జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాతే తలసాని రాజీనామా?

Publish Date:Jul 11, 2015

Advertisement

 

హైదరబాద్ లో సనత్ నగర్ నియోజక వర్గం నుండి తెదేపా టికెట్ మీద అసెంబ్లీ కి ఎన్నికయిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తను నైతిక విలువలకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడినని అందుకే పార్టీకి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసిన తరువాతనే తెరాసలో చేరుతున్నానని చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ ఏడు నెలలు గడిచిపోయినా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆయన ఆమోదించక పోతే ఆ తప్పు తనది కాదని తలసాని వాదిస్తున్నారు కానీ నైతిక విలువల గురించి మాట్లాడిన ఆయన తన రాజీనామాను ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేయలేదు. ఇతర పార్టీలకి నీతులు చెప్పే తెరాస ఆ నీతి తనకు వర్తించదని అనుకొందో ఏమో తెలియదు కానీ నేటికీ ఆయన తెరాస ప్రభుత్వంలో తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. స్పీకర్ కి తెదేపా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆయన వాటిని పట్టించుకోలేదు. కనుక తెదేపా హైకోర్టులో పిటిషన్ వేయవలసి వచ్చింది. ఇటువంటి అనైతిక పద్దతులను అమలుచేస్తున్నప్పుడు వాటిని నియంత్రించవలసిన వారు కూడా పట్టించుకోకపోవడం వలన అదే ఒక సంప్రదాయంగా మారే అవకాశాలున్నాయి.

 

ఏదో చీమ కదా చెప్పుకొన్నట్లుగా అయితే తలసాని రాజీనామాను ఎప్పుడు ఆమోదిస్తారు? అంటే జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాత అని తెరాస వర్గాల నుండి జవాబు వినిపిస్తోంది. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే వార్డుల పునర్విభజన జరిగిన తరువాత అంటున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే వచ్చే జనవరి నాటికవుతుందేమో? అనే చెపుతున్నారు. కనుక తలసాని రాజీనామా కూడా ఆ తరువాతే అంటే ఏ మార్చి, ఏప్రిల్ నెలలోనో ఆమోదిస్తారేమో?

 

ఒకవేళ ఆయన ఇప్పుడు రాజీనామా చేసినట్లయితే ఆరు నెలలలోగా ఉపఎన్నికలలో గెలవవలసి ఉంటుంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది కనుక అవి పూర్తయ్యేవరకు ఆయన చేత అటువంటి ప్రయోగాలు చేయడం అంత మంచి ఆలోచన కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దైర్యం చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్దపడినా ఆయన ఒకవేళ గెలవలేకపోతే ఆ ప్రభావం జి.హెచ్.యం.సి. ఎన్నికల మీద పడుతుంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. అది తెరాస ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది కనుకనే ఈ జి.హెచ్.యం.సి. ఎన్నికల కార్యక్రమం ఏదో ముగించిన తరువాత అప్పుడే ఆయన రాజీనామా గురించి ఆలోచించవచ్చని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకవేళ ఈ లోగా గవర్నర్ లేదా హైకోర్టు ఆయన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ని కోరితే ఏమి చేస్తారో? తలసానిని పార్టీలో చేర్చుకొన్నంత మాత్రాన్న ఆ నోయోజక వర్గ ప్రజలు కూడా తెదేపా నుండి తెరాసకు ఆయనంత విజీగా షిఫ్ట్ అయిపోతారా? అని పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న కూడా ఆలోచించదగ్గదే.

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.