అమెరికాలో మాజీ ప్రియురాలి హత్య.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్..!
Publish Date:Aug 28, 2026
Advertisement
8 నెలల తర్వాత మర్డర్ కేసులో పురోగతి..! అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ(27)ను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్లో నిఖిత హత్య అనంతరం భారత్కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శర్మ.. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 24న అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.అమెరికా దర్యాప్తు సంస్థల అభియోగాల ప్రకారం నిఖిత, అర్జున్ శర్మ గతంలో సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. 2025 డిసెంబర్ 31న నిఖితను తన అపార్ట్మెంట్కు శర్మ పిలిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన వద్ద ఉన్న 4 వేల డాలర్లను తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను అపార్ట్మెంట్కు రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నిఖిత హత్యకు గురైనట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. నిఖిత మరణం వెనుక ఆర్థిక వివాదం ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్లు, బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు వినియోగం తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. భారత్, అమెరికా దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని నిఖిత కుటుంబం డిమాండ్ చేసింది. నిఖితను 4 వేల డాలర్ల వ్యవహారంపై అపార్ట్మెంట్కు ఎందుకు పిలిచారు? ఆ తర్వాత ఏం జరిగింది? హత్య అనంతరం ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆర్థిక లావాదేవీలకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అర్జున్ శర్మను భారత్ నుంచి అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయితే ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. Nikhitha Godisha murder case, Agra, Arjun Sharma, America, Hyderabad, CP Sajjanar, CM Revanth reddy Telugu news, Telugu One
నిఖిత మృతదేహాన్ని అపార్ట్మెంట్లోని ఓ సూట్కేసులో గుర్తించినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిఖితకు చెందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు తీసుకున్నట్లు కూడా అర్జున్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఖిత హత్య వెనుక వేల డాలర్లకు సంబంధించిన ఆర్థిక వివాదం కారణమై ఉండొచ్చన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నా యి. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిఖిత హత్య అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్కు పారిపోయినట్లు అక్కడి దర్యాప్తులో తేలింది. దీంతో అతడిపై అమెరికా అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
మరోవైపు హైదరాబాద్ లోని లాలాగూడ పోలీస్ స్టేషన్లోనూ శర్మపై కేసు నమోదైంది. అతడి కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకీని గుర్తించారు. శర్మ ఆగ్రాలో ఉన్నట్లు నిర్ధారించిన తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అభ్యర్థన మేరకు నిందితుడిని అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
నిఖిత హత్య కేసులో అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హత్యతో పాటు దాడికి సంబంధించిన అభియోగాలను అమెరికా అధికారులు నమోదు చేశారు. కేసులో నిందితుడు భారత్లో పట్టుబడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అర్జున్ శర్మ అరెస్టుపై నిఖిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె హత్య కేసులో నిందితుడు పట్టుబడటం కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. అయితే నిఖిత హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, హత్యకు ముందు ఏం జరిగింది, అర్జున్ శర్మతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు తెలియలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/nikhitha-godisha-murder-case-24-230120.html





