కాంగ్రెస్ భవిష్యత్తుకు సవాల్ గా మారిన కడప ఉన ఎన్నికలు?
Publish Date:May 16, 2012
Advertisement
మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు కడప ఉప ఎన్నికలు సవాల్ గా మారాయి. ఈ జిల్లాలోని రాజంపేట, రాయచోటి అసెంబ్లీస్థానాలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవకపోతే ఆ పార్టీ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. ఇప్పటిదాకా పెత్తనం చేసిన ప్రధాన నేతలు పదవులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా ఇక్కడి కేడర్ ను ఉత్తేజపరిచే విషయంలో శ్రద్ధచూపుతున్నారు. వై.ఎస్.ఆర్. సొంత జిల్లా అయినందున ఇక్కడ కనుక కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, జగన్ లపై దాని ప్రభావముంటుంది. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జగన్ సరైన వ్యూహం రచించారని అభినందనలు అందుకున్నారు. ఈ అభినందనలు కాంగ్రెస్ లో ప్రకంపనాలు సృష్టించింది. ఇటీవల జరిగిన సర్వేలు కూడా జగన్ కు అనుకూలంగా రావటంతో ఈ జిల్లా పరిస్థితిపై ఎఐసిసి తన గూఢచారులను పెట్టుకుంది. తమ పార్టీ రాష్ట్రనేతలు చేసే ప్రసంగాలు ఏమైనా ఓట్లగా మలచుకోవటానికి ఉపయోగపడతాయా? లేదా? అన్న కోణం లో ఎఐసిసి పరిశీలిస్తోంది. దీంతో రాష్ట్ర నేతలు కూడా కడపజిల్లా ఎన్నికల్లో విజయం కోసం చేయాల్సిన పని ఏమిటని ప్రశ్నించి కార్యకర్తలకు వరాలను ఇస్తున్నారు. ఈ వరాలు కూడా తమకు ఓట్లను తెచ్చిపెడతాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అలానే మంత్రి సి. రామచంద్రయ్య మాట్లాడుతూ జూన్ 15 తరువాత అన్నిరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఓటర్లకు భరోసా ఇచ్చారు. సిఎం పర్యటనకు ముందుగానే ఈ జిల్లాకు వచ్చిన పీసీసీ చీఫ్ బొత్సా సత్యన్నారాయణ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు. జగన్ వక్రీకరించినా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని సిఎం కిరణ్ కుమార్ పునరుద్ఘాటించారు. ఇలా కడపజిల్లాలో ఓటర్లను ఆకర్షించి తమ హోదాలను కొనసాగించేందుకు వారు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు సఫలీకృతమవుతాయో భవిష్యత్తులోనే తేలుతుంది.
http://www.teluguone.com/news/content/prestegious-issue-for-congress-party-in-cuddapah-24-14080.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





