Publish Date:Aug 23, 2012
తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు పాన్ నెంబర్ ఇస్తున్నారా..? కాస్త ఆలోచించండి! మీ పాన్ నెంబర్ ని ఎవరైనా అక్రమంగా వినియోగించుకునే ప్రమాదం ఉంది.. ఎలా అంటారా..? టిక్కెట్ కోసం ఇచ్చిన పాన్ నెంబర్ ని రైల్వే శాఖ బోగీమీద అంటించే చార్ట్ లో పేరుపక్కన ముద్రించడం వల్ల.. ఎవరుపడితేవాళ్లు పరాయి పాన్ నెంబర్లను కొట్టేస్తున్నారు. వాటిని ఎక్కడపడితే అక్కడ కోట్ చేసి పబ్బం గడిపేసుకుంటున్నారు.
ముఖ్యంగా నగల వ్యాపారులకు దో నెంబర్ దందాకోసం పరాయివాళ్ల పాన్ నెంబర్లు విరివిగా అవసరమౌతున్నాయట. తాజాగా కొందరు ఇలా బోగీమీద చార్ట్ లో ఉన్న నెంబర్లను సేకరిస్తుండగా కొందరు ప్రయాణికులు చూసి పట్టుకున్నారు. గట్టిగా నాలుగు తగిలించి ఆరాతీస్తే అసలు బండారం బైటపడింది. రెండు లక్షల రూపాయలకంటే ఎక్కువ మొత్తం చెల్లించి నగలు కొనుక్కునేవాళ్ల దగ్గర్నుంచి
కొత్త ఫైనాన్స్ చట్టం ప్రకారం వ్యాపారులు పన్నును సేకరించాలి. అలా జరక్కుండా ఉండాలంటే ప్రతిసారీ మరో కొత్త పాన్ నెంబర్ని కోట్ చేయడమే మార్గమని చాలామంది వ్యాపారులు భావిస్తున్నారు.
దో నెంబర్ దందా చేసే బంగారం వ్యాపారులు ఇలా సేకరించి ఇచ్చిన పాన్ నెంబర్లకు ఒక్కోదానికీ పదేసి రూపాయల చొప్పున చెల్లించి అడ్డదారిలో సేకరించి విచ్చలవిడిగా తమ అవసరాలకోసం వాడుకుంటున్న విషయం బైటపడింది. రైలు టిక్కెట్టుమాట దేవుడెరుగు.. మరొకరెవరైనా పాన్ నెంబర్ ని అడ్డదారిలో వాడుకుంటే లేనిపోని తిప్పలు ఎదురౌతాయేమోనని చాలామంది ప్రయాణికులు భయపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pan-numbers-theft-24-16794.html
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి
కాంగ్రెస్ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!