ఓట్ల కోసం దోశెలు వేస్తాం ... ఇస్త్రీ చేస్తాం ... !
Publish Date:May 17, 2012
Advertisement
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ మహిళా నేత, సినీనటి రోజా నెల్లూరులో చేసిన ప్రచారం కొత్తపుంతలు తొక్కింది. కుటుంబసభ్యులతో మమేకమై ఓటు అడగాలన్న పాలసీని ఆమె అక్షరాలా అమలు చేశారు. అందుకే ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా వారిని వదిలిపెట్టకుండా ముద్దులిచ్చారు. రజకుల ఓట్లు అభ్యర్థించ టానికి వెళ్ళినప్పుడు ఆమె కాసేపు సరదాగా ఇస్త్రీ కూడా చేశారు. అంతటితో ఆగకుండా ఓ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు దోశెలు వేసుకుంటుంటే వారిని ఆగమని చెప్పి రోజానే స్వయంగా దోశెలు పోశారు. వారికి తినటానికి ఇచ్చి తానూ తినేసి ఓటెయ్యమని అభ్యర్థించారు. ఈమె తనతో పాటు వచ్చిన కార్యకర్తలనూ ఈ తరహాలోనే ఉండాలని సూచించారు. ఇంతటితో ఆగకుండా చివరాఖరున మీ అభిమానులమని ఎవరైనా చెబితే చాలు వారిని తొందర చేసి మరీ పుస్తకాల్లో ఆటోగ్రాఫ్ లు ఇచ్చేశారు. యువకులను నవ్వుతూ పలకరించి మీరంతా మాకు ఓటు బ్యాంకులాంటివారని పొగడ్తలతో ముంచెత్తారు. చివరాఖరుగా తాను వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత అని గుర్తుకు వచ్చినట్లుంది కాబోలు, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రెండింటినీ నమ్మద్దని విమర్శనాస్త్రాలను సంధించారు. చిరంజీవి పేరు చెబితేనే మహిళలు మండిపడుతున్నారన్నారు. వందరూపాయలకు వంద వంట సరుకులు ఇస్తామనన్ చిరంజీవి తన వాగ్దానాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పి అమలు చేయించాలని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ సారికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను రోజా అభ్యర్థించారు.
http://www.teluguone.com/news/content/ysr-congress-women-leader-roja-24-14100.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





