అయ్యో పాపం.. కేబినెట్ విస్తరణ లేనట్లే.. జగనన్నా మజాకా..

Publish Date:Jan 25, 2022

Advertisement

ఇదిగో అదిగో అంటుండగానే పుణ్యకాలం కాస్తా కరిగిపోతోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టు కున్న ఎమ్మెల్యేల ఆశలు అడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పునరుద్దరణ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన వార్తలు వచ్చినట్లే వెనక్కి వెళ్లి పోతున్నాయి.ఇలా తళుక్కుమని, ఆశావహులను ఒకింత మురిపించి మాయమై పోతున్నాయి. 

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం 2019లో జూన్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఎనౌన్స్ చేశారు. రెండున్నరేళ్ళ తర్వాత మొత్తానికి మొత్తంగా మంత్రివర్గాన్ని తీసేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అయినా, మంత్రివర్గ విస్తరణ గురించి ఉలుకు పలుకూ లేదు. అయితే ఒకసారి కొత్త మంత్రివర్గం కూర్పుకు సంబంధించి కసరత్తు మొదలైందని. ముఖ్యమంత్రి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారని, ఇంకొకసారి మంత్రుల కోరికపై ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారని, ఇలా వార్తలైతే వస్తున్నాయి కానీ, అసలు ముహూర్తం మాత్రం రావడం లేదు. ఈ లోగా ఆశావహులు గుళ్ళో గోపురాల చుట్టూ తిరుగుతూ,జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. పూజలు చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పట్లో మంత్రి వర్గవిస్తరణ ఉండదు. అసలే ఉండక పోవచ్చును, ఉన్నా, చిన్న చిన్న మార్పులు చేర్పులే కానీ, పూర్తి స్థాయి పక్షాలన మాత్రం ఉండదని తెలుస్తోంది.   

ఏపీ కథ అలా ఉంటే, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కంటే ముందస్తు ఎన్నికల ముచ్చట ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ కింగ్, అంత వరకు ఆయనకు ఎదురన్నదే లేదు. అందుకే 2018లో ముందస్తుకు వెళ్లి, అదే ఊపులో సారూ .. కారూ .. పదహారు ..ఢిల్లీ సర్కారు వ్యూహంతో 2019 లోక్ సభ ఎన్నికలకు వెళ్ళారు. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణం వస్తే, రాష్ట్రాన్ని కేటీఆర్’కు అప్పగించి  తాను కేంద్రంలో చంక్రం తిప్పాలని కేసీఆర్ స్కెచ్ సిద్దం చేసుకున్నారు. అయితే, అక్కడ కథ అడ్డం తిరిగింది. కేంద్రంలో  సంకీర్ణం రాలేదు. బీజేపీ సొంత సీట్ల సంఖ్యే మ్యాజిక్ ఫిగర్ (272) దాటి 303 కు చేరింది. ఎన్డీఎ ఫిగర్ 350 క్రాస్ చేసింది. మరోవంక రాష్ట్రంలో కారును బ్రేకు పడింది. కారు టైరుకు పక్చరైంది. కారు పదహారు కల బేజారైంది. నెంబరు 9కి  చేరింది.బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు సీట్లు ఎగరేసుకు పోయాయి. చివరకు సొంత బిడ్డ కవిత కూడా ఓడి పోయారు. ఇక అక్కడి నుంచి కేసీఆర్ లెక్క తప్పుతూ వస్తోంది.

అయినా, కారణాలు వేరైనా కేటీఆర్ పట్టాభిషేకం చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కేటీఆర్ పట్టాభిషేకం మాట ఎలా ఉన్నా, అందుకోసం చేసే ప్రతి ప్రయత్నం బెడిసి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మరో వంక హుజూరాబాద్ పరాభవం తర్వాత ప్రజల్లో  ప్రభుత్వం పట్ల వ్యతిరేక పెరుగుతోంది. లెక్కలు తప్పుతున్నాయి. పార్టీలోనూ, చాప కింద నీరు చేరుతున్నది. తడి తగులుతోంది. కాళ్ళకింద నెల కదులుతోది. బుజ్జగింపులు తప్పడం లేదు.

అందుకే, మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత జంకు తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడా ఆలోచన అటక ఎక్కిందనీ అంటున్నారు. అలాగే, ఈసారి కూడా ముఖ్యంత్రి ముదస్తుకు పోతారన్న ఊహాగానాలు వినవస్తునాయి.  ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.అదే నిజమైతే కేసీఆర్ ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఉంటుంది సన్నిహిత వర్గాల తాజా  సమాచారం. ఈ నేపద్యంలో, మార్చి 10న యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే, మత్రివర్గ విస్తరణ కానీ,మరో నిర్ణయం గానీ ఉంటుందని, అంతవరకు, అంతా గప్ చిప్ .. అంటున్నారు.

By
en-us Political News

  
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ కేవలం 31 లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలైందని, అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్య దీనికంటే ఎంతో ఎక్కువగా ఉందని చెప్పిన జగన్.. అలాగే.. తమిళనాడులో డీఎంకే కూటమి 17 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, అక్కడ కూడా 74 లక్షల ఓట్లను తొలగించడం ద్వారా ఫలితాలు తారుమారయ్యేలా చేశారని ఎత్తి చూపారు. . ఈ భారీ ఓట్ల తొలగింపు ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసిందని జగన్ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.