కొత్త జిల్లాలు వస్తే.. కొత్త వెలుగులొస్తాయా?

Publish Date:Jan 28, 2022

Advertisement

ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన ఒకటే, చర్చ. జిల్లాల పునర్విభజన. కాదంటే ఉద్యోగుల సమ్మె. నిజానికి, ఈ రెండు వేర్వేరు విషయాలు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న తప్పుడు అడుగులకు పుణ్యమే, ఈ రెండు సమస్యలు. పీఆర్సీ మంటలను చల్లార్చేందుకు, వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చింది’ అన్నట్లు, ఉద్యోగుల పీఆర్సీ సమస్యకు వేసిన జిల్లాల విభజన మందు వికటించింది. పీఆర్సీ సమస్య చల్లారలేదు. కానీ కొత్త జిల్లాల సమస్య నెత్తినెక్కి కూర్చుంది. సర్కార్ చిక్కులో చిక్కుంకుంది. ఒక విధంగ జనంలో నవ్వుల పాలవుతోంది.    
 

అదలా ఉంచి, విషయంలోకి వస్తే, జిల్లాల సంఖ్యను పెంచడం వలన చేత, ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? అని ఆలోచిస్తే, సామన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చును కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొంచెం చాలా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ బేహారులకు కూడా కొంచెం ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చును. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ విషయమే తీసుకుంటే, ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 చేస్తే, తెలంగాణలో పాత 10 జిల్లాను,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసేఆర్, ‘బంగారు’ తెలంగాణ స్కీములో  భాగంగా  ఏకంగా 33 జిల్లాలను చేశారు.
 

ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, ‘ముందు’  చూపుతో పది జిల్లాలను 33 జిల్లాలు చేశారు  కాబట్టే, 33 మందికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. అలాగే, రాజకీయ బేహారులకు, అటు రాజకీయ పదవులు , అటు నామినేటెడ్ పదవులు మరిన్ని దక్కుతాయి. భవన నిర్మాణాలు చేపట్టడం వలన, మేఘా వంటి మేడి పండు కంపెనీలకు ఏమైనా మేలు జరిగిదేమో కానీ, జనాలకు అయితే ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అంటున్నారు. మహా అయితే, ప్రయాణ ఖర్చులు పది రూపాయలు ఏమైనా మిగిలితే మిగిలాయి ఏమో కానీ, అంతకు మించి ప్రయోజనం ఏమీలేదని సామాన్యులు అంటున్నారు.
 

తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత కొత్త కలెక్టరేట్’లు, కొత్త ఎస్పీ ఆఫీసులు సహా ఇతర కార్యాలయాలన్నీ ఆయా కేంద్రాల్లో ఏర్పాటయ్యాయి. ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాల కల్పన జరగలేదు. జిల్లాలతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతోంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కానీ, తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పెను దుమరాన్నే సృష్టించాయి. కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ఇలా ఎలా చూసినా, తెలంగాణలో జిల్లాలు పెరిగినా అభివృద్ధి జరగలేదు. ఆత్మహత్యలు ఆగలేదు.


ఇక ఏపీలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నామని సర్కార్ సారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. కానీ, జరిగేది మాత్రం వేరుగానే ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. తెలంగాణలో ఏమి జరుగిందో, ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇప్పటికే ఒక అనాలోచిత నిర్ణయంతో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో జీతాల భారం పెరిగి, చివరకు జీతాలు ఇవ్వలేని స్థితికి పరిస్థితి దిగజారింది.  ఇలాంటి పరిస్థితుల్లో పాలనా సౌలభ్యం కోసం అంటూ కొత్త భారాన్ని నెత్తికి ఎత్తుకోవడం అవసరమా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తెలంగాణను చూసి ఏపీ వాతలు పెట్టుకోవడం అవసరమా? అసలు, ఈరోజు కార్యాలయాలకు వెళ్లి పనులు చేసుకోవలసిన అవసరమే తగ్గిపోతున్నప్పుడు, పరిపాలనా సౌలభ్యం కోసం భారం పెంచుకోవడం, వివేకం అనిపించుకుంటుందా?ఆ పెట్టే ఖర్చేదో, సాంకేతిక సదుపాయలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగించుకుంటే, పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది, అవినీతి కూడా అంతో ఇంతో తక్కుతుందని, ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచిస్తే ఉభయతారకంగా ఉంటుందని అంటున్నారు.

 

By
en-us Political News

  
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.