ఎన్నికల్లో ఓడిపోతే పగబడతారా?
Publish Date:Aug 26, 2012
Advertisement
ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతే అవమానంగా భావించేవారు కొందరు. దీంతో పగబట్టి సాధించాలనుకునేవారు కొందరు. అసలు ఎన్నికలు కాబట్టి గెలుపు, ఓటములు సహజమని సర్దుకుపోయేవారు మరికొందరు. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కోరకంగా ఉంటుంది. గెలవటమే తమ జీవితం అనుకుని ప్రత్యర్థులతో నేరుగా గొడవపెట్టుకునేందుకు ప్రయత్నిస్తుం టారు. రాష్ట్రం మొత్తం మీద పార్టీల కార్యకర్తలు కూడా ఈ తరహాలోనే పట్టుదలగా వ్యవహరించేవారూ ఉన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ కార్యకర్తలైతే కత్తులతో దాడులకు తెగబడిన రాజకీయ చరిత్ర రికార్డుల్లో నలుగుతోంది. ఎన్నికల్లో ఓడిన పార్టీ ఖచ్చితంగా దాడులకు తెగబడుతుందని గెలిచినపార్టీ ముందస్తుగా పోలీసులను ఆశ్రయించేది. ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేక అభ్యర్థులు వ్యక్తిగతంగా పగబట్టడానికి కూడా సిద్దపడుతుంటారు. దీనికి తాజా ఉదాహరణ నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తేర చన్నిపురెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి పోటీ పడ్డారు. ఈ 2009 ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించి మంత్రి అయ్యారు. దీంతో మంత్రిపై పగబూనిన చిన్నపురెడ్డి ఎస్ఎంఎస్ల ద్వారా జానారెడ్డిపై దుష్ప్రచారం చేశారు. రెండునెలలుగా ఆగకుండా ఈ ప్రచారం సాగుతుండటంతో విసిగిపోయిన జానారెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ అధికారులు సాక్ష్యులను విచారించి చిన్నపురెడ్డిపై ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చిన్నపురెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.
http://www.teluguone.com/news/content/tera-chinnapa-reddy-tdp-candidate-from-nagarjuna-sagar-lost-to---janareddy-in-2009-elections-24-16893.html





