తెరాస వ్యూహానికి తెదేపా చెక్!

Publish Date:Nov 5, 2015

Advertisement

 

ఇంతకు ముందు తెదేపాలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నప్పటికీ ఇంతవరకు తన రాజీనామాను స్పీకర్ చేత ఆమోదింపజేసుకోకపోవడం చేత ఆయనే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సనత్ నగర్ నియోజక వర్గంలో ఆంధ్రాకు చెందిన ప్రజలు చాలా మంది స్థిరపడున్నారు. ఇదివరకు తలసాని తెదేపాలో ఉన్న కారణంగా వారు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. కానీ ఆయన తెదేపాలో ఉంటారని భావించి ఓట్లు వేసి గెలిపిస్తే, తమ అభీష్టానికి విరుద్దంగా ఆయన తెరాసలో చేరడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కనుక ఆయన మళ్ళీ సనత్ నగర్ నుంచి పోటీ చేస్తే వాళ్ళ ఓట్లు ఆయనకు పడే అవకాశం ఉండకపోవచ్చును. బహుశః ఆ భయంతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇంతవరకు ఆమోదింపజేసుకోలేదని భావించవచ్చును. కానీ ఏదో ఒకనాడు అదే సనత్ నగర్ నియోజక వర్గం నుంచి పోటీ చేయక తప్పదు. ఆయన తెదేపాను వీడి తెరాసలో జేరినప్పుడు ఆయనతో బాటు ఆయన అనుచరులు కూడా తెరాసలో చేరారు. అయితే నేటికీ సనత్ నగర్ నియోజక వర్గంలో తెదేపా చాలా బలంగానే ఉంది. కనుక ఈ పరిస్థితిలో తెదేపాను బలహీనపడితే తప్ప అక్కడ తలసాని విజయం సాధించడం అసంభవం. అందుకే సనత్ నగర్ నియోజక వర్గానికి తెదేపా ఇన్-చార్జ్ గా వ్యవహరిస్తున్న కూన వెంకటేష్ గౌడ్ ని తెరాసలోకి ఆకర్షించే ప్రయత్నాలు జరిగాయి. వెంకటేష్ గౌడ్ తెదేపాకు గుడ్ బై చెప్పి తెరాసలోకి వెళ్లిపోబోతున్నారని ఆ మధ్యన మీడియాలో వార్తలు వచ్చేయి.

 

తెదేపా కూడా దీనికి విరుగుడుగా ఒక వ్యూహం అమలు చేస్తోంది. సనత్ నగర్ నియోజక వర్గానికి జరుగబోయే ఉప ఎన్నికలలో తెదేపా అభ్యర్ధిగా కూన వెంకటేష్ గౌడ్ నే నిలబెట్టాలని నిశ్చయించుకొంది. దానితో తెరాస వ్యూహం బెడిసి కొట్టినట్లయింది. ఎవరిని తమ పార్టీలోకి ఆకర్షించాలని అనుకొందో వారితోనే తలపడాల్సిన పరిస్థితి ఎదురయింది.

 

అసలు ఆయన గత ఎన్నికలలోనే సనత్ నగర్ నుంచి పోటీ చేయాలని ఆశపడ్డారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆ సీటును తలసానికి ఇవ్వవలసి వచ్చింది. కానీ ఆయన తెదేపాకు హ్యాండిచ్చి తెరాసలోకి వెళ్ళిపోయారు. తనకు దక్కవలసిన సీటును తలసాని దొంగిలించుకొని పారిపోయారని వెంకటేష్ గౌడ్ ఆరోపిస్తున్నారు. ఈసారి తనకే సనత్ నగర్ నుండి పోటీ చేసే అవకాశం ఇస్తామని తెదేపా అధిష్టానం స్పష్టమయిన హామీ ఇవ్వడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారు.

 

గత శుక్రవారం బేగంపేటలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలు నేతల సమావేశంలో కూన వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ “నేను పార్టీని వీడుతానని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. నా చివరి శ్వాస వరకు తెదేపాలోనే కొనసాగుతాను. పార్టీ కోసం పనిచేతూనే ఉంటాను. ఆదరించిన పార్టీని మోసం చేసి తెరాసలో వెళ్ళిన వారందరికీ ప్రజలు తగిన గుణపాఠం నేర్పాలి. తెలంగాణాలో, మన నియోజక వర్గంలో తెదేపాను పటిష్టపరిచేందుకు మనమందరం కలిసి కృషి చేయాలి,” అని కోరారు.

By
en-us Political News

  
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన వైసీపీ.. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. దీని వెనుక వైసీపీ 2029 ఎన్నికల వ్యూహం ఉందంటున్నారు పరిశీలకులు. కేవలం రాజకీయ విమర్శల విషయంలో వచ్చిన మార్పు కాదనీ, 2029 ఎన్నికల దిశగా వైసీపీ వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోందంటున్నారు.
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.