కె.వి.పి. పై కన్నేసిన సిబీఐ

Publish Date:May 16, 2012

Advertisement

జగన్ అక్రమాస్తుల కేసులో సిబీఐ తరువాతి టార్గెట్ కె.వి.పి. రామచంద్రారావేనని తెలుస్తోంది. వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆత్మలాంటి కె.వి.పి. అప్పట్లో జరిగిన ముడుపుల భాగోతాల్లో ప్రధాన పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు సిబీఐ ఇలాంటి కీలకమైన వ్యక్తి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణా రాష్ట్ర సమితికి చెందిన కొందరు లాయర్లు సిబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణను కలుసుకుని కె.వి.పి.కి వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న ఆధారాలు అందజేశారు. అంతేకాక ఆయనను విచారణకు పిలవాలని, అలా పిలవకపోతే ఈ దర్యాప్తుకు అర్థం లేదని కూడా అన్నారు. దీనికి లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ కేసులో నిందితులెవరినీ విడిచిపెట్టబోమని హామీ ఇచ్చారు. కె.వి.పి. గురించి ప్రస్తావిస్తూ సమీప భవిష్యత్ లో ఆయనను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలిపారు.

 

అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడైన జగన్ ను అరెస్ట్ చేసే ముందు కె.వి.పి. రామచంద్రారావును విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వై.ఎస్. హయాంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.వి.పి. రామచంద్రారావు ముఖ్యమైన ఫైళ్ళను పరిశీలించేవారు. ఆయన పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే వాటికి మోక్షం లభించేది. దీనికి తోడు వై.ఎస్. లావాదేవీలన్నీ కె.వి.పి. రామచంద్రారావు స్వయంగా పరిశీలించేవారు. ఇలాంటి కీలకమైన వ్యక్తిని విచారించకుండా వదిలేస్తే లేనిపోని అపవాదులు కూడా ఎదుర్కోవలసి ఉంటుందని, అందువల్ల ఆయన్ను కూడా విచారించాలని సిబీఐ భావిస్తున్నట్లు తెలిసింది.

By
en-us Political News

  
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
ఢిల్లీలో వైఎస్సార్ అవార్డ్స్‌ 2026 కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి..!
తుక్కుగూడలో నర్సుపై అత్యాచారం, హత్య ఘటనను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది.
కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్‌ విధానాన్ని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆర్మీ స్కూల్స్ లకు సెలవులు ఇవ్వాలని ఆదేశాలు..!
ఈజీ మనీ కోసం అడ్డదారి పట్టిన ముగ్గురు యువకులు ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకు తెరలేపారు.
గంజాయి మత్తులో ఆనంద్ సాయి కొడుకు వీడియో వైరల్..!
కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!
జీహెచ్‌ఎంసీ కఠిన ఆదేశాలు వెనక అసలు కారణం ఇదే..!
వంద రోజుల్లో స్వర్గం అన్నారు.. వెయ్యి రోజులు నరకం చూపించారు..!
తెల్లకోటు మాటున నకిలీ వైద్యం..ఐదుగురు ఫేక్ డాక్టర్లు అరెస్ట్‌..!
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.