రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యం కొనసాగేనా ...?

Publish Date:Apr 18, 2012

Advertisement

కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగుతుందనే విషయాన్నీ ఎట్టకేలకు ఆ సామాజికవర్గ నేతలు అంగీకరించడం ఇతర సామాజికవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ కారణంగా కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజికవర్గం ప్రాధాన్యత తగ్గిపోతుందని కొంతమంది రెడ్డి సామాజికవర్గ నేతలు భావిస్తుండగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి "రెడ్డి'' అయివుండి కూడా తన సత్తాచూపలేక పోతున్నారని మరికొంతమంది రెడ్డి నేతల ఆవేదన. ఈ రెండు వ్యాఖ్యానాలు వేరువేరుగా అనిపించినా అంతర్గత ఉద్దేశ్యం మాత్రం ఒకటే.

రాష్ట్రంలో ఎప్పటికీ రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగాలన్నదే రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గ లక్ష్యంగా కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి రావడం జరుగుతుందో లేదో ... కానీ జగన్ పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణంగా రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతుందనే ప్రచారాన్ని కొంతమంది రెడ్డి సామాజికవర్గ నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా రాజకీయ పార్టీ లేకపోయినా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అని పెరువుంది. 1956 సంవత్సరం నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఘనత రెడ్డి సామాజికవర్గ నేతలదే.

ఈ స్థితిలో అధికారంలోకి వస్తుందో రాదో నిర్థారణ కాని పార్టీ జగన్ పార్టీ కోసం రెడ్డి సామాజికవర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం కావడం ఇష్టంలేని ఆ సామాజికవర్గానికి చెందిన జెసి దివాకర్ రెడ్డి, వీరశివారెడ్డి వంటి నేతలు అసలు జగన్ "రెడ్డి'' సామాజికవర్గానికి చెందిన నాయకుడు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.

క్రైస్తవ మతంలో కులాలు లేవని, అందువల్ల తాతల తండ్రుల కాలం నుంచి క్రైస్తావునిగా వున్న జగన్ రెడ్డి సామాజికవర్గానికి చెందడని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ సంగతి పక్కన పెడదాం ... ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సామాజికవర్గానికి చెందినవాడు ... ఆ సామాజికవర్గ ప్రాధాన్యత నిలపాల్సిన బాధ్యతా ఆయనదే అన్నట్టుగా మాజీమంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ను దూరం చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తద్వారా రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం కొనసాగించాలన్న తలంపు వీరశివారెడ్డిలో కనిపిస్తుండగా, ప్రస్తుతం వున్న రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై వుందన్న భావనలో జీవన్ రెడ్డి మాటల్లో అర్థం అవుతుంది.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.