కె.వి.పి. పై కన్నేసిన సిబీఐ
Publish Date:May 16, 2012
Advertisement
జగన్ అక్రమాస్తుల కేసులో సిబీఐ తరువాతి టార్గెట్ కె.వి.పి. రామచంద్రారావేనని తెలుస్తోంది. వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆత్మలాంటి కె.వి.పి. అప్పట్లో జరిగిన ముడుపుల భాగోతాల్లో ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు సిబీఐ ఇలాంటి కీలకమైన వ్యక్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన కొందరు లాయర్లు సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలుసుకుని కె.వి.పి.కి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న ఆధారాలు అందజేశారు. అంతేకాక ఆయనను విచారణకు పిలవాలని, అలా పిలవకపోతే ఈ దర్యాప్తుకు అర్థం లేదని కూడా అన్నారు. దీనికి లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ కేసులో నిందితులెవరినీ విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు. కె.వి.పి. గురించి ప్రస్తావిస్తూ సమీప భవిష్యత్ లో ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిపారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ ను అరెస్ట్ చేసే ముందు కె.వి.పి. రామచంద్రారావును విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.వి.పి. రామచంద్రారావు ముఖ్యమైన ఫైళ్ళను పరిశీలించేవారు. ఆయన పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాటికి మోక్షం లభించేది. దీనికి తోడు వై.ఎస్. లావాదేవీలన్నీ కె.వి.పి. రామచంద్రారావు స్వయంగా పరిశీలించేవారు. ఇలాంటి కీలకమైన వ్యక్తిని విచారించకుండా వదిలేస్తే లేనిపోని అపవాదులు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని, అందువల్ల ఆయన్ను కూడా విచారించాలని సిబీఐ భావిస్తున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/cbi-next-target-kvp-ramachandra-rao-24-14090.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





