పదేళ్లుగా రంగురాళ్ళ తవ్వకాలు ... పట్టించుకోని ప్రభుత్వం?

Publish Date:Apr 28, 2012

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాఫీయాలు, సిండికేట్లకు నిలయంగా మారింది. విశాఖజిల్లా కూడా ఇటువంటి మాఫియాకు కొలువైంది. విశాఖజిల్లా మన్యంలోని పాడేరు, చింతపల్లి, అరుకులోయ, గొలుగొండ మండలాల్లో పదేళ్ళనుంచి అక్రమంగా రంగురాళ్ళ తవ్వకాలు జరుగుతున్నాయి. రాజకీయనాయకుల అండదండలు, అధికారుల సహాయసహకారాలతో ఈ ప్రాంతంలో విచ్చిలవిడిగా విలువైన రంగురాళ్ళను దోచు కుంటున్నారు. వ్యాపారులతో పాటు వారికి సహాయసహకారా లందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు కోట్లకు పడగలెత్తు తున్నారు. ఇది ఎంతో లాభసాటి వ్యాపారంగా ఉండటంతో ఇతర వ్యాపారాలు చేసుకునేవారు, రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ రంగురాళ్ళ తవ్వకం ప్రారంభించారు. ఎటువంటి అనుమతులు లేకుండా వీరు తవ్వకాలు నిర్వహిస్తున్నారు.

 

 

 

 

అటవీ, పోలీస్, రెవెన్యూ, భూగర్భగనుల శాఖల అధికారులు అప్పుడప్పుడు కంటితుడుపు చర్యగా దాడులు చేస్తున్నారు. తప్ప తవ్వకాలను అడ్డుకోవడానికి గట్టి చర్యలు తీసుకోవటం లేదు. గతపదేళ్ళుగా ఈ అక్రమ తవ్వకాల కారణంగా మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 120మంది మరణించారని అధికారగణాంకాలు చెబుతున్నాయి. కానీ, మృతుల సంఖ ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. కూలీలు క్వారీల్లో తవ్వకాలు జరిపి తీసుకువచ్చిన రంగురాళ్ళకు వ్యాపారులు చాలా తక్కువ ధర చెల్లిస్తున్నారు. స్థానిక వ్యాపారుల నుంచి వీటిని నర్సీపత్నానికి చెందిన ప్రధాన రంగురాళ్ళ వ్యాపారులు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లోని వ్యాపారులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో లభించే రంగురాళ్ళకు అంతర్జాతీయ మార్కెట్టులో మంచి డిమాండు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వ్యాపారులు, రాజకీయనాయకులు, అధికారులు సిండికేటుగా ఏర్పడి విశాఖమన్యంలోని విలువైన సంపదను దోపిడీ చేస్తున్నారు

By
en-us Political News

  
బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కీలక మలుపు..మాజీ ఆర్మీ అధికారి అరెస్ట్..!
ఓ తల్లి స్నానం కోసం వేడి చేస్తున్న నీళ్లు.. అదే ఇంట్లో ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి పాలిట ప్రాణాంత కంగా మారాయి.
చోరీ వెనుక రిటైర్డ్ ఆర్మీ అధికారి.. రెజిమెంట్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం..?
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
మాజీ మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది.
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కీలక మలుపు చోటుచే సుకుంది.
త్వరలో కొత్త యాజమాన్యం కార్యకలాపాలు..?
23 సంస్థలకు నోటీసులు, మూడు సంస్థల FSSAI లైసెన్సులు సస్పెండ్..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంక్షేమ చర్యల అమలు దిశగా సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఢిల్లీకి బయల్దేరారు.
హైదరాబాద్ నగరంలోని లాలాగూడ ప్రాంతంలో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.