జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాతే తలసాని రాజీనామా?

Publish Date:Jul 11, 2015

Advertisement

 

హైదరబాద్ లో సనత్ నగర్ నియోజక వర్గం నుండి తెదేపా టికెట్ మీద అసెంబ్లీ కి ఎన్నికయిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తను నైతిక విలువలకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడినని అందుకే పార్టీకి, తన ఎమ్మేల్యే పదవికి కూడా రాజీనామా చేసిన తరువాతనే తెరాసలో చేరుతున్నానని చాలా గొప్పగా చెప్పుకొన్నారు. కానీ ఏడు నెలలు గడిచిపోయినా స్పీకర్ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. ఆయన ఆమోదించక పోతే ఆ తప్పు తనది కాదని తలసాని వాదిస్తున్నారు కానీ నైతిక విలువల గురించి మాట్లాడిన ఆయన తన రాజీనామాను ఆమోదింప జేసుకొనే ప్రయత్నం చేయలేదు. ఇతర పార్టీలకి నీతులు చెప్పే తెరాస ఆ నీతి తనకు వర్తించదని అనుకొందో ఏమో తెలియదు కానీ నేటికీ ఆయన తెరాస ప్రభుత్వంలో తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. స్పీకర్ కి తెదేపా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఆయన వాటిని పట్టించుకోలేదు. కనుక తెదేపా హైకోర్టులో పిటిషన్ వేయవలసి వచ్చింది. ఇటువంటి అనైతిక పద్దతులను అమలుచేస్తున్నప్పుడు వాటిని నియంత్రించవలసిన వారు కూడా పట్టించుకోకపోవడం వలన అదే ఒక సంప్రదాయంగా మారే అవకాశాలున్నాయి.

 

ఏదో చీమ కదా చెప్పుకొన్నట్లుగా అయితే తలసాని రాజీనామాను ఎప్పుడు ఆమోదిస్తారు? అంటే జి.హెచ్.యం.సి. ఎన్నికల తరువాత అని తెరాస వర్గాల నుండి జవాబు వినిపిస్తోంది. అయితే ఉపఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అంటే వార్డుల పునర్విభజన జరిగిన తరువాత అంటున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అంటే వచ్చే జనవరి నాటికవుతుందేమో? అనే చెపుతున్నారు. కనుక తలసాని రాజీనామా కూడా ఆ తరువాతే అంటే ఏ మార్చి, ఏప్రిల్ నెలలోనో ఆమోదిస్తారేమో?

 

ఒకవేళ ఆయన ఇప్పుడు రాజీనామా చేసినట్లయితే ఆరు నెలలలోగా ఉపఎన్నికలలో గెలవవలసి ఉంటుంది. కానీ జి.హెచ్.యం.సి. ఎన్నికలలో ఎలాగయినా గెలవాలని తెరాస చాలా పట్టుదలగా ఉంది కనుక అవి పూర్తయ్యేవరకు ఆయన చేత అటువంటి ప్రయోగాలు చేయడం అంత మంచి ఆలోచన కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ దైర్యం చేసి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్దపడినా ఆయన ఒకవేళ గెలవలేకపోతే ఆ ప్రభావం జి.హెచ్.యం.సి. ఎన్నికల మీద పడుతుంది. ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి వస్తుంది. అది తెరాస ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది కనుకనే ఈ జి.హెచ్.యం.సి. ఎన్నికల కార్యక్రమం ఏదో ముగించిన తరువాత అప్పుడే ఆయన రాజీనామా గురించి ఆలోచించవచ్చని తెరాస భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఒకవేళ ఈ లోగా గవర్నర్ లేదా హైకోర్టు ఆయన రాజీనామాను ఆమోదించమని స్పీకర్ ని కోరితే ఏమి చేస్తారో? తలసానిని పార్టీలో చేర్చుకొన్నంత మాత్రాన్న ఆ నోయోజక వర్గ ప్రజలు కూడా తెదేపా నుండి తెరాసకు ఆయనంత విజీగా షిఫ్ట్ అయిపోతారా? అని పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్న కూడా ఆలోచించదగ్గదే.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.