కాంగ్రెస్ భవిష్యత్తుకు సవాల్ గా మారిన కడప ఉన ఎన్నికలు?

Publish Date:May 16, 2012

Advertisement

మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కడప ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ జిల్లాలోని రాజంపేట, రాయచోటి అసెంబ్లీస్థానాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటిదాకా పెత్తనం చేసిన ప్రధాన నేతలు పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఇక్కడి కేడర్ ను ఉత్తేజపరిచే విషయంలో శ్రద్ధచూపుతున్నారు.

 

 

 

వై.ఎస్.ఆర్. సొంత జిల్లా అయినందున ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, జగన్ లపై దాని ప్రభావముంటుంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్ సరైన వ్యూహం రచించారని అభినందనలు అందుకున్నారు. ఈ అభినందనలు కాంగ్రెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఇటీవల జరిగిన సర్వేలు కూడా జగన్ కు అనుకూలంగా రావటంతో ఈ జిల్లా పరిస్థితిపై ఎఐసిసి తన గూఢచారులను పెట్టుకుంది.

 

 

 

తమ పార్టీ రాష్ట్రనేతలు చేసే ప్రసంగాలు ఏమైనా ఓట్లగా మలచుకోవటానికి ఉపయోగపడతాయా? లేదా? అన్న కోణం లో ఎఐసిసి పరిశీలిస్తోంది. దీంతో రాష్ట్ర నేతలు కూడా కడపజిల్లా ఎన్నికల్లో విజయం కోసం చేయాల్సిన పని ఏమిటని ప్రశ్నించి కార్యకర్తలకు వరాలను ఇస్తున్నారు. ఈ వరాలు కూడా తమకు ఓట్లను తెచ్చిపెడతాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అలానే మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ జూన్ 15 తరువాత అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. సిఎం పర్యటనకు ముందుగానే ఈ జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. జగన్ వక్రీకరించినా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని సిఎం కిరణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇలా కడపజిల్లాలో ఓటర్లను ఆకర్షించి తమ హోదాలను కొనసాగించేందుకు వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో భవిష్యత్తులోనే తేలుతుంది.

By
en-us Political News

  
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.