రాజకీయ నాయకులను హడలెత్తిస్తున్న సిబీఐ
Publish Date:May 17, 2012
Advertisement
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సిబీఐ తొలిగా 1948లో జీపుల కొనుగోలు సందర్భంగా 80లక్షల రూపాయల మేరకు కుంభకోణం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సిబీఐ కేసు నమోదు చేసింది. ఆ నాటి నుంచి ఉత్తరప్రదేశ్ లో జరిగిన టాయిలెట్స్, బీహార్ లో జరిగిన గడ్డి కుంభకోణం వరకు మేరకు అనేక కేసులు నమోదు చేసింది. ఆనాటి నుంచి 1990 వరకు ఏడాదికి ఒకటి రెండు కేసులు నమోదు చేసినా 1990 తరువాత కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. 2010వ సంవత్సరంలో 17 కేసులు, 2011లో 25కేసులు, 2012లో 37కేసులను సిబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 10కోట్ల రూపాయల విలువైన్ బొగ్గుగనుల వేలంనాకు సంబంధించిన కుంభకోణం మొదలుకొని లక్షా 75కోట్ల రూపాయలకు చెందిన 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇస్రోస్కామ్, హర్యానా ఫారెస్ట్ స్కామ్. మహారాష్ట్ర స్టాంప్స్ స్కామ్ వంటి అనేక కాసులు వున్నాయి. సిబీఐ దర్యాప్తు కొనసాగిస్తున్న లేదా దర్యాప్తు పూర్తిచేసిన కేసులలో పార్లమెంటు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు నిందుతులుగా ఉన్నారు. వి.పి.సింగ్ ప్రధానమంత్రిగా వుండగా వి.పి.సింగ్ ను అవినీతి పరునిగా చూపడం కోసం లకుభాయ్ పాథక్ తో కలిసి కుట్రచేసినట్టు వచ్చిన ఆరోపణపై సిబీఐ దర్యాప్తు చేసి దివంగత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో కింది కోర్టులో పి.వి.నరసింహారావుపై నేరం రుజువు కావడంతో పాటు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత హైకోర్టులో కేసును కొట్టివేయడం ఈలోగా పి.వి. నరసింహారావు చనిపోవడం జరిగింది. పంజాబ్ లో వ్యవసాయశాఖా మంత్రి తోట సింగ్ అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సిబీఐ కేసు నమోదు చేయగా మంత్రికి కోర్టులో ఏడాది జైలు శిక్షపడింది. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన శిబుసోరెన్ పై కూడా నేరం రుజువు కావడం శిక్షపడింది. తాజాగా సిబీఐ కోర్టు తెహల్కా స్ట్రింగ్ ఆపరేషన్ లో విలేఖరుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడిన బిజెపి జాతీయ అధ్యక్షునిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. కేసుల చరిత్ర పరిశీలిస్తే వివిధ కేసులలో నిందితులుగా వున్న ముఖ్యమంత్రులైనా, పార్లమెంటు సభ్యులైనా, కేంద్రమంత్రులైనా ఎవరినీ అరెస్టు చేయకుండా వదిలిపెట్టిన దాఖలా కనిపించడం లేదు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత వై.ఎస్. జగన్మోహన రెడ్డితో పాటు పంజాబు ముఖ్యమంత్రులుగా చేసిన ప్రతాప్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ ఖైరాన్ లను అక్రమ ఆస్తుల కేసు విషయంలో అరెస్టు చేసి జైలులో పెట్టింది. అక్రమ ఆస్తులు, ఛీటింగ్, జర్నలిస్టుపై దాడి అంశాలపై పంజాబు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సుఖబీర్ సింగ్ బాదల్ ను అరెస్టు చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ను ఆదర్శ హౌసింగ్ కాలనీ అక్రమాలపై సిబీఐ దర్యాప్తు చేస్తోంది. హవాలా డబ్బు విషయమై కేంద్రమంత్రి బలరాం జక్కర్ పై, ఏసియన్ గేమ్స్ నిర్వహణలో అక్రమాలపై ఎంపి సురేష్ కల్మాడీ, 2జి స్పెక్ట్రమ్ కేసు విషయంలో కలిమోలి, కేంద్రమంత్రి రాజా, కేంద్ర టెలికమ్యూని కేషన్ మంత్రి సుఖ్ రామ్, 40వేల కోట్ల విలువైన గ్రాఫ్ట్ మని కుంభకోణంపై జార్ఖండ్ మధుకోడాను, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మైనింగ్ అక్రమాల విషయంలో కర్ణాటక మంత్రి గాలి జనార్థన రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి విదర్భసింగ్, గడ్డి కుంభకోణం విషయంలో బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ లపై సిబీఐ కేసులు నమోదు చేసి అరెస్టు చేసింది.
http://www.teluguone.com/news/content/cbi-arrests-24-14098.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





