మే 28న జగన్ ను అరెస్ట్ చేస్తారా?
Publish Date:May 17, 2012
Advertisement
వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంట్ సభ్యులు జగన్మోహనరెడ్డి అరెస్టుపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. అక్రమాస్తుల కేసు విషయమై మే 28 వ తేదీన విచారణకు రావలసిందిగా సిబీఐ కోర్టు జగన్ కు సమన్లు పంపింది. జగన్ కోర్టుకు హాజరైన వెంటనే ఆయనను విచారించడానికి అనుమతించవలసిందిగా సిబీఐ అధికారులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేసి వుండటం వల్ల జగన్ ను అరెస్టు చేయవలసిందిగా పోలీసులను కోర్టు ఆదేశించే అవకాశం కూడా వున్నట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మే 28వ తేదీ ఏమవుతుంది? జగన్ అరెస్ట్ అవుతారా? లేదా? అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. జగన్ తండ్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వివిధ సంస్థలకు, వ్యక్తులకు అక్రమంగా మేలుచేకూర్చడం వల్లనే జగన్ కు అక్రమాస్తులు సమకూరినట్లు సిబీఐ పలు ఆధారాలతో ఎఫ్.ఐ.ఆర్.లను దాఖలు చేసింది. కోనేరు ప్రసాద్, మాట్రిక్స్ సంస్థకు చెందిన నిమ్మగడ్డ ప్రసాద్ వంటి వారిని ఇప్పటికే అరెస్టు చేయడం, మరికొంతమందిని సాక్షులుగా మార్చి వారినుంచి న్యాయమూర్తి సమక్షంలోనే సాక్ష్యాలను నమోదు చేసింది. ఈ స్థితిలో జగన్ కోర్టుకు హాజరైన సమయంలో జగన్ ను తమ కస్టడీకి లేదా విచారణకు అనుమతించవలసిందిగా సిబీఐ కోర్టుకు విన్నవించుకునే అవకాశం వుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎంతటి ఆసక్తి కలిగిస్తున్నాయో ... జగన్ కు సమన్లు జారీచేయడం, ఆయన 28వ తేదీన కోర్టుకు హాజరు కావడం అనే అంశం కూడా అంతే ఆసక్తిని కలిగిస్తోంది.
http://www.teluguone.com/news/content/ys-jagam-may-be-arrested-on-may-28th-24-14096.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





