పారిశ్రామికవేత్త శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ దృష్టి
Publish Date:May 17, 2012
Advertisement
వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు మరో పారిశ్రామికవేత్తపై దృష్టి సారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అనూహ్యంగా పెరిగిన శ్యాంప్రసాద్ రెడ్డిపై సిబిఐ ప్రత్యేక కన్ను వేసినట్లు చెబుతున్నారు. ఇందు ప్రాజెక్ట్స్ చైర్మన్ అయిన ఇందుకూరి శ్యాంప్రసాద్ రెడ్డి రియల్ ఎస్టేట్ రంగంలో కాలు పెట్టిం అతి కొద్ది కాలంలోని ఇందు ప్రాజెక్ట్స్ 2 వేల కోట్ల టర్నోవర్ సాధించడమే సిబిఐ అనుమానాలకు కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందు ప్రాజెక్ట్స్ యేటా వంద శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ వెంచర్స్ కోసం శ్యాంప్రసాద్ రెడ్డి భూములు పొందినట్లు చెబుతారు. ఇందు ఫార్చునిస్ ఫీల్డ్స్, ఇందు అరణ్య, ఇందు సిటీ వంటి ప్రాజెక్టులను హైదరాబాదులోని, హైదరాబాదు పరిసరాల్లోనూ చేపట్టారు. లేపాక్షి నాలెడ్జి హబ్ విషయంలో శ్యాంప్రసాద్ రెడ్డి నిబంధనలను ఉల్లంఘించి, ఆ భూమి మీద 790 కోట్ల రూపాయల రుణాలు పొందారనే ఆరోపణలున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం. ఇందు ప్రాజెక్ట్స్కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఎపిఐఐసి ఇప్పటికే ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. శ్యాంప్రసాద్ రెడ్డిని సిబిఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నించినట్లు వార్తలు వచ్చాయి.
http://www.teluguone.com/news/content/shyam-prasad-reddy-jagan-24-14102.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





