రాయదుర్గం భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతంటే?

Publish Date:Aug 21, 2026

Advertisement

 

రాయదుర్గంలోని భూముల ధరలు మరోసారి రికార్డు సృష్టించాయి. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ-వేలంలో ప్లాట్ నంబర్‌ పీ1 ఎకరా రూ.264 కోట్ల రికార్డు ధర పలికింది. హైదరాబాద్‌లో ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధరగా నిలిచింది. మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి రూ.1,386 కోట్ల ఆదాయం సమకూరింది. రాయదుర్గంలోని పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.175 కోట్ల రిజర్వ్ ధర నిర్ణయించారు. అయితే, పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు రూ.264 కోట్ల ధర పలికింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51 శాతం అధికమని అధికారులు చెబుతున్నారు. 

హైదరాబాద్‌పై ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఈ వేలం ఫలితం స్పష్టం చేస్తోందని అధికారులు పేర్కొన్నారు. రాయదుర్గంలో భూముల విలువ వేగంగా పెరుగుతున్నదానికి ఈ వేలం మరో ఉదాహరణగా నిలిచిందని స్పష్టం చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో టీజీఐఐసీ గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.237 కోట్లు పలికింది. కేవలం మూడు నెలల్లోనే ఆ రికార్డును అధిగమిస్తూ ఇప్పుడు పీ1 ప్లాట్‌కు ఎకరాకు రూ.264 కోట్ల ధర రావడం విశేషం. హైదరాబాద్‌లోని కీలక వ్యాపార ప్రాంతాలు, మౌలిక సదుపాయాలపై పెట్టుబడిదారుల ఆసక్తి మరింత పెరుగుతున్నదానికి ఇది నిదర్శనమని భావిస్తున్నారు.

ఎంఎస్‌టీసీ ఈ-ఆక్షన్ వేదిక ద్వారా పూర్తి పారదర్శకంగా వేలం నిర్వహించారు. ప్రముఖ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్‌ఎల్‌ ప్రత్యేక ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా వ్యవహరించింది. జాతీయ స్థాయి ప్రముఖ డెవలపర్లు పోటీలో పాల్గొనడంతో వేలం అత్యంత పోటీతత్వంతో సాగింది. ఈ సందర్భంగా టీజీఐఐసీ వైస్ చైర్మన్‌, మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ మాట్లాడుతూ.. పీ1 ప్లాట్ వేలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్‌లకున్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ఇది కేవలం భూమికి మంచి ధర రావడం మాత్రమే కాదని, పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి లభించిన గుర్తింపు అని చెప్పుకొచ్చారు. 

హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార, పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతున్నదని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. ఈ విజయానికి సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు అందిస్తున్న దూరదృష్టితో కూడిన నాయకత్వమే కారణమని టీజీఐఐసీ కృతజ్ఞతలు తెలిపింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తోందని పేర్కొంది. ఈ ఫలితాలతో హైదరాబాద్ దేశంలోని అగ్రశ్రేణి పెట్టుబడి కేంద్రాల సరసన మరింత బలంగా నిలిచిందని తెలిపింది.

Rayadurgam, TGIIC, CM Revanth reddy, Minister D. Sridhar Babu, Director K. Shashanka 
 

By
en-us Political News

  
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
చెప్పాల్సింది నిన్ననే పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చెప్పాను..!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు ఆరోపించారు.
రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో పాటు ప్రభుత్వానికి బియ్యం అప్పగించకుండా బకాయి పడిన మిల్లర్లపై కఠిన చర్యలకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.