మ‌ళ్లీ బ‌ట‌న్‌ నొక్కిన జ‌గ‌న‌న్న‌.. ‘సుప్రీం’ వ‌ద్ద‌న్నా ఆగేనా?

Publish Date:Jan 25, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ‌ళ్లీ మీట నొక్కారు. ఇంచుమించుగా నాలుగు లక్షల (3,92,674)  మంది ఈబీసీ నేస్తం పథకం లబ్దిదారుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చేరిపోయాయి. ఇదొక్కటే కాదు, ఇలా ముఖ్యమంత్రి మీట నొక్కటం అలా లబ్దిదారు ఖాతాల్లోకి డబ్బులు చేరిపోవడం ఒక రొటీన్ వ్యవహరంగా సాగిపోతోంది. మంచిదే, కానీ, పేదలను పెదలుగా ఉంచుతూ, ఓటు బ్యాంకు కోసంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఏమిటన్న ప్రశ్నతో పాటుగా, ఇంకా అనేక ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.   

ముఖ్యమంత్రి అలా మీట నొక్కిన రోజునే, సుప్రీం కోర్టు, ఉచితాలకు సంబందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. అఫ్కోర్స్ ఇది యాదృచ్చికమే కావచ్చును, సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈబీసీ నేస్తం పథకం గురించో, లేక పోతే ఇతర సంక్షేమ పథకాల గురించో కాకపోవచ్చును. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా, రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల గురించే కావచ్చును. కానీ, దేశ వ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రణాళికలో ప్రకటిస్తున్న జనాకర్షక పథకాలను , ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎన్వీరమణ. ‘చట్ట వ్యతిరేక’ వ్యవహారంగా పేర్కొన్నారు.ఉచిత హామీలతో ఎన్నికలు ప్రభావితమవడమే కాకుండా, ఎన్నికల్లో పారదర్శకత కూడా లోపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు 

ఎన్నికలకు ముందు ప్రజానిధులతో ఉచిత తాయిలాలు పంచిపెడుతూ, ఉచిత హామీలిస్తున్న పార్టీల ఎన్నికల గుర్తును స్తంభింప చేయాలని, రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని బీజపీ నేత, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయవాదులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్  హిమాకోహ్లితో కూడిన ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్, కేంద్రంపై సుప్రీంకోర్టుపై ఆగ్రహం వ్యక్తపరిచింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉచిత హామీలు తీవ్రమైన అంశమని పేర్కొంటూ నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈసీ, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ, “ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఎలా అదుపు చేయాలో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లోపే ఇది చేయగలమా? వచ్చే ఎన్నికలకు చేయగలమా? ఇది చాలా తీవ్రమైన అంశం. ఉచిత హామీల బడ్జెట్ రెగ్యులర్ బడ్జెట్‌ను మించిపోతోంది'' అని పేర్కొన్నారు. 

ఓటర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందటం కోసం అనుసరిస్తున్న జనాకర్షణ విధానాలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, దీనిపై నిషేధం విధించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఇంత చేసి తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.నిజానికి, ఇప్పటి నుంచి నాలుగు వారాలకు అంటే ఐదు  రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరాఖరి ఘట్టానికి  చేరుకుంతుంది. ఇక ఆ దశలో సుప్రీం కోర్టు ఎంత కఠిన తీర్పు ఇచ్చినా అమలవడం అనుమానమే. అదీగాక అప్పటికైనా తీర్పు వస్తుందని ఆశించలేము. అందుకే, ఇలాంటి విషయాల్లో రోజువారీ విచారణ చేపట్టి అయినా శీఘ్రంగా తీర్పు వెలువరించాలని అంటున్నారు. 

అదొకటి అలా ఉంటే, ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు. చాలా కాలంగా, ‘ఎన్నికల తాయిలాల’ పై చర్చ జరుగుతూనే వుంది. అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఉచిత హామీలివ్వడంపై 2013లోనే సుబ్రహ్మణ్యం బాలాజీ కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయం కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గుర్తు చేశారు. అంటే, ఉచిత వరాలు ఎంత ప్రమాదకరంగా పరిణమించాయని న్యాయస్థానం భావిస్తోందో వేరేచెప్ప నక్కర లేదు.  

అయినా, ఎన్నిక ఎన్నికకు ఉచిత వరాల వరద పెరుగుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వం అయితే, అదుపు తప్పి అప్పులు చేసి మరీ ఉచిత పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఉన్నదే అందుకు అన్నట్లుగా వ్యవహరించి, పేదలను పేదలుగా ఉంచేందుకు, ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకునేందుకు నిరంతర ప్రయత్నం సాగిస్తోంది. అనకూడదో ఏమో కానీ, ప్రజలను  బిచ్చగాళ్ళుగా మార్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం  ప్రయత్నిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కాగా పిటీషనర్ న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తమ పిటీషన్’లో ఇలాంటి ఉచిత హామీలను గతంలోనూ కోర్టు ఎన్నో చూసిందని, కేవలం ఎన్నికల్లో గెలుపు కోసమే రాజకీయ పార్టీలు ఎన్నెన్నో ఉచిత హామీలను ఇస్తున్నాయని తెలిపారు. ఉచిత హామీల కారణంగా రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని పిటిషనర్ తెలిపారు. దీంతో రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరిపై రూ.3 లక్షల రుణభారం పడిందని చెప్పారు.అయితే, ప్రజలలో మార్పు రాకుండా, న్యాయస్థానాల తీర్పుల  వల్లనో , ప్రభుత్వ చట్టాల వల్లనో ప్రయోజనం ఆశించలేమని విశ్లేషకులు అంటున్నారు.
 

By
en-us Political News

  
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.