నేను మోసపోయానంటున్న త్రిష!
on Jul 25, 2016
కథానాయికగా పదేళ్ళ అనుభవం, బోలెడు మంది బడా బాబులతో సత్సంబంధాలు ఉన్న నటీమణి త్రిష. అయితే.. ఆ పదేళ్ళ అనుభవం కానీ.. తనకున్న పరిచయాలు కానీ త్రిషను మోసపోకుండా కాపాడలేకపోయాయి. బయటివాళ్లెవరైనా మోసం చేస్తే ఏదో ఒక విధంగా బదులిచ్చేదేమో కానీ.. తనను మోసం చేసింది స్వయంగా తన సొంత మనిషి మరియు తన కెరీర్ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించిన మేనేజర్ గిరిధర్ కావడంతో "మోసపోయాను" అంటూ బాధపడడం మినహా మరేమీ చేయలేకపోతోంది త్రిష.
అసలు విషయం ఏంటంటే.. తనకు గత కొన్నేళ్ళుగా మేనేజర్ గా వర్క్ చేస్తున్న గిరిధర్ మీద అభిమానంతో "నాయకి" అనే సినిమాను పారితోషికం తీసుకోకుండా కేవలం తమిళ రైట్స్ ను తనకు ఇచ్చే షరతు మీద ఫ్రీగా చేసింది. రిలీజ్ లేట్ అవ్వడం, రిలీజయ్యాక రేండ్రోజులకే థియేటర్ల నుంచి జెండా ఎత్తేయడంతో ఇక తమిళంలో రిలీజ్ అవ్వలేదు. అటు డబ్బు రాకపోవడం ఇటు సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రిష బాధపడిందని.. కానీ నిర్మాత కామ్ మేనేజర్ గిరిధర్ మాత్రం తెలుగులో మంచిగా మార్కెట్ చేసుకొని కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంకులో దాచుకొన్నాడని తెలుస్తోంది!