సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక బీజేపీ కుట్ర : వీ.హెచ్
Publish Date:Aug 21, 2026
Advertisement
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతి లభించకపోవడం వెనుక బీజేపీ నేతల కుట్రలు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వీ.హనుమంతరావు ఆరోపించారు. శుక్రవారం బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న ‘వికసిత్ భారత్’లో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం కాకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని వి.హెచ్. ఆరోపించారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని మెజారిటీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరగాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యానికి అనుగుణంగా పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని వి.హనుమంతరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో ఓబీసీ జనాభా వివరాలను నమోదు చేయకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం జనాభా లెక్కలు కీలకమని, ఓబీసీలకు వారి జనాభా ప్రాతిపదికన హక్కులు, అవకాశాలు దక్కాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC)లో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 25న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓబీసీ మహాసభ నిర్వహించనున్నట్లు వి.హనుమంతరావు వెల్లడించారు. ఈ మహాసభ ద్వారా బీసీల హక్కులు, జనాభా దామాషా ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. BJP conspiracy behind CM cancellation of US visit, V. Hanumantha Rao, CWC, Mahabubnagar District, PM MODI, CM Revanth reddy
http://www.teluguone.com/news/content/bjp-conspiracy-behind-cm-cancellation-of-us-visit-24-229498.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.





