అధిష్టానం పరిశీలనలో గల్లా, వెంకటరమణ పేర్లు

Publish Date:Apr 5, 2012

Advertisement

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ, తరపున పోటీచేసే అవకాశం మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, రాష్ట్ర మంత్రి గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సుమారు పాతిక మంది ఆశావహులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు చిరంజీవిని కలుసుకుని తమ పేర్లను పరిశీలించవలసిందిగా కోరారు. అయితే చివరకు వీరు గల్లా జయదేవ్ లేదా వెంకటరమణ పేర్లను ఖరారు చేశారు. ఈ రెండు పేర్లను అధిష్టానానికి పంపి వారిద్దరిలో ఎవరికీ టిక్కెట్ ఇవ్వమంటే వారిని అభ్యర్ధిగా ప్రకటించబోతున్నట్లు తెలిసింది. గల్లా జయదేవ్ కు ఈ ప్రాంతంలో అర్ధబలంతో పాటు అంగబలం కూడా ఉంది. అవసరమైతే ఎన్నికలో రూ. 10 నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఖర్చు పెట్టడానికి గల్లా కుటుంబం సిద్ధంగా ఉన్నర్లు తెలుస్తోంది. చిరంజీవి కూడా వీరివైపే మొగ్గుచూపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో చిరంజీవికి అయిన ఎన్నికల వ్యయాన్ని గల్లా కుటుంబం తిరిగి ఆయనకు చెల్లించేందుకు సిద్దపడినట్లు తెలిసింది. దీంతో చిరంజీవి గల్లా కుటుంబంవైపే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

మరోవైపు మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ కూడా గట్టిగానే తన ప్రయత్నం చేస్తున్నారు. 2004 ఎన్నికల్లో ఆయన సుమారు 40వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయనకు టిక్కెట్ రాకుండా చేశారు. అయినప్పటికీ తాను జనంలోనే ఉంటూ ప్రజాసేవ చేస్తున్నానని, తన సామాజికవర్గానికి చేనిన ఓటర్లు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారని ఎమ్మెల్యే వెంకటరమణ వాదించారు. అధిష్టానానికి పంపిన పేర్లలో మరీ ఒక్క పేరే పంపిస్తే బాగుండదనే ఉద్దేశంతో గల్లా జయదేవ్, వెంకటరమణ పేర్లను పంపినట్లు తెలిసింది. కాని టిక్కెట్ మాత్రం గల్లా జయదేవ్ కు వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 

 

By
en-us Political News

  
మాదన్నపేటలో ప్రేమోన్మాది ఘాతుకం.. !
హైదరాబాద్ నగరంలోని నానక్‌రామ్‌గూడ భూ వివాదం, భూ కబ్జా ఆరోపణలపై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
నిజామాబాద్ నడిబొడ్డున నరికి చంపి దుండగులు..!
తమిళనాడు సంప్రదాయ హస్తకళల వైవిధ్యాన్ని హైదరాబాద్ నగరవాసులకు పరిచయం చేసేందుకు శిల్పారామంలో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు మెగా హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌ భూముల వ్యవహారంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో భూ వ్యవహారాలు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి.
స్టేషన్ బెయిల్ కోసం భారీ లంచం డిమాండ్..!
కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మిస్సింగ్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం..!
కేసీఆర్‌ ఆస్తులపై ఆరోపణలను ఖండించిన కేటీఆర్‌..!
చింతపల్లి సమీపానికి రాగానే, ఆయన ప్రయాణిస్తున్న కారులో   పొగలు రావడం గమనించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును నిలిపివేయగా, లోపల ఉన్న పవర్ బ్యాంక్ పేలడంతో కేబిన్ అంతటా మంటలు వేగంగా వ్యాపించాయి.
వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో పడి ప్రాణాలు కోల్పోయారు.  సంగారెడ్డి జిల్లా పరిధిలోని పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది.
వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులకు అదే చివరి ప్రయాణమైంది.
2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.