కెసిఆర్ జగన్ అపవిత్ర కలయిక

Publish Date:May 16, 2012

Advertisement

రాష్ట్రంలో మరో మ్యాచ్ ఫిక్సింగ్ అంకానికి తెర లేచింది. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు-వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తాజా మ్యాచ్ ఫిక్సింగ్ కు ప్రధాన సూత్రదారులవుతున్నారు. తెలంగాణా ప్రాంతంలో జగన్ కు గణనీయమైన ప్రజామద్దతు ఉన్నట్లు కెసిఆర్ భావిస్తున్నారు. తమకు వారి మద్దతు కూడా తోడైతే తెలంగాణా ప్రాంతంలో తిరుగుఉండదని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన జగన్ పార్టీకి లోపాయికారికంగా మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే పరకాలలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ విజయానికి కెసిఆర్ మార్గాన్ని సులభం చేస్తున్నారన్న కథనాలు వినిపిస్తున్నాయి.

 

తెలంగాణావాద ఓటర్లలో చీలిక తేవడం ద్వారా పరకాలలో కొండా సురేఖ విజయానికి పరోక్షంగా కెసిఆర్ సహకరించబోతున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణావాదులంతా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టాలన్న తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ సలహాను కెసిఆర్ తోసిపుచ్చారు. దీంతో పరకాలలో టి.ఆర్.ఎస్.తో పాటు బిజెపి, టిడిపి కూడా రంగంలో ఉండబోతున్నాయి. వీటికి తోడు విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీకి చెందిన అభ్యర్థి కూడా రంగంలోకి దింపాలని యోచిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణావాద ఓటర్లలో చీలికరావటం ఖాయం.

 

 

ఫలితంగా కొండా సురేఖ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయని అంచనావేస్తున్నారు. కొద్ది కాలం క్రితం తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కెసిఆర్ కు పరోక్షంగా జగన్ మద్దతు ప్రకటించారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరూ తెలంగాణా ప్రాంతంలో పోటీ చేయలేడు. అప్పట్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంటే టి.ఆర్.ఎస్. అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురై ఉండేవి. కాని కెసిఆర్, జగన్మోహనరెడ్డి మధ్య ఉన్న అవగాహన కారణంగా టి.ఆర్.ఎస్. అభ్యర్థుల విజయం తేలికైంది. ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన కారణంగా పరకాలలో కొండాసురేఖ విజయానికి మార్గం సుగమం చేస్తున్నారు. అయితే వీరిద్దరిది అపవిత్ర, అవకాశవాద కలయిక అని వీరిద్దరూ అధికారంకోసం తెలంగాణా ప్రజలకు ద్రోహం చేస్తున్నారని తెలంగాణాప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పటి నుండి నేటివరకు సాగిన రాజకీయ ప్రయాణం
మిర్యాలగూడ ధర్నాలో కేటీఆర్‌ కీలక ప్రకటన.. రైతుల కోసం పాదయాత్ర..!
ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబె ట్టారన్న ఆరోపణలపై సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి
కాంగ్రెస్‌ను వీడేది లేదు, ఎమ్మెల్యేగా ఉంటా..!
సురేఖను తీసేయకపోతే నేను వెళ్లిపోతాను అని ముఖ్యమంత్రి బ్లాక్‌మెయిల్ చేశాడు..!
రేవంత్ ప్రభుత్వంపై కొండా సురేఖ ఎదురుదాడి..!
కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి..!
ఈ తోపులాటలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు కింద పడి స్వల్పంగా గాయపడ్డారు.   పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు  వంద మందికి పైగా కార్యకర్తలను, స్థానిక నాయకులను అదుపులోకి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
మొత్తం తొమ్మిది ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు   ఫుడ్ సేఫ్టీ అధికారులు,  పోలీసు అధికారుల సమక్షంలో ఏకకాలంలో 19 చోట్ల  తనిఖీలు చేపట్టాయి.
బిర్యానీ తయారీ తయారీలో గడువు ముగిసిన  పదార్థాలను వాడుతున్నారన్న ఫిర్యాదులపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించి, ఫిర్యాదులు వాస్తవమేనన్న నిర్ధారణకు వచ్చి సీజ్ చేసినట్లు తెలుస్తోంది. 
తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిటైల్ మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.