వంగవీటికి జగన్ ఇచ్చిన హామీ ఏమిటి?

Publish Date:Apr 21, 2012

Advertisement

2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం సీటు ఇచ్చే ఒప్పందంతోనే వంగవీటి రాధాకృష్ణ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశిస్తున్నట్టు తెలుస్తోంది. రాధాకృష్ణ 2009 ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యంపార్టీ తరపున పోటీచేశారు. తర్వాత కాలంలో ప్రజారాజ్యంపార్టీ అధ్యక్షులు చిరంజీవితో అభిప్రాయబేధాలు రావడంతో రాధాకృష్ణ పార్టీకి దూరంగా వున్నారు. చిరంజీవి కూడా ఆయన పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తర్వాత పరిణామాల నేపథ్యంలో ప్రజారాజ్యంపార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. దాదాపు రెండేళ్ళుగా ఏ రాజకీయపార్టీతో సంబంధాలు లేకుండా వున్న రాధాకృష్ణ ఇటీవల కాలంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది.

 

అయితే ఆ తర్వాత అంటే రెండు వారాల క్రితం రాధాకృష్ణ ఆకస్మికంగా చిరంజీవిని కలిశారు. ఆయనతో కలిసి వచ్చిన తర్వాత కేవలం వారంరోజుల వ్యవధిలోనే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పక్షంలో వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు ఇస్తారా? అని ప్రశ్నించినప్పుడు రాధాకృష్ణకు ఎటువంటి హామీ లభించలేదని అందుకే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

 

2014 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ సెంట్రల్ సీటు ఇచ్చేటట్లు జగన్ తో ఒప్పందం జరిగినట్లు చెప్పుకుంటున్నారు. ఆ ఒప్పందం మేరకే ఏప్రిల్ 27వ తేదీన విజయవాడలో జరిగే ఒక కార్యక్రమంలో జగన్ సమక్షంలో చేరుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్ సీటుపై ఆశతో క్రియాశీలకంగా పనిచేస్తున్న గౌతమ్ రెడ్డి నిరుత్సాహానికి గురికాకుండా జగన్ ఆయనకు నచ్చచేప్పినట్టు తెలిసింది. స్థానిక సంస్థలలో విజయవాడ ఓపెన్ కేటగిరీలో వున్నట్లయితే మేయర్ స్థానం ఇస్తామని, ఒకవేళ మేయర్ రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఉడా (VUDA) చైర్మన్ పదవి వచ్చే విధంగా గౌతమ్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.