జగన్ పార్టీ మరో పి.ఆర్.పి. అవుతుందా?

Publish Date:Apr 20, 2012

Advertisement

జగన్ ప్రారంభించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ మాదిరిగా తయారవుతుందా? అని అనుమానం వస్తోంది. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత 2009 ఎన్నికలు జరిగే సమయంలో పి.ఆర్.పి. ప్రధాన కార్యదర్శిగా వున్న అల్లు అరవింద్ ఒక సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో వున్న 294 స్థానాలలో నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎన్.చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న రెండు స్థానాలు మినహా మిగిలిన 292 స్థానాలు ప్రజారాజ్య, పార్టీవేనని ప్రకటించారు.

చివరకు చిరంజీవి స్వయంగా పాలకొల్లులో ఓడిపోవడంతో పాటు కేవలం 18 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం నాడు అల్లు అరవింద్ ప్రకటించినట్టుగానే నేడు జగన్ మరో అడుగు ముందుకు వేసి తమ పార్టీ ఏకంగా 2014 ఎన్నికల్లో 294 స్థానాలు గెలుపొందుతుందని ప్రకటించారు. 294 స్థానాలు తమపార్తీనే గెలుస్తుందని ప్రకటించడాన్ని ప్రజలు అతిశయోక్తిగా భావించడమే కాకుండా జగన్ ధోరణి చూస్తుంటే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా పి.ఆర్.పి. బాటలో పయనిస్తుందని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విశ్లేషణల మాట ఎలా ఉన్నా ఒకప్పుడు వై.ఎస్. కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న కె.వి.పి. రామచంద్రరావు ఇటీవల ఢిల్లీలో తనకు అత్యంత సన్నిహితులతో మాట్లాడుతూ జగన్ ఏనాటికైనా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పరు. కె.వి.పి. అంచనాలు నిజమైతే ఏదో ఒకనాడు పి.ఆర్.పి. లాగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ లో విలీనమైనా ఆశ్చర్యపోనక్కరలేదు.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.