ఎన్నికల్లో ఓడిపోతే పగబడతారా?

Publish Date:Aug 26, 2012

Advertisement

ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే అవమానంగా భావించేవారు కొందరు. దీంతో పగబట్టి సాధించాలనుకునేవారు కొందరు. అసలు ఎన్నికలు కాబట్టి గెలుపు, ఓటములు సహజమని సర్దుకుపోయేవారు మరికొందరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. గెలవటమే తమ జీవితం అనుకుని ప్రత్యర్థులతో నేరుగా గొడవపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. రాష్ట్రం మొత్తం మీద పార్టీల కార్యకర్తలు కూడా ఈ తరహాలోనే పట్టుదలగా వ్యవహరించేవారూ ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ కార్యకర్తలైతే కత్తులతో దాడులకు తెగబడిన రాజకీయ చరిత్ర రికార్డుల్లో నలుగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీ ఖచ్చితంగా దాడులకు తెగబడుతుందని గెలిచినపార్టీ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించేది. ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక అభ్యర్థులు వ్యక్తిగతంగా పగబట్టడానికి కూడా సిద్దపడుతుంటారు. దీనికి తాజా ఉదాహరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తేర చన్నిపురెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ పడ్డారు. ఈ 2009 ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో మంత్రిపై పగబూనిన చిన్నపురెడ్డి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా జానారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. రెండునెలలుగా ఆగకుండా ఈ ప్రచారం సాగుతుండటంతో విసిగిపోయిన జానారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు సాక్ష్యులను విచారించి చిన్నపురెడ్డిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నపురెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.

By
en-us Political News

  
గత పుష్కర కాలంగా  ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో  మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో  అధికారుల కమిటీ  సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్‌ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
 నెల రోజుల కిందటి  వరకూ  క్వింటాల్  రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.