తిరుపతి లడ్డూ దక్కేదక్కేదెవరికో?
Publish Date:May 16, 2012
Advertisement
తిరుమల ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రాని సందర్శించాలంటే ముందు తిరుపతికి చేరుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సందర్శకుల విషయంలో రోమ్ తో పోటీ పడే తిరుపతి అసెంబ్లీకి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ తామే గెలుపొందాలని ప్రధానపార్తీలు పట్టుదలగా ఉన్నాయి. గెలుపు ఆరాటం ఎక్కువయి ఏదైనా చేయండి ఇక్కడ మనం తప్పక విజయం సాధించాలంతే అనే స్థాయికి ఆ పార్టీల నేతలు వచ్చి కార్యకర్తలను ప్రాధేయపడుతున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇదే డైలాగ్ వేసి కాంగ్రెస్ కార్యకర్తలను ఆశ్చర్యపరిచారు. కడపజిల్లాలో తన పర్యటన ముగించుకుని వచ్చిన తరుఅవత సిఎం కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణతోనూ, ముఖ్యకార్యకర్తలతోనూ మాట్లాడారు. అలానే మున్సిపల్ ఛైర్మన్ కందాటి శంకరరెడ్డి గురించి తాను చూసుకుంటానని సిఎం హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 262 పోలింగ్ బూత్ లున్నాయి. తెలుగుదేశం పార్టీ బూత్ ల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి ఎన్నికలకు సిద్ధమవుతోంది. అలానే ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహాదేవ నాయుడు నియోజకవర్గంలో ప్రచారపరిస్థితి, పార్టీ విజయావకాశాలు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు తిరుపతి చేరుకున్నారు. తాను ఎన్నికల తరువాతే తిరిగి వేదతానని ఆయన అంటున్నారు. ఈ పార్టీ అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తి ఉదయమే లేచి వాకింగ్ కు వెళుతూ తోటి వాకర్లను ఓట్లు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అలానే వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కూడా సంఘాలు, అసోషియేషన్లను టార్గెట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి కందాటి మురళి కూడా ప్రచారంలో ఉన్నారు. తనను గెలిపిస్తే కార్మిక, ఉద్యోగం మహిళా సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని ఈయన తన ప్రచారంలో భాగంగా హామీ ఇస్తున్నారు. ఇలా ప్రతీ పార్టీ తమ గెలుపుకోసం ఒకవైపు కార్యకర్తలను సమీకరించుకోవటం, మండుటెండలోనూ ఆపకుండా ఇంటింటికి తిరగటం, ప్రత్యేకించి సమస్యల పరిష్కారాల హామీలు వుప్పించటం చూస్తుంటే తిరుపతి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు పార్టీలకు ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పకుండానే అర్థం అవుతోంది.
http://www.teluguone.com/news/content/famous-piligrim-tirupathi-24-14079.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





