అమెరికాలో మాజీ ప్రియురాలి హత్య.. ఆగ్రాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్..!

Publish Date:Aug 28, 2026

Advertisement

 

8 నెలల తర్వాత మర్డర్ కేసులో పురోగతి..!

అమెరికాలో తెలుగు యువతి నిఖిత గోడిశా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ(27)ను తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు. అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిఖిత హత్య అనంతరం భారత్‌కు పారిపోయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శర్మ.. ఆగ్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తలదాచుకున్నట్లు గుర్తించిన పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

ఆగస్టు 24న అతడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.అమెరికా దర్యాప్తు సంస్థల అభియోగాల ప్రకారం నిఖిత, అర్జున్ శర్మ గతంలో సన్నిహితంగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. 2025 డిసెంబర్ 31న నిఖితను తన అపార్ట్‌మెంట్‌కు శర్మ పిలిచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తన వద్ద ఉన్న 4 వేల డాలర్లను తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను అపార్ట్‌మెంట్‌కు రప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ తర్వాత నిఖిత హత్యకు గురైనట్లు అమెరికా పోలీసులు గుర్తించారు.


నిఖిత మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌లోని ఓ సూట్‌కేసులో గుర్తించినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిఖితకు చెందిన క్రెడిట్ కార్డును ఉపయోగించి డబ్బులు తీసుకున్నట్లు కూడా అర్జున్ శర్మపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిఖిత హత్య వెనుక వేల డాలర్లకు సంబంధించిన ఆర్థిక వివాదం కారణమై ఉండొచ్చన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నా యి. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నిఖిత హత్య అనంతరం అర్జున్ శర్మ అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు అక్కడి దర్యాప్తులో తేలింది. దీంతో అతడిపై అమెరికా అధికారులు కేసు నమోదు చేయడంతో పాటు ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. 


మరోవైపు హైదరాబాద్‌ లోని లాలాగూడ పోలీస్ స్టేషన్‌లోనూ శర్మపై కేసు నమోదైంది. అతడి కోసం తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆచూకీని గుర్తించారు. శర్మ ఆగ్రాలో ఉన్నట్లు నిర్ధారించిన తెలంగాణ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అభ్యర్థన మేరకు నిందితుడిని అప్పగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


నిఖిత హత్య కేసులో అర్జున్ శర్మపై ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ హత్యతో పాటు దాడికి సంబంధించిన అభియోగాలను అమెరికా అధికారులు నమోదు చేశారు. కేసులో నిందితుడు భారత్‌లో పట్టుబడటంతో దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. అర్జున్ శర్మ అరెస్టుపై నిఖిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తె హత్య కేసులో నిందితుడు పట్టుబడటం కొంత ఊరటనిచ్చిందని తెలిపారు. అయితే నిఖిత హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, హత్యకు ముందు ఏం జరిగింది, అర్జున్ శర్మతో ఆమెకు ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు తమకు తెలియలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిఖిత మరణం వెనుక ఆర్థిక వివాదం ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, బ్యాంకు లావాదేవీలు, క్రెడిట్ కార్డు వినియోగం తదితర అంశాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని వారు కోరుతున్నారు. భారత్, అమెరికా దర్యాప్తు సంస్థలు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని నిఖిత కుటుంబం డిమాండ్ చేసింది. నిఖితను 4 వేల డాలర్ల వ్యవహారంపై అపార్ట్‌మెంట్‌కు ఎందుకు పిలిచారు? ఆ తర్వాత ఏం జరిగింది? హత్య అనంతరం ఆమె క్రెడిట్ కార్డుతో డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఆర్థిక లావాదేవీలకు, హత్యకు మధ్య ఏదైనా సంబంధం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అర్జున్ శర్మను భారత్ నుంచి అమెరికాకు అప్పగించే ప్రక్రియ పూర్తయితే ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

Nikhitha Godisha murder case, Agra, Arjun Sharma,  America, Hyderabad, CP Sajjanar, CM Revanth reddy Telugu news, Telugu One

By
en-us Political News

  
తెలంగాణలో క్రైమ్ రేట్‌పై డీజీపీ సీవీ ఆనంద్ కీలక సమీక్ష..!
చిట్టీల పేరుతో సుమారు 25 మంది నుంచి రూ.5 కోట్ల వరకు వసూలు చేసి, చెల్లింపులు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని జవహర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేంద్రం బియ్యమిస్తే మీ ఫొటోలేంటి.. ధ్వజమెత్తిన ఈటల..!
రాఖీ పండుగ  సందర్భంగా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (ఆగస్టు 28) రాఖీ కట్టి ప్రత్యేకంగా ఆయనతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ భేటీ ద్వారా  వివాదానికి తెరపడినట్లేనా అన్న చర్చ జోరందుకుంది. 
హైదరాబాద్‌లో సొంతింటి కల నెరవేర్చుకోవాలని తపిస్తున్న పేద ప్రజల దశాబ్దాల నిరీక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది.
హానగరం  పర్యాటక శోభను విస్తరించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులలో మిర్ ఆలం ట్యాంక్ పునరుద్ధరణ ఒకటి. చెరువు సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని, నిర్మాణంలో ఉన్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను  పరిశీలించిన ముఖ్యమంత్రి,  అధికారులను పనుల పురోగతిపై ఆరాతీశారు.
సిగరెట్‌ కోసం బయటకు వెళ్లిన వ్యక్తి.. తెల్లారేసరికి శవమై కనిపించాడు..!
రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త దారులు వెతుకుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖకు రాఖీ పండుగ వేదికగా మారింది.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఆయన సోదరిలు రాణి, విమల రాఖీలు కట్టి   శుభాకాం క్షలు తెలిపారు.  అలాగే మంత్రి సోదరులు   అశోక్ గౌడ్, పొన్నం రవిచంద్రలకు కూడా వారు రాఖీలు కట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ఒత్తిడి కారణంగానే ఈ భేటీ జరుగుతున్నదని చెప్పాలి. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించేందుకు రేవంత్ రెడ్డి మహారాష్ట్ర,  కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపారు.  గత మే 26న మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లేఖ రాస్తూ, తుమ్మిడిహట్టి నిర్మాణంపై ఉమ్మడి చర్చలు జరిపి రెండు రాష్ట్రాలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు.
సీఎం రేవంత్‌తో లండన్ లాలూచీ.. బీజేపీతో హరీశ్ మిలాఖత్..!
యశోద ఆస్పత్రిలో గవర్నర్‌ శివప్రతాప్ శుక్లాకు విజయవంతంగా స్టెంట్ అమరిక..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.