శ్రీకాకుళంజిల్లా నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గ్రామాల్లో కార్యకర్తల ద్వారా చాప కింద నీరులా ప్రచారం సాగిస్తున్నారు. కాలింగ, ఎస్సే సామాజికవర్గం ఓట్లపై ఆయన ప్రధానంగా దృష్టి పెట్టి పావులు కదుపుతున్నారు. ఈయన ప్రచారానికి పెద్దసంఖ్యలో కార్యకర్తల మద్దతు లభిస్తోంది.
టిడిపి అభ్యర్థి గెలుపు బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు తీసుకున్నారు. నియోజకవర్గంలో 900మందితో డెడికేటెడ్ నెట్ వర్క్ ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన కె.ప్రతిభాభారతి, తమ్మినేని సీతారాం, గౌతు శ్యామసుందర శివాజీ, అచ్చెంనాయుడు తదితరలు ప్రచార కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున ధర్మాన ప్రసాదరావు, తమ్ముడు ధర్మాన్ రాందాస్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్నికల బాధ్యతను మంత్రి ధర్మానప్రసాద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ముఖ్యమైన నాయకులను గ్రామాలకు పంపించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరిస్తున్నారు ఈ నియోజకవర్గంలో 150 పంచాయితీలకు ప్రత్యేకంగా ఇన్ ఛార్జిలను నియమించారు. ఈ మూడు పార్టీలు నసరన్నపేట ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం గట్టిగా శ్రమిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/narasannapeta-assmebly-constituency-of-srikakulam-district-24-13808.html
ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
ప్రతిపక్ష గొంతును నొక్కేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం భౌతిక దాడులు, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుల పట్ల పోలీసులు దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై పోరుబాటకు కేసీఆర్ పిలుపు ఇచ్చారు. పార్టీ నేతలు ప్రజాసమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలకు సిద్ధం కావాలన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, రైతాంగ సమస్యలపై పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
కేవలం మాటల గారడీతో ప్రజలను మోసం చేసిన గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు, తమ వెయ్యి రోజుల సంక్షేమ పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను, గణాంకాలతో సహా ప్రజలకు వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్, అలాగే బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి సొంతంగా తెలంగాణ రక్షణ సమితి పేరిట పార్టీ ఏర్పాటు చేసి సొంత అన్న కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు కల్వకుంట్ల కుటుంబం కూడా డిఫెన్స్ లో పడింది. ఇది నిస్సందేహంగా గులాబీ శిబిరాన్ని బలహీనపరిచింది.
గత పుష్కర కాలంగా ఎలాంటి మార్పు లేకుండా ఒకే విధంగా కొనసాగుతున్న ఆటో మీటర్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంలో అధికారుల కమిటీ సమర్పించిన నివేదిక సిఫారసుల మేరకు ఈ ప్రభుత్వం ఆటో మీటర్ చార్జీల పెంపు నిర్ణయానికి వచ్చింది.
ఐఫోన్ కొనాలనుకున్నాడు.. గంజాయితో జైలుకెళ్లాడు..!
నెల రోజుల కిందటి వరకూ క్వింటాల్ రెండు వేల రూపాయలు పలికిన ఉల్లి ధర ఇప్పుడు 5వేల రూపాయలకు పెరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాతబస్తీ గల్లీలోకి వచ్చిన ముఖ్యమంత్రి నేనొక్కడినే రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్..!
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!