పాక్ మళ్ళీ మాట మార్చింది

Publish Date:Jul 13, 2015

Advertisement

 

రెండు రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు రష్యాలో సమావేశమయినప్పుడు, పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నముంబై ప్రేలుళ్ళ సూత్రధారి జాకి ఉర్ రెహమాన్ న్ని శిక్షించేందుకు సహకరించాలని ప్రధాని మోడీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కోరినప్పుడు అందుకు ఆయన అంగీకరించారు. ఆ తరువాత ఇరు దేశాల విదేశీ కార్యదర్శులు కలిసి ఇదే విషయం దృవీకరిస్తూ ఒక ప్రకటన కూడా చేసారు. కానీ నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ చేరుకోగానే షరా మామూలుగానే మాట మార్చారు. ముంబై ప్రేలుళ్ళ కేసును విచారిస్తున్న రావాల్పిండి కోర్టు నిందితుని గొంతును గుర్తించేందుకు వాయిస్-సాంపిల్స్ సేకరించే చట్టం ఏదీ పాకిస్తాన్ రాజ్యాంగంలో లేదని నాలుగేళ్ల క్రితమే తేల్చి చెప్పిందని, కనుక మళ్ళీ దాని కోసం కోర్టులో కొత్తగా మరో పిటిషన్ వేసే ఆలోచన తమకు లేదని ప్రభుత్వ ప్రాసిక్యూషన్ ప్రధాన న్యాయవాది చౌదరి అజహర్ తేల్చి చెప్పారు. నిందితుడు తనంతట తానుగా వాయిస్-సాంపిల్స్ ఇచ్చేందుకు అంగీకరిస్తే తప్ప భారత ప్రభుత్వం కోరినట్లు లక్వీ వాయిస్-సాంపిల్స్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.

 

పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి చర్చల్లో ఎక్కడా ప్రస్తావించకుండా, మోడీ కోరినట్లు లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని చెప్పడం, అదే విషయాన్ని భారత్, పాక్ విదేశంగా కార్యదర్శులు మీడియాముందు ప్రకటించడంతో పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు, ప్రభుత్వం మీద పెత్తనం చేస్తున్న కొందరు సైన్యాధికారులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ విధంగా చేయడం ద్వారా ముంబై ప్రేలుళ్ళకు పాల్పడిన ఉగ్రవాదిని పాక్ ప్రభుత్వమే రక్షిస్తోందని, అతనికి శిక్ష పడాల్సిన అవసరం కూడా ఉందని యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ ఒప్పుకొన్నట్లయిందని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు పాక్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉగ్రవాదం గురించి కూడా పాకిస్తాన్ విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించడంలో మోడీ కృతకృత్యుడయ్యారు. కానీ పాక్ ప్రధాని కాశ్మీర్ అంశం గురించి భారత విదేశంగా కార్యదర్శితో ప్రకటన చేయించలేకపోయారని పాకిస్తాన్ లో ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ మాయలో పడి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ దేశాన్ని యావత్ ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారని అందరూ నవాజ్ షరీఫ్ పై విరుచుకుపడుతున్నారు.

 

నేరకపోయి లక్వీకి శిక్ష పడేందుకు సహకరిస్తామని ప్రకటించినందుకు ఇప్పుడు పాక్ ప్రభుత్వం లెంపలు వేసుకొంటూ రావల్పిండి కోర్టు వ్యాఖ్యలు, పాకిస్తాన్ చట్టాలని అడ్డుపెట్టుకొని మాట మార్చింది. కానీ ఇరు దేశాల విదేశంగా కార్యదర్శుల ప్రకటనతోనే జరగవలసిన నష్టం జరిగిపోయింది. అయినా ముంజేతి కంకణాన్ని చూసుకొనేందుకు అద్దం ఎందుకన్నట్లుగా పాకిస్తాన్ ఉగ్రవాదులని పెంచి పోషిస్తోందని నొక్కి చెప్పడానికి ఇటువంటి ప్రకటనలు అవసరమా?పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర భూతానికి ఆ దేశ ప్రజలు చిన్నారులే బలయిపోతున్న సంగతి లోకానికి తెలుసు. కానీ పాక్ ప్రభుత్వంపై సైమ్యం కర్ర పెత్తనం చేస్తునంత కాలం పాక్ తీరు మారదు.

By
en-us Political News

  
ఇద్దరు అధికారులు దివంగత వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలకమైన శాఖలు నిర్వహించిన వారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ చేతిలో వీరిద్దరూ తీరని అవమానాలకు గురౌతున్నారు.
భారతీయ జనతా పార్టీ దిగుమతుల విభాగం నుంచి డంప్ అయిన జి వి ఎల్ నరసింహారావు , అలాగే తెలుగు దేశం నుంచి బీ జె పి లోకి దిగుమతి అయిన సుజనా చౌదరి, సి ఎం రమేష్, టీ జీ వెంకటేష్...
సినిమాలలో ఎన్నో క్రైమ్ స్టోరీలు, ఎన్నో కిడ్నాప్ సీన్లు చూసుంటారు. అయితే.. కాకినాడలో జరిగిన ఈ రియల్ స్టోరీ ముందు ఆ రీల్ స్టోరీలన్నీ చిన్నబోతాయి. పేరున్న రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్న అధికారులు.. ఇలా భారీ తారాగణం నటించిన..
తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్‌లో  పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్‌ ప్రకారం రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్‌ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.
రాజకీయాల్లో ఓడలు బళ్లు అవుతాయి. బళ్లు ఓడలవుతాయి. ప్రజాస్వామ్యంలో ఇది సాధారణమే. ప్రస్తుతం దేశంలోనూ, అనేక రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలోనూ, ఆయా రాష్ట్రాల్లో చక్రం తిప్పినవారంతా...
అమావాస్య రోజు చందమామని చూడాలనుకోవడం, రాజకీయాలలో విలువలు గురించి మాట్లాడాలనుకోవడం ఒకటే అంటుంటారు. అవును ఈ తరం రాజకీయాలను చూస్తే నిజమే అనిపిస్తుంది...
ఆంధ్రప్రదేశ్ లో సొంతంగానే బలపడతాం అని ప్రతి రోజూ ప్రకటనలు గుప్పిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది అంటే? భలే ప్రశ్న అడిగారండి, ఆ విషయం ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు...
60వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' నినాదం మార్మోగింది. కుల,మత, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు విశాఖలో ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమించి భారీ ఉద్యమం చేసి దాన్ని సాధించుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే హైదరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే. సైబరాబాద్ నిర్మాతను నేను. అని చెప్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు ఆర్ధిక సంవత్సరాల్లో మొత్తం 47,682.87 కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందింది. దేశం మొత్తం మీద ఓవర్ డ్రాఫ్ట్ (ఓ.డి.) అత్యధిక మొత్తం పొందిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవటంతో...
ఇద్దరు నేతలు...వారి వ్యవహార శైలి.. ...ప్రస్తుతం రాష్ట్రం లో నలుగుతున్న చర్చ ఇదే. ఒకరు సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించే ఫిలాసఫి నిర్మాతలైతే, మరొకరు..పైన దేవుడున్నాడు... నాన్న చూస్తున్నాడు...
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ దాదాపు గా అప్రూవర్ గా మారబోతున్నట్టు సమాచారం. ఈ సంగతి తెలుగుదేశాధినేతకు శరాఘాత సమానమైన విషయమైనప్పటికీ...
ఇది మరో సంక్షోభం... మొన్న జాస్తి కృష్ణ కిషోర్... ఈ రోజు ఏ.బి. వెంకటేశ్వర రావు. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వితే, కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఏ రకంగా స్పందించిందో ఇప్పటికే అనుభవైనప్పటికీ...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.