తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని, ఆయనే దీనికి అంతిమ లబ్దిదారు,  అంతిమ దోపిడీదారు అని కేసులోని కొందరు ముద్దాయిలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు కూడా ఈ 33 మంది జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌తో పాటు దాదాపు 15 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముద్దాయిలుగా ఉన్న కొందరు అధికారులు అప్రూవర్లుగా మారి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను ప్రస్తావిస్తూ..   మాజీ జడ్జి రామకృష్ణ   నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2029లో కాకుండా, ముందస్తు వ్యూహంలో భాగంగా 2028 చివరిలోనే, అంటే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే కాదు, ఈ మద్యం కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి  జైలుకు వెళ్లడం ఖాయమని, వైఎస్ జగన్ జైల్లో ఉండగానే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రామకృష్ణ విశ్లేషించారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి  వర్కవుట్ కాదని, ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న ఆయన,  ఒకవేళ ఈడీ అరెస్టులు గనుక జగన్ వరకు వెళ్తే, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా  నాయకుడు మిగలడని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని  అభిప్రాయపడ్డారు.    
తెలుగువన్ ప్రత్యేకం హైదరాబాద్ మహానగర శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట ప్రాంతంలో వెలుగుచూసిన వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  మాజీ ప్రజాప్రతినిధి  వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు,  అతని సోదరుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఈ భారీ దందా అసలు రంగు బయటపడింది. గండిపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు తొమ్మిదిన్నర ఎకరాల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే బలమైన ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో  వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.   సెక్రటేరియట్ ఉద్యోగిగా చలామణి అయిన ఒక మధ్యవర్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భరద్వాజ చెప్పారు. ప్రభుత్వ భూమిని క్లీన్ డాక్యుమెంట్లతో మీ చేతికి అందిస్తానని సదరు మధ్యవర్తి నమ్మించడంతో, అతనికి నేరుగా నాలుగు కోట్లు చేతులు మారాయని పోలీసులు చెబుతున్నారనీ, మరో వైపు . తాము మోసపోయామని సదరు మాజీ ప్రజాప్రతినిధి వాదిస్తున్నారనీ భరద్వాజ అన్నారు. , అసలు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమ మార్గాల్లో రెగ్యులరైజేషన్ కోసం కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, మేమే ఇక్కడి భూములకు రక్షకులమని చెప్పుకునే కొందరు తెలంగాణ వాదులు పూర్తిగా మౌనం వహించడం విశేషమన్నారు. గతంలో కోడి చెరువు లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి చిన్న చిన్న భూ వివాదాలపై తీవ్రంగా స్పందించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన నాయకులు, ఇంత పెద్ద  ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని  ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ సమయం నుండి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలుపుకొని కబ్జా చేసే సరికొత్త వ్యూహానికి తెరలేచింది. ఈ రకమైన కబ్జాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. గండిపేటతో పాటు పటాన్‌చెరు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజారిటీ ప్రైవేట్ లేఅవుట్లలో, విల్లాల్లో, ఫార్మా కంపెనీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కలిసిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' ( ద్వారా మరియు ధరణి రికార్డుల దర్యాప్తు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తోంది. తెలంగాణ నిజమైన ధనిక రాష్ట్రంగా ఎదగాలంటే, ఇప్పటికైనా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, గత ముప్పై ఏళ్లుగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల చిట్టాను పూర్తిగా బహిర్గతం చేయాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిన ఈ వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి మరియు ప్రజా సంక్షేమానికి ఉపయోగించినప్పుడే ఈ భూ దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యస్ చానెల్ లో వీక్షించండి  
ALSO ON TELUGUONE N E W S
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రిడ్లీ స్కాట్ మార్క్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్, చారిత్రాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించడంలో ఆయన శైలే వేరు. రిడ్లీ స్కాట్ కెరీర్‌లోనే అత్యంత సహజమైన, రా అండ్ రస్టిక్ వార్ ఎపిక్‌గా నిలిచిన ‘బ్లాక్ హాక్ డౌన్’ సినిమా ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. రెండు దశాబ్దాల క్రితం విడుదలై క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రం సరికొత్త వీక్షకులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇచ్చింది. మార్క్ బౌడన్ రాసిన ప్రముఖ నాన్-ఫిక్షన్ నవల ఆధారంగా 144 నిమిషాల నిడివితో ఈ యాక్షన్ ఎపిక్ రూపుదిద్దుకుంది. 1993 కాలంలో సోమాలియాలోని మొగదిషు నేపథ్యంలో అమెరికా మిలిటరీ చేపట్టిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా కథాంశం నడుస్తుంది. గ్లాడియేటర్, బ్లేడ్ రన్నర్ వంటి ఫిక్షనల్ సినిమాల మాయా ప్రపంచాన్ని పక్కన పెట్టి, రిడ్లీ స్కాట్ ఈ చిత్రంలో యుద్ధభూమిలోని భయానక వాతావరణాన్ని అత్యంత సహజంగా కళ్లకు కట్టారు. పొగ, తుపాకీ గుళ్లు, హెలికాప్టర్ల శబ్దాల మధ్య సాగే ప్రతి సీన్ ప్రేక్షకులను ఆద్యంతం ఉత్కంఠకు గురిచేస్తుంది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్స్ అయిన జోష్ హార్ట్‌నెట్, ఇవాన్ మెక్‌గ్రెగర్, ఎరిక్ బానా, టామ్ సైజ్‌మోర్, విలియం ఫిచ్ట్‌నర్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరితో పాటు ఇప్పటి గ్లోబల్ స్టార్స్ ఒర్లాందో బ్లూమ్, టామ్ హార్డీ కూడా కెరీర్ ప్రారంభంలో ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడం విశేషం. అప్పట్లో దాదాపు 92 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 173 మిలియన్ డాలర్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. నాలుగు ఆస్కార్ నామినేషన్లను దక్కించుకున్న ఈ చిత్రం బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ సౌండ్ విభాగాలలో రెండు ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రస్తుత డిజిటల్ స్ట్రీమింగ్ విండోలో భాగంగా ఈ చిత్రం విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా పీకాక్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా వీక్షకులు ఈ సినిమాను చూడొచ్చు. వీటితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ స్టోర్, ఫండంగో ఎట్ హోమ్, స్పెక్ట్రమ్ ఆన్ డిమాండ్‌తో పాటు డిజిటల్ లైబ్రరీలైన కానోపీ, హూప్లాలలో కూడా ఈ క్లాసిక్ వార్ డ్రామా అందుబాటులో ఉంది. పాతికేళ్ల నాటి ఈ సినిమా ఇప్పుడు సడన్‌గా ఎందుకు ట్రెండ్ అవుతోందనే విషయానికి వస్తే ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. దర్శకుడు రిడ్లీ స్కాట్ తెరకెక్కిస్తున్న తదుపరి భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘ది డాగ్ స్టార్స్‌’  ఈ ఏడాది ఆగస్టు 28న థియేటర్లలోకి రానుంది. జాకబ్ ఎలోర్డి, జోష్ బ్రోలిన్, మార్గరెట్ క్వాలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో నెటిజన్లు రిడ్లీ పాత మాస్టర్‌పీస్ చిత్రాలను వెతకడం మొదలుపెట్టారు. దాంతో ‘బ్లాక్ హాక్ డౌన్’ ఓటీటీలో సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతోంది. యుద్ధ చిత్రాలను ఇష్టపడే సినిమా లవర్స్‌కు ఈ డిజిటల్ రీ-ఎంట్రీ ఒక పండగ లాంటి వార్త అనే చెప్పాలి.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ప్లాన్ చేసిన 'ఓజీ టూర్ ఇండియా' లైవ్ కన్సర్ట్‌కు ఊహించని ఆటంకం ఎదురైంది. హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఈ భారీ మ్యూజికల్ నైట్ చివరి నిమిషంలో వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. నగరంలోని బౌల్డర్ హిల్స్ వేదికగా శనివారం సాయంత్రం ఎంతో వైభవంగా ప్రారంభం కావాల్సిన ఈ ఈవెంట్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. మధ్యాహ్నం నుంచి కురిసిన కుండపోత వర్షం, ఈదురుగాలుల కారణంగా కన్సర్ట్ ప్రాంగణం పూర్తిగా జలమయమైంది. ప్రేక్షకుల రక్షణను దృష్టిలో ఉంచుకుని, అలాగే కొన్ని కీలకమైన సంగీత పరికరాలు తడిసిపోవడంతో వేడుకను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. ఈ అన్-ఎక్స్‌పెక్టెడ్ షాక్‌తో సంగీత దర్శకుడు థమన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఈ వార్త తన హృదయాన్ని ముక్కలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 45 రోజులుగా తన టీమ్‌లోని 56 మంది సభ్యులు రాత్రింబగళ్లు కష్టపడ్డారని, కానీ ప్రకృతి మన చేతుల్లో ఉండదని పేర్కొన్నారు. భగవంతుడిపై తనకు నమ్మకం ఉందని, అభిమానుల ప్రేమాభిమానాలతో మరింత పవర్‌ఫుల్‌గా తిరిగి వస్తానని థమన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నిజానికి ఈ 'ఓజీ' మ్యూజికల్ కాన్సెప్ట్ వాయిదా పడటం ఇది రెండోసారి. తొలుత జూన్ 6వ తేదీనే ఈ ఈవెంట్ జరగాల్సి ఉన్నప్పటికీ, అప్పుడు కూడా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు మరోసారి వర్షం వల్ల షో క్యాన్సిల్ కావడంతో సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ అటు థమన్ టీమ్‌కు మద్దతుగా నిలుస్తూనే, తమ బ్యాడ్ లక్‌పై కామెంట్లు పెడుతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ (NBK112) ప్రారంభోత్సవానికి చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. దీంతో ఇటు నందమూరి అభిమానుల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఈ ప్రతిష్ఠాత్మక సినిమా పూజా కార్యక్రమాలను జూన్ 25న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. సాధారణంగా సినిమాల ఓపెనింగ్స్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ స్టూడియోల్లో జరుగుతుంటాయి. కానీ, ఈ చిత్ర బృందం సరికొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేదికగా ఎంచుకుంది. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో నూతనంగా వెలిసిన టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ ముహూర్తపు వేడుక జరగనుంది. ఈ గ్రాండ్ మూవీ లాంచ్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. బాలకృష్ణ సరికొత్త చిత్ర ముహూర్తపు షాట్‌కు సీఎం చంద్రబాబు క్లాప్ కొట్టనుండగా, మంత్రి లోకేష్ డైరెక్టర్ కొరటాల శివకు స్క్రిప్ట్‌ను అందజేస్తారని సమాచారం. నారా, నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక ఒక పండగలా సాగనుంది. సామాజిక అంశాలను కమర్షియల్ ఫార్మాట్‌లో అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించే కొరటాల శివ, బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ సోషల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు కొరటాల మార్క్ మేకింగ్‌తో తోడైతే థియేటర్లలో పూనకాలే అని ఫ్యాన్స్ ఫిక్సయిపోతున్నారు. మరోవైపు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరనేది, అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన పూర్తి వివరాలను జూన్ 25న జరిగే పూజా కార్యక్రమాల రోజే అధికారికంగా ప్రకటించనున్నారు. రాజధాని వేదికగా ఈ సినిమా లాంచ్ అవుతుండటంతో సోషల్ మీడియాలో సైతం ఇప్పుడే భారీ ఎత్తున ట్రెండింగ్ మొదలైంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 4న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో స్టార్ట్ అయినప్పటికీ, మెగా పవర్ స్టార్ మాస్ రాంపేజ్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే సాధించిన కలెక్షన్ల వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించింది. చిత్ర బృందం విడుదల చేసిన అఫీషియల్ లెక్కల ప్రకారం, 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా కేవలం పది రోజుల్లోనే రూ. 378 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మొదటి రోజే ప్రీమియర్స్‌తో కలిపి రూ. 135 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ చిత్రం, మొదటి వారం స్థిరమైన కలెక్షన్లతో సాగింది. రెండో శనివారం కూడా దాదాపు రూ. 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. 2026 సంవత్సరంలో సౌత్ ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నెంబర్ వన్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్‌లో భారీ వసూళ్లను రాబడుతుండటం విశేషం. అయితే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద మరియు హిందీ బెల్ట్‌లో మాత్రం ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు కాలేదు. అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ది ప్రభంజనం కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తన ఊరమాస్ మేకోవర్ మరియు నటనతో అభిమానులను ఎంతగానో అలరించారు. రంగస్థలం తర్వాత చరణ్ నటనకు ఈ స్థాయి ప్రశంసలు దక్కడం విశేషం. ఈ చిత్రంలో అచ్చియమ్మ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా, జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో మెప్పించారు. మరోవైపు ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి. సోషల్ మీడియాలో 'పెద్ది' కలెక్షన్ల రికార్డులపై మెగా ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరే ఇతర పెద్ద సినిమాలు రేసులో లేకపోవడంతో, లాంగ్ రన్‌లో ఈ చిత్రం సులువుగా రూ. 500 కోట్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ ఆదివారం హాలిడే అడ్వాంటేజ్‌తో కలెక్షన్స్ మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ భారీ సక్సెస్ జోష్‌తో రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెట్టనున్నారు. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ ముగిసిన తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. రామ్ చరణ్ ఈ సినిమా సక్సెస్‌తో బాక్సాఫీస్ కింగ్‌గా తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మెగా డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ క్లీన్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో హీరోయిన్ జాన్వీ కపూర్ క్యారెక్టర్‌పై కొంత చర్చ నడుస్తోంది. ఆమె పోషించిన అచ్చియ‌మ్మ‌ పాత్ర నిడివి తక్కువగా ఉందంటూ వస్తున్న కామెంట్స్‌పై తాజాగా చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సంచలన క్లారిటీ ఇచ్చారు. సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో బుచ్చిబాబు ఈ విషయంపై ప్రత్యేకంగా స్పందించారు. కథ ప్రకారం జాన్వీ కపూర్ పాత్ర చాలా రఫ్‌గా, రెబలిష్‌గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఎడిటింగ్ టేబుల్ దగ్గర రన్‌టైమ్ ఇష్యూస్ కారణంగా ఆమెకు సంబంధించిన రెండు మూడు కీలకమైన ఎమోషనల్ సీన్లను కట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ సీన్స్ మిస్ అవ్వడం వల్లే ఆడియన్స్‌కు ఆమె పాత్ర ఎక్కడో అసంపూర్తిగా అనిపించిందని, ఈ విషయాన్ని తాము గమనించామని ఆయన ఒప్పుకున్నారు. గతంలో ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మ క్యారెక్టర్‌కు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చానో, ఈ చిత్రంలో అచ్చియ‌మ్మ‌ పాత్రను కూడా అంతే ఎమోషనల్‌గా డిజైన్ చేశానని బుచ్చిబాబు వివరించారు. తన ప్రేమికుడు బతికున్నాడో లేదో తెలియకపోయినా మెడలో తాళి కట్టుకునే అంతటి గాఢమైన ప్రేమ అచ్చెమ్మదని, ఆ సీన్స్ ఎడిటింగ్‌లో పోవడంతో క్యారెక్టర్‌ ఎలివేషన్ తగ్గిందన్నారు. అందుకే మెగా అభిమానుల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్తూ.. కట్ చేసిన ఆ జాన్వీ కపూర్ డిలీటెడ్ సీన్లను బుధవారం నుండి థియేటర్లలో తిరిగి యాడ్ చేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. ఈ అప్‌డేట్‌తో బుధవారం నుండి ‘పెద్ది’ థియేటర్లలో సరికొత్త జోష్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ సీన్స్ యాడ్ అయ్యాక థియేటర్ కౌంట్ మరియు రిపీట్ ఆడియన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్టులపై కూడా బుచ్చిబాబు ఈ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఉప్పెన’, ‘పెద్ది’ చిత్రాల్లో సమాజానికి మంచి సందేశాలు ఇచ్చానని, అయితే తన నెక్స్ట్ మూవీలో ఎలాంటి మెసేజ్‌లు ఉండవని తేల్చి చెప్పారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తన తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
  పిల్లలను పెంచడం అంటే కేవలం వారికి మంచి విద్య,  ఆహారం,  కనీస అవసరాలు  అందించడం కాదు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను కూడా నేర్పించాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తరచుగా చాలామంది తల్లిదండ్రులు, ఆడపిల్లలకు కొన్ని పనులను నేర్పిస్తారు.  మగపిల్లలకు ఆ పనులతో అవసరం లేదని,  అది మగవారి బాధ్యత కాదని చెబుతారు. కానీ మారుతున్న కాలంతో పాటు ఈ ఆలోచనా విధానం వేగంగా మారుతోంది. నేటి కాలంలో అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరినీ స్వయం సమృద్ధిగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. చిన్నతనంలో నేర్చుకున్న అలవాట్లు, నైపుణ్యాలు పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు మాత్రమే నేర్పించే కొన్ని పనులు మగపిల్లలకు కూడా నేర్పిస్తే వారు మనుషులుగా ఎదగడమే కాకుండా వారి భవిష్యత్తు ఎంతో బాగుంటుంది.  ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. ఇంటి పనులలో సహాయం.. చిన్న వయస్సు నుండే పిల్లలకు ఇంటి పనులలో పాల్గొనడం నేర్పించాలి. వారి గదిని సర్దుకోవడం, గిన్నెలను వాటి స్థానంలో పెట్టడం, బట్టలు మడతపెట్టడం లేదా బల్ల సర్దడం వంటి పనులు వారిలో బాధ్యతా భావాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల ఇంటిని చూసుకోవడం అనేది అందరి ఉమ్మడి బాధ్యత అని పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వంట.. వంట చేయడం అనేది ఒక జీవన నైపుణ్యం మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవాన్ని కూడా పెంపొందిస్తుంది. .  టీ తయారు చేయడం, టిఫిన్  సిద్ధం చేయడం, సాధారణ భోజనం వండటం వంటి ప్రాథమిక వంట నైపుణ్యాలను మగపిల్లలకు కూడా నేర్పించాలి. దీనివల్ల భవిష్యత్తులో వారు ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా ఉంటారు. మహిళలను గౌరవించడం.. చిన్నతనం నుండే పిల్లలకు ఇతరుల పట్ల గౌరవం, ఇతరులతో సున్నితంగా ఉండటం వంటివి   నేర్పించాలి. స్త్రీ, పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవానికి, సమానత్వానికి అర్హులని కొడుకులకు నేర్పించడం చాలా ముఖ్యం. ఇది వారి వ్యక్తిత్వాన్ని సానుకూలంగా తీర్చిదిద్దుతుంది. ఎమోషన్స్.. అబ్బాయిలకు తరచుగా ఏడవకూడదని,  బాధపడకూడదని సలహా ఇస్తుంటారు, కానీ మానసిక ఆరోగ్యానికి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అబ్బాయిలకు తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పడం, సహాయం అడగడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం నేర్పించాలి. ఆర్థిక బాధ్యత.. చిన్న వయస్సు నుండే పిల్లలకు పొదుపు చేయడం, బడ్జెట్ వేసుకోవడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం వంటి అలవాట్లను నేర్పించడం వల్ల, వారు ఆర్థిక విషయాలపై అవగాహన పెంచుకుని, భవిష్యత్తులో మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చాలా వరకు ఆర్థికంగా పొదుపు చేసుకోవాలని,  ఎక్కువగా ఖర్చులు పెట్టకూడదని కేవలం ఆడపిల్లలకు చెబుతూ  ఉంటారు. కానీ భవిష్యత్తులో వివాహం తర్వాత ఆడపిల్లలు పొదుపు చేస్తూ.. మగవారు ఖర్చు చేస్తూ ఉంటే ఆ ఇల్లు ఆర్థికంగా ఎదగదు.  అందుకే ఆర్థిక బాధ్యత ఆడపిల్లలకు, మగపిల్లలకు ఇద్దరికీ నేర్పాలి.                                    *రూపశ్రీ.
సినిమాలు, సోషల్ మీడియా , సొసైటీ  తరచుగా వివాహాన్ని ఒక అందమైన చిత్రంగా చూపిస్తాయి. కానీ వాస్తవం అంతకంటే చాలా సంక్లిష్టమైనది. వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది రెండు కుటుంబాలు, రెండు విభిన్న మనస్తత్వాలు , జీవనశైలుల కలయిక కూడా. అటువంటి పరిస్థితిలో, ఒక బంధాన్ని బలంగా ఉంచడానికి కేవలం ప్రేమ మాత్రమే సరిపోదు. చాలాసార్లు, పెళ్లి తర్వాత ప్రజలు తాము మునుపెన్నడూ ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇప్పుడిప్పుడే  పెళ్లి చేసుకోబోతున్నా లేదా ఇటీవలే వివాహం చేసుకున్నా, కొన్ని ముఖ్యమైన నిజాలు తెలుసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ నిజాలు  సంబంధంలోని వాస్తవాలను అర్థం చేసుకోవడానికి , వైవాహిక జీవితాన్ని మెరుగ్గా నిర్వహించుకోవడానికి  సహాయపడతాయి. ఆ నిజాలు ఏంటో తెలుసుకుంటే.. సంబంధం అంటే కేవలం ప్రేమ కాదు.. వివాహంలో ప్రేమ చాలా ముఖ్యం, కానీ ఒక బంధం కేవలం ప్రేమ మీద మాత్రమే ఆధారపడి ఉంటే ఎక్కువ కాలం నిలవదు. వైవాహిక జీవితంలో నమ్మకం, అవగాహన , బాధ్యత ప్రేమలాగే ఎంతో ముఖ్యమైనవి. రోజూ తెల్లవారగానే.., ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ బాధ్యతలు, సమయరాహిత్యం వంటి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితిలో, భావోద్వేగాలే కాకుండా పనులు అమలుచేయడం,  ఎలా చేయాలని ఆలోచించడం కూడా బంధాన్ని బలంగా మారుస్తుంది. అంగీకారం.. ప్రతి వ్యక్తి ఆలోచనా విధానం, పెంపకం, అనుభవాలు భిన్నంగా ఉంటాయి, అందువల్ల పెళ్లి తర్వాత ప్రతి విషయంలోనూ భార్యాభర్తలు ఇద్దరూ ఏకాభిప్రాయం మీద ఉండటం జరగదు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు సహజం , ఏ ఆరోగ్యకరమైన సంబంధంలోనైనా అవి ఒక భాగం. కానీ అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ గౌరవాన్ని కాపాడుకుంటూ, గొడవలు పెంచుకోకుండా  కూర్చుని మాట్లాడుకుని  పరిష్కరించుకుంటే బందం బాగుంటుంది. ఆర్థిక విషయాలు.. వివాహంలో ఆదాయం, ఖర్చులు, పొదుపు , భవిష్యత్ ప్రణాళికల గురించి బహిరంగంగా చర్చించడం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి విషయంలో పారదర్శకత లేకపోతే, అపార్థాలు పెరిగి, సంబంధం దెబ్బతినవచ్చు. కలిసి ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం సంబంధాన్ని బలపరుస్తుంది. సర్దుబాటు.. వివాహం అనేది రెండు వేర్వేరు కుటుంబాలు , ఆలోచనల కలయిక, అందువల్ల ఇక్కడ సర్దుబాట్లు చేసుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు వృత్తి విషయంలో, కొన్నిసార్లు కుటుంబ బాధ్యతల విషయంలో, మరికొన్నిసార్లు వ్యక్తిగత అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుంటూ, సమతుల్యతను పాటించే జంటల బంధం మరింత బలంగా, స్థిరంగా ఉంటుంది. మార్పు.. వివాహం జరిగిన తొలిరోజుల్లోని శృంగారం శాశ్వతంగా ఉండదు, కానీ అంతమాత్రాన ప్రేమ అంతమైపోతుందని కాదు. కాలం గడిచే కొద్దీ, సంబంధంలో గాఢత, అవగాహన , బాధ్యత పెరుగుతాయి. శృంగారం ఒక స్థిరమైన, భావోద్వేగ బంధంగా రూపాంతరం చెంది, ఆ సంబంధం చాలా కాలం పాటు నిలిచేలా చేస్తుంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరి మద్య ప్రేమను, బంధాన్ని బలంగా నిలిపేది శృంగార జీవితమే.. దాన్ని కోల్పోతే ఇద్దరిని దగ్గరగా ఉంచడానికి బలమైన కారణం వేరే ఏదీ ఉండదు.                                   *రూపశ్రీ
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది.  భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ,  ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుటుంది.  అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని అంటూ ఉంటారు.  కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు,  గోల్డ్,  చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఆధారపడి ఉండదు.  చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు.  కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహీనంగా మారుస్తాయి.  మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ద చూపడం.. మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటివి చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న  స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు భావించబడుతుంది. ఇతర స్త్రీల వైపు చూసే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత  ఇవ్వనట్టు. ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం.. చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు.  ఇది బయటకు తమాషాగా,  సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు,  భాగస్వామి పుట్టినరోజు,  మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు వంటివి గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు. ఎక్కువగా ఆలోచించవద్దని చెప్పడం.. మహిళలు  ఆందోళనలను లేదా సమస్యలను తన  భర్తతో షేర్ చేసుకున్నప్పుడు,  దానికి పరిష్కారం చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలని,  ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది. భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం.. ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలను, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం,  భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది. మద్దతు ఇవ్వకపోవడం.. ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల  భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు.  భార్యను ఏదైనా మాటలు అన్నా,  భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి,  వాళ్లతో కలిసి భార్యను నిందించడం చేస్తుంటారు.  ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది.  మహిళలు చాలా భాధపడతారు. ఒంటరితనం.. ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో తమకు విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి,  తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు.  ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. ఇతరులతో పోల్చడం.. చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు.  అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు,  ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలోనూ ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు.  ప్రతి మనిషిని మనిషిగా చూడాలి,  వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.                                    *రూపశ్రీ.
  తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. తాజాగా ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సినిమా పరిభాషను వాడుతూ రేవంత్ రెడ్డి పాలనను అత్యంత ఘాటుగా విమర్శించారు.  సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే అది హిట్టా లేదా ఫట్టా అని ప్రేక్షకులు ఎలా అంచనా వేస్తారో, అదే విధంగా తెలంగాణ ప్రజలు కేవలం కొన్ని నెలల కాంగ్రెస్ పాలనను చూసి ఒక స్పష్టమైన తీర్పుకు వచ్చేసారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పటికే ఇంటర్వెల్ పడిపోయిందని, వారి పాలనలో మొదటి సగం అంటే 'ఫస్ట్ హాఫ్' పూర్తిగా డిజాస్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు హామీలను నమ్మి ఓట్లేసిన తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, నిరాశతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో ఒక్కటంటే ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. కొత్తగా ఇళ్ళు కట్టడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ హయాంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తోందని మండిపడ్డారు.  పేదలకు అందించాల్సిన వివిధ సంక్షేమ పథకాల ఆర్థిక సహాయాల విషయంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున బకాయిలను పెంచుకుంటూ పోతోందని, లబ్ధిదారులకు పైసలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌లను రాజకీయంగా పక్కన పెట్టాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ అసత్య ప్రచారాలు చేసిందని, ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 2,00000 (రెండు లక్షల) ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని నిరుద్యోగ యువతకు తప్పుడు హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. గద్దెనెక్కిన తర్వాత ఆ 2 లక్షల ఉద్యోగాల హామీని అటకెక్కించి, నిరుద్యోగులను కాంగ్రెస్ దారుణంగా వంచించిందని ధ్వజమెత్తారు. కేవలం ప్రజలనే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ నాయకులను, నమ్ముకున్న వాళ్ళను కూడా ఘోరంగా మోసం చేశారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాల వ్యవహారాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ ఒక సమగ్రమైన నివేదికను సమర్పించారని కేటీఆర్ వెల్లడించారు.  ఆ నివేదిక ఇచ్చిన కారణంగానే మీనాక్షి నటరాజన్‌పై తీవ్ర కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి, ఆమెపై దొంగ కేసులు, తప్పుడు కేసులు పెట్టించి వేధించారని ఆరోపించారు. అంతటితో ఆగకుండా ఆమెకు దక్కాల్సిన రాజ్యసభ అవకాశాలను కూడా రేవంత్ రెడ్డి రాజకీయంగా అడ్డుకుని తీవ్ర అన్యాయం చేశారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలు, పేరు మార్పిడి సంస్కృతిపై కూడా కేటీఆర్ మండిపడ్డారు.  గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదల ఆకలి తీర్చడం కోసం కేవలం 5 రూపాయలకే నాణ్యమైన భోజనాన్ని అందించే అద్భుతమైన పథకాన్ని ప్రారంభించి, దానికి 'అన్నపూర్ణ' అని దైవచింతనతో కూడిన పేరు పెట్టారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆ పేరులో ఉన్న అమ్మవారి పేరును తొలగించి, దానికి 'ఇందిరమ్మ' భోజన పథకంగా మార్చేశారని విమర్శించారు. ఇలాంటి సంస్కృతి కలిగిన కాంగ్రెస్ నాయకులకు అవకాశం దొరికితే జూబ్లీహిల్స్‌లోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి పేరును కూడా మార్చేయడానికి వెనుకాడరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చివరగా పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలోనే ఉప ఎన్నికలు వచ్చే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని కేటీఆర్ జోస్యం చెప్పారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా విశ్రమించకుండా, ప్రతి ఒక్కరూ తమ సొంత డివిజన్‌ పరిధిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహాలో అంకితభావంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.  నాయకులు పక్క డివిజన్ల రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేసి, తమ పరిధిలోని ప్రజలతో మమేకం కావాలని, కాంగ్రెస్ వైఫల్యాలను, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ శ్రేణులన్నీ అంతర్గత విభేదాలు పక్కన పెట్టి సమన్వయంతో, పట్టుదలతో పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం, బీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
తెలుగువన్ స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఈ తుఫాను రేపుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, శరవేగంగా అరెస్టుల పర్వం వైపు అడుగులు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.   ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే  విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో  విశ్లేషించారు. సాధారణంగా లోకల్ పోలీసులు లేదా సిట్ చేసే విచారణకు, కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ చేసే పరిశోధనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ఈ కేసుపై సుమారు నాలుగు చార్జ్‌షీట్లు దాఖలు చేసి, 33 మందిపై అభియోగాలు నమోదు చేసింది. విచారణ ముగిసిందని సిట్ ప్రకటించినప్పటికీ..  అక్కడితో కథ ఆగిలేదు. ఆ నివేదికల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగి కొత్తగా ఈసీఆర్ నమోదు చేసి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ఈడీ ఒకరిని అరెస్ట్ చేసిందంటేనే 80 శాతం కేసు నిర్ధారణ అయినట్లేనని రామకృష్ణ అన్నారు. మనీ లాండరింగ్ జరిగినట్లు పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు, డిజిటల్ ఎవిడెన్స్ లభిస్తేనే ఈడీ ఈ స్థాయి దూకుడు ప్రదర్శిస్తుందని వివరించారు. ఈ కుంభకోణం తాలూకు ఆర్థిక మూలాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయన్నారు. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2014 నుండి 2019 మధ్య ఒక మద్యం కార్టన్ రవాణా చేయడానికి కాంట్రాక్ట్ ధర 13 రూపాయలుగా ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే..  మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. కేవలం రవాణా చార్జీలనే ఏకపక్షంగా 13 రూపాయల నుండి  32 రూపాయలకు పెంచేశారు. అంటే ప్రతి కార్టన్‌పై 21 రూపాయల అదనపు భారాన్ని మోపారు. ఈ రవాణా గోల్‌మాల్ వల్లే ప్రభుత్వ ఖజానాకు సుమారు 400 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఈడీ, సిట్ ప్రాథమికంగా లెక్క తేల్చాయి. అయితే ఇది కేవలం  పిల్ల స్కామ్  మాత్రమేనని, అసలు  పెద్ద స్కామ్ అయిన మొత్తం మద్యం కుంభకోణం విలువ సుమారు 3500 కోట్ల రూపాయల పైచిలుకే ఉంటుందని అంటున్నారు.  బలంగా ఆరోపిస్తున్నాయి. ఈ భారీ స్కామ్‌లో కేవలం ముడుపుల రూపంలోనే వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే..  సిట్ దాఖలు చేసిన రెండవ చార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును ఐదు నుండి ఏడు సార్లు   ప్రస్తావించారు. అక్రమంగా ఆర్జించిన ఈ 3500 కోట్ల రూపాయల అవినీతి సొమ్ములో దాదాపు 70 శాతం మేర తాడేపల్లి ప్యాలెస్‌కే చేరిందని, ఆయనే దీనికి అంతిమ లబ్దిదారు,  అంతిమ దోపిడీదారు అని కేసులోని కొందరు ముద్దాయిలు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి, మిధున్ రెడ్డి వంటి కీలక నేతల పేర్లు కూడా ఈ 33 మంది జాబితాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  హైదరాబాద్‌తో పాటు దాదాపు 15 చోట్ల ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ముద్దాయిలుగా ఉన్న కొందరు అధికారులు అప్రూవర్లుగా మారి సమాచారం ఇస్తున్నట్లు సమాచారం. ఈ విషయాలను ప్రస్తావిస్తూ..   మాజీ జడ్జి రామకృష్ణ   నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు అందరూ అనుకుంటున్నట్లు 2029లో కాకుండా, ముందస్తు వ్యూహంలో భాగంగా 2028 చివరిలోనే, అంటే తెలంగాణతో పాటే ఆంధ్రప్రదేశ్‌లోనూ వచ్చే అవకాశం ఉందన్నారు. అంతే కాదు, ఈ మద్యం కుంభకోణం తీవ్రత దృష్ట్యా రాబోయే ఆరు నెలలు లేదా ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి  జైలుకు వెళ్లడం ఖాయమని, వైఎస్ జగన్ జైల్లో ఉండగానే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని రామకృష్ణ విశ్లేషించారు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో ఎలాంటి సానుభూతి  వర్కవుట్ కాదని, ఐదేళ్ల పరిపాలన చూశాక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్న ఆయన,  ఒకవేళ ఈడీ అరెస్టులు గనుక జగన్ వరకు వెళ్తే, వైసీపీ తరపున ప్రచారం చేయడానికి కూడా  నాయకుడు మిగలడని, పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని  అభిప్రాయపడ్డారు.    
తెలుగువన్ ప్రత్యేకం హైదరాబాద్ మహానగర శివార్లలోని అత్యంత ఖరీదైన గండిపేట ప్రాంతంలో వెలుగుచూసిన వెయ్యి కోట్ల రూపాయల భూ కుంభకోణం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన  మాజీ ప్రజాప్రతినిధి  వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు,  అతని సోదరుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో ఈ భారీ దందా అసలు రంగు బయటపడింది. గండిపేట పరిసర ప్రాంతాల్లో దాదాపు తొమ్మిదిన్నర ఎకరాల విలువైన భూమిని అక్రమంగా కబ్జా చేశారనే బలమైన ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో  వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.   సెక్రటేరియట్ ఉద్యోగిగా చలామణి అయిన ఒక మధ్యవర్తి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని భరద్వాజ చెప్పారు. ప్రభుత్వ భూమిని క్లీన్ డాక్యుమెంట్లతో మీ చేతికి అందిస్తానని సదరు మధ్యవర్తి నమ్మించడంతో, అతనికి నేరుగా నాలుగు కోట్లు చేతులు మారాయని పోలీసులు చెబుతున్నారనీ, మరో వైపు . తాము మోసపోయామని సదరు మాజీ ప్రజాప్రతినిధి వాదిస్తున్నారనీ భరద్వాజ అన్నారు. , అసలు ప్రభుత్వ భూమి అని తెలిసి కూడా అక్రమ మార్గాల్లో రెగ్యులరైజేషన్ కోసం కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణకు చెందిన రాజకీయ పార్టీలు, మేమే ఇక్కడి భూములకు రక్షకులమని చెప్పుకునే కొందరు తెలంగాణ వాదులు పూర్తిగా మౌనం వహించడం విశేషమన్నారు. గతంలో కోడి చెరువు లేదా ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి చిన్న చిన్న భూ వివాదాలపై తీవ్రంగా స్పందించి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన నాయకులు, ఇంత పెద్ద  ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని  ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995 తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లో భూముల ధరలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆ సమయం నుండి ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి, దానికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను కలుపుకొని కబ్జా చేసే సరికొత్త వ్యూహానికి తెరలేచింది. ఈ రకమైన కబ్జాలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. గండిపేటతో పాటు పటాన్‌చెరు మరియు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న మెజారిటీ ప్రైవేట్ లేఅవుట్లలో, విల్లాల్లో, ఫార్మా కంపెనీల పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అక్రమంగా కలిసిపోయాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 'హైడ్రా' ( ద్వారా మరియు ధరణి రికార్డుల దర్యాప్తు ద్వారా ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తోంది. తెలంగాణ నిజమైన ధనిక రాష్ట్రంగా ఎదగాలంటే, ఇప్పటికైనా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, గత ముప్పై ఏళ్లుగా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల చిట్టాను పూర్తిగా బహిర్గతం చేయాలి. కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిన ఈ వేల కోట్ల విలువైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుని, పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి మరియు ప్రజా సంక్షేమానికి ఉపయోగించినప్పుడే ఈ భూ దందాలకు శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. ఇంటర్వ్యూ పూర్తి పాఠం తెలుగువన్ న్యస్ చానెల్ లో వీక్షించండి  
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ, టీ లు పేపర్ కప్పులలో తాగుతుంటారు.  దుకాణ దారులు కూడా పేపర్ కప్పులు ఉపయోగిస్తారు.  ఎక్కడో చాలా కొద్దిమంది మాత్రమే స్టీల్ లేదా గాజు గ్లాసులు ఉపయోగిస్తారు. ఉద్యోగం నిమిత్తం బయట ఉండేవారు లేదా రోజూ అలా వాకింగ్ కు వెళ్లి వస్తూ బయట టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా గల వారు రోజూ పేపర్ కప్పులో తాగడం జరుగుతుంది.  ఎప్పుడో ఒకసారి ఇలా పేపర్ కప్పులో తాగితే పర్లేదు.. కానీ. రోజూ పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబున్నారు. పేపర్ కప్పులు ఆరోగ్యానికి కూడా మంచివని అనుకుంటారు, పైగా పర్యావరణానికి కూడా హాని కలిగించవు అనుకుంటారు. కానీ పేపర్ కప్పులను టీ, కాఫీ తాగడానికి ఉపయోగించడం గురించి చాలా షాకింగ్ నిజాలు చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.  దాని గురించి తెలుసుకుంటే.. పేపర్ కప్పులలో కాఫీ, టీ తాగడం వల్ల కలిగే నష్టాలు.. మైక్రోప్లాస్టిక్.. చాలా కాగితపు కప్పుల లోపల పాలిథిలిన్ లేదా ప్లాస్టిక్  పలుచని పొర ఉంటుంది.  దీనిలో వేడి టీ పోసినప్పుడు, మైక్రో ప్లాస్టిక్ కణాలు విడుదలై పానీయంలో కలిసిపోతాయి, ఇవి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. రసాయనాలు.. కొన్ని కాగితపు కప్పుల పూతలో ఉండే రసాయనాలు, అధిక వేడికి గురైనప్పుడు పానీయంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. పేపర్ కప్పులలో కాఫీ, టీ  ఎక్కువ కాలం పాటు తాగడం  వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చని వైద్యులు  చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత.. ప్లాస్టిక్ ఆధారిత కొన్ని రసాయనాలు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థను ప్రభావితం చేయగలవని నిపుణులు భావిస్తున్నారు. పేపర్  కప్పులను పదేపదే ఉపయోగించడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని అంటున్నారు. పర్యావరణం.. కాగితపు కప్పులు అని పిలిచినప్పటికీ, వాటిలో ఉండే ప్లాస్టిక్ పూత కారణంగా వాటిని పూర్తిగా రిసైకిల్  చేయడం కష్టమట. దీనివల్ల పర్యావరణ కాలుష్య సమస్య పెరగవచ్చట. కాఫీ, టీ  ఎలా తాగితే సురక్షితం.. టీ తాగడానికి స్టీల్, గాజు లేదా మట్టి కప్పులను వాడాలి. కాగితపు కప్పులలో వేడి పానీయాలను పదేపదే తాగడం మానుకోవాలి. కాగితపు కప్పులను ఉపయోగిస్తుంటే, క్వాలిటీ  కప్పులను మాత్రమే ఎంచుకోవాలి.  వేడి పానీయాలను కప్పులో ఎక్కువ సేపు ఉంచడం కూడా మంచిది కాదు. కాబట్టి తొందరగా తాగాలి.                                       *రూపశ్రీ.
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, డయాఫ్రమ్ కండరాలు అకస్మాత్తుగా సంకోచించడం వల్ల ఎక్కిళ్ళు వస్తాయి. చాలా వేగంగా తినడం, మసాలా పదార్థాలు, చల్లని పానీయాలు తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఎమోషన్స్ లో మార్పులు రావడం కూడా దీనికి కారణం కావచ్చు. చాలా సందర్భాలలో ఎక్కిళ్ళు తీవ్రమైన సమస్య కానప్పటికీ, అవి ఆపకుండా వస్తే రోజువారీ చాలా ఇబ్బంది పెడతారు. కొందరు వైద్యులను సంప్రదించి మందులు వాడుతూ ఉంటారు. కానీ మందులు లేకుండా  కొన్ని సులభమైన ఇంటి చిట్కాలతో ఎక్కిళ్ళను త్వరగా ఆపవచ్చు. ఎక్కిళ్ళ నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడే కొన్ని ప్రభావవంతమైన ఇంటి చిట్కాలు తెలుసుకుంటే.. చల్లనీళ్లు మెల్లగా తాగాలి.. చల్లటి నీళ్లు తాగడం అనేది ఎక్కిళ్లకు అత్యంత సాధారణమైన , ప్రభావవంతమైన ఇంటి చికిత్సలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చల్లటి నీరు గొంతు మరియు డయాఫ్రమ్‌కు అనుసంధానించబడిన నరాలను ఉత్తేజపరుస్తుంది, దీనివల్ల ఎక్కిళ్ళు ఆగుతాయి.  నీటిని ఒకేసారి తాగే బదులు, చిన్న చిన్న గుటకలతో నెమ్మదిగా తాగడం మరింత ప్రయోజనకరం. ఈ టిప్ వల్ల చాలా మందికి కొన్ని నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది. శ్వాస బిగపట్టడం.. ఎక్కిళ్ళు పదేపదే వస్తుంటే లోతుగా శ్వాస తీసుకుని 10 నుండి 20 సెకన్ల పాటు బిగపట్టడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి కొద్దిగా పెరుగుతుంది, దీని కారణంగా కంట్రోల్ కోల్పోయిన డయాఫ్రమ్   కదలిక సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ పద్ధతి ఎక్కిళ్ల సైకిల్ విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అవసరమైతే ఈ ప్రక్రియను రెండు మూడు సార్లు రిపీట్ చేయవచ్చు. తేనె.. తేనెను అనేక ఇంటి చికిత్సలలో ఉపయోగిస్తారు. ఇది చాలా మృదువుగా ఉండటం, ఇందులో  సహజ గుణాలు ఉండటం వల్ల అలసిపోయిన నరాలకు ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి. ఎక్కిళ్ళు వచ్చినప్పుడు కొంతమంది ఒక చెంచా తేనెను నెమ్మదిగా తినడం వల్ల ఉపశమనం పొందుతారు. ఇది కాకుండా, గొంతు నొప్పి , చికాకును తగ్గించడంలో కూడా తేనె సహాయపడుతుంది. చక్కెర.. ఎక్కిళ్ళు ఆపడానికి ఒక చెంచా చక్కెర తినే చిట్కా చాలా కాలం నుండే ఉంది. పంచదార స్పటికాలు గొంతు , నోటిలోని నరాలను ఉత్తేజపరిచి, ఎక్కిళ్లకు కారణమయ్యే రియాక్షన్ ను మార్చగలవు.  పంచదారను వెంటనే మింగకుండా, కొన్ని క్షణాల పాటు నోటిలో ఉంచుకుని నెమ్మదిగా కరగనివ్వడం మంచిది.  అయితే, మధుమేహ రోగులు ఈ టిప్ పాటించే ముందు జాగ్రత్త వహించాలి. మోకాళ్లను  ఛాతీకి అనించడం..  డయాఫ్రమ్‌పై తేలికపాటి ఒత్తిడిని కలిగించే ఒక సులభమైన  పద్ధతి మోకాళ్ళ మీద ఛాతీ ఉంచుకుని కూర్చోవడం. నేల మీద లేదా కుర్చీలో కూర్చుని మోకాళ్లను ఛాతీ వైపుకు లాగి, కొన్ని నిమిషాల పాటు అదే స్థితిలో ఉండాలి. ఇది డయాఫ్రమ్ కండరాలను సడలించి, ఎక్కిళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఎక్కువ కాలం పాటు ఎక్కిళ్ళు కొనసాగినప్పుడు ఈ పద్ధతి ప్రత్యేకంగా ఉపయోగంగా ఉంటుంది.                      *రూపశ్రీ
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం (Jama Akula Kashayam) చేసుకోవడం ద్వారా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు పడాల రాజమౌళి గారు ఈ వీడియోలో వివరించారు.  జామ ఆకుల కషాయం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు (Benefits). డయాబెటిస్ (షుగర్), జీర్ణక్రియ సమస్యలు, మరియు బరువు తగ్గడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? జామ ఆకుల కషాయాన్ని సరైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలి? జీరో బడ్జెట్ లైఫ్‌స్టైల్ (Zero Budget Lifestyle) ద్వారా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ సహజసిద్ధమైన హెల్త్ డ్రింక్ గురించి పూర్తి వివరాల కోసం ఈ రోజే ఈ వీడియోను వీక్షించండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి! మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.