వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ లో మహానేత వై.ఎస్.ఆర్. లేరా?
Publish Date:May 17, 2012
Advertisement
సిబీఐ దర్యాప్తులో ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి ఇప్పుడు మరో కొత్త సమయ వచ్చింది. జగన్మోహనరెడ్డి ఎప్పుడూ తండ్రి మాట వినలేదనీ, ఆయనంటే గౌరవం లేదనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేపదే విమర్శిస్తున్నారు. జగన్మోహనరెడ్డికి తండ్రి అంటే గౌరవం లేదు కనుకనే పార్టీకి కూడా ఆయన పేరు పెట్టలేదనీ వారంటున్నారు. ఈ వాదన కొంత విచిత్రంగా ఉంది. కానీ, ఎన్నికల కమీషన్ వద్ద నమోదైన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పేరు పరిశీలిస్తే ఈ వాదనలో నిజముందని తేలుతోంది. నిజానికి రాష్ట్ర ప్రజలందరూ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అంటే వై.ఎస్. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ అనే భావిస్తున్నారు. కానీ, ఎన్నికల సంఘం వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ ప్రకారం వై.ఎస్.ఆర్. అంటే యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) పార్టీ అని ఉంది. కానీ, ఈ విషయాన్ని జగన్ ఎప్పుడూ ప్రజలకు వివరించడానికి ప్రయత్నించలేదు. ప్రతీ ఎన్నికల సభలోనూ మహానేత వై.ఎస్.ఆర్. పేరిట ఏర్పాటు చేసిన తన పార్టీని ఆదరించాలని జగన్ కోరుకున్నారు. అయితే ఈ పార్టీకి దివంగత వై.ఎస్.ఆర్. కు ఎటువంటి సంబంధంలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. జగన్మోహనరెడ్డికి నిజంగా తండ్రిపై ప్రేమ ఉంటే ఆయన పేరునే పార్టీకి పెట్టేవారని కాంగ్రెస్ నాయకులు వాదిస్తున్నారు. అయితే వ్యక్తుల పేర్లతో పార్టీలు పెట్టడం సాధ్యం కాదు గనుక యువజన శ్రామిక రైతు (వై.ఎస్.ఆర్.) పార్టీనే పేరు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు వివరణ ఇస్తున్నారు.
http://www.teluguone.com/news/content/no-ys-rajasekhar-reddy-in-ysr-congress-24-14091.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





