గుంటూరు జిల్లా తెలుగుదేశంపార్టీకి మరో కొత్త సమస్య ఎదురైంది. మాజీమంత్రి మాకినేని పెదరత్తయ్యను తిరిగి తెలుగుదేశంపార్టీలోకి చేర్చుకోవాలన్న చంద్రబాబు నిర్ణయంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక మాకినేని పెదరత్తయ్యకు ప్రధాన అనుచరునిగా పేరుపొందిన కందుకూరి వీరయ్యకు ప్రత్తిపాడు అసెంబ్లీ దేశం టిక్కెట్టును కేటాయించడం పట్ల కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మాకినేని పెదరత్తయ్య ప్రత్తిపాడు నుంచి ఎన్నికై 16 సంవత్సరాల పాటు శాసనసభ్యునిగా ఉన్నారు ఈ 16 ఏళ్ళలో ఆయన నియోజకవర్గ అభివృద్ధికి పెద్దగా చేసిందేమీ లేదన్న అపవాదును ఎదుర్కొన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. 2010 ఎన్నికల్లో ఆయనకు తెలుగుదేశంపార్టీ టిక్కెట్టు లభించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మాచినేని పెదరత్తయ్య వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పగించినప్పటికీ ఎంతోకాలం ఆ పార్టీలో ఉండలేకపోయారు. తిరిగి ఆయన తెలుగుదేశంపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. దీనికి చంద్రబాబునాయుడు కూడా అంగీకారం తెలిపారు. అయితే, స్థానిక నాయకులు, కార్యకర్తలు మాకినేని పెదరత్తయ్య పునరాగమనాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన రాజకీయభవిష్యత్తు మరోసారి అగమ్యగోచరంగా తయారైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-problem-for-tdp-in-guntur-district-24-13804.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!