పోలవరంలో సింహనాదం భయం గుప్పిట్లో 'దేశం'

Publish Date:Apr 19, 2012

Advertisement

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభం కాకముందే తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పూనెం సింగన్నదొర తిరుగుబాటు బాపుతా ఎగురవేశారు. తన తనయుడు రామ్మేహన్ కి టిక్కెట్టు ఇవ్వనందుకు నిరసనగా నియోజకవర్గ కన్వీనర్ పదవికి, టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షపదవికి రాజీనామా చేశారు. ఈయనకు వందలాది మంది అనుయాయులు మద్దతు ప్రకటించారు.

తాను మూడు దశాబ్దాలపాటు పార్టీ అభ్యున్నతికి పాటుపడ్డానని, ఈసారి తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని సింగన్నదొర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. జిల్లా ఇన్ చార్జి సీతారామలక్ష్మి, సింగన్నదొరను బుజ్జగించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తానూ తన అనుచరులు పదవులకు రాజీనామా చేసినప్పటికీ పార్టీలోనే కొనసాగు తామని సింగన్నదొర చెప్పటం విశేషం. ఇప్పటికే సింగన్నదొర దెబ్బతో బెంబేలెత్తిపోతున్న తెలుగుదేశం నేతలకు ఆయన మరోసారి షాక్ ఇస్తారేమోనని భయపడుతున్నారు. తన కుమారుడిని పోలవరంలో తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దింపితే పార్టీ అభ్యర్థికి డిపాజిట్టు కూడా దక్కదని వారు భయపడుతున్నారు. అందుకే వెంటనే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దాలని నియోజకవర్గ నాయకులు కోరుతున్నారు.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.