Publish Date:May 28, 2022
అందరూ ఊహిస్తున్నట్లుగానే ఆనం ఫ్యామిలీ మళ్లీ తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతోంది. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె కైవల్యా రెడ్డి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. నిన్న మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డితో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కైవల్యారెడ్డి ఒక్కసారిగా టీడీపీ మహానాడు సందర్భంగా భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వెళ్లి లోకేశ్ తో భేటీ అయ్యారు. ఈ సంఘటన వైసీపీ నేతల్లో కలవరం రేపింది.
Publish Date:May 28, 2022
కర్ణాటక శాసన సభ గడువు ముగుస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే మాసాల్లో, ఆ రాష్ట్ర్ర శాసన సభకు ఎన్నికలు జరగవలసి వుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయా, అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నిండా రెండేళ్ళ గడువుంది. తెలంగాణ అసెంబ్లీకి సంవత్సరం పైగానే సమయముంది. అయితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజు పెరుగతున్న నేపధ్యంలో, ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి.
Publish Date:May 28, 2022
దోచుకోవడం, దాచుకోవడం వైసీపీ నైజం. ఈ విషయం గణాంకాలతో సహా మరోసారి రుజువు అయింది. వైసీపీకి 2020-2021 ఆర్థిక సంవత్సరంలో 107.99 కోట్ల రూపాయలు విరాళంగా, అందగా వాటిలో కేవలం ఎనిమిది కోట్ల ఏడు లక్షలు మాత్రమే ఖర్చు చేసింది. అంటే విరాళంగా వచ్చిన మొత్తం నుంచి 99.25 శాతం నిధులు ఖర్చు చేయకుండా మిగుల్చు కుంది. అదే ఆర్థిక సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి అందిన విరాళాలు 3 కోట్ల 25 లక్షల రూపాయలు మాత్రమే. కానీ.. తెలుగుదేశం ఖర్చు చేసింది మాత్రం 54 కోట్ల 76 లక్షల రూపాయలు ఖర్చు చేసింది. అంటే.. వచ్చిన విరాళాల ద్వారా అందిన ఆదాయం కన్నా తెలుగుదేశం 1,584 కోట్ల రూపాయలు అదనంగా వ్యయం చేసింది.
Publish Date:May 28, 2022
మహానాడు.. తెలుగుదేశం జరుపుకునే పండుగ. ఈ పండుగను తెలుగుదేవం పార్టీ 1983 నుంచి క్రమం తప్పకుండా జరుపుకుంటోంది. కరోనా మహమ్మారి కారణంగా గత మూడేళ్లుగా మహానాడు పండుగను జరుపుకోలేదు కానీ, పార్టీ ఆవిర్భావం నుంచి క్రమం తప్పకుండా మహానాడుకు తెలుగుదేశం పార్టీ ఒక పండుగలా, ఒక ఉత్సవంగా నిర్వహించుకుంటూ వస్తోంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తెలుగు తమ్ముళ్లు అదే ఉత్సాహంతో, అదే చైతన్యంతో మహానాడుకుహాజరౌతూనే ఉన్నారు. అయితే మహానాడు తొలి సారి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత 1982 మే 26, 27, 28 తేదీలలో నిర్వహించుకుంది. ఆ మహానాడు దేశ రాజకీయాలలో ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది.
Publish Date:May 28, 2022
తెలుగుదేశం మహానాడులో యువజోష్ ఉరకలెత్తుతోంది. పార్టీని గెలుపు దిశగా నడిపించేందుకు యువతకు వచ్చే ఎన్నికల్లో 40 శాతం స్థానాలు కేటాయిస్తామని అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. నాలుగు దశాబ్దాల నాడు తెలుగుదేశం యువరక్తంతో కదంతొక్కిన సంగతి ఇప్పుడు ప్రస్తావించడం అప్రస్తుతం కాదు. తెలుగుదేశం పార్టీ తెలుగువారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సంతకంగా ఇంత కాలం నిలుస్తూ వచ్చిందంటే ఆ నాడు పడిన పునాదుల మీద.. తెలుగువారి ఖ్యాతి, సత్తా, సమర్ధతా చాటుతూ వారి అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తూ సాగుతుండటమే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల పండుగను సగర్వంగా నిర్వహించుకుంటోంది. అయితే రానున్న కాలంలో పార్టీ మరింత దూకుడుగా, పోరాట పటిమతో ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది.
Publish Date:May 28, 2022
తెలుగుదేశం మహానాడుకు వచ్చిన ప్రతినిథుల కోసం ఏర్పాటు చేసిన విందు భలే పసందు అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరిగిన మహానాడుకు వచ్చిన అతిధుల కోసం ఆహార కమిటీ అద్భుతమైన మెనూ సిద్ధం చేసింది.
Publish Date:May 28, 2022
ఎన్టీఆర్ జన్మస్థలమైన నిమ్మకూరులో దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ తనయుడు, హిందుపురం ఎమ్మెల్యే, హీరో బాల కృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి శత జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.
Publish Date:May 28, 2022
ఎన్టీఆర్ పేరు వింటేనే ప్రతి తెలుగు వాడిలో ఓ పులకింత. సినీ హీరోగా, రాజకీయ నాయకుడిగా, సంక్షేమ సారథిగా, పేదవాడి చేతి అన్నంముద్దగా, మహోన్నత మానవతా మూర్తిగా ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువై ఉన్న నిలువెత్తు చైతన్యం ఎన్టీరామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ఒక సంచలనం.
Publish Date:May 27, 2022
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. నైరుతి ఆదివారం కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. ఈ ఏడాది మూడు రోజులు ముందుగానే తొలకరి పలకరించనుంది.
Publish Date:May 27, 2022
నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ ఈ పేరు ఒక ఉత్సాహం. ఈ పేరు ఒక ఉద్వేగం. ఈ పేరు ఒక చరిత్ర. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు జనం హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న మహామనిషి. ఆయన శత జయంతి నేడు. కృష్ణా నదీతీరాన జన్మించిన నందమూరి తారక రామా బాల్యం నుండీ శ్రమజీవి. కుటుంబానికి అండగా, పొరుగువారికి సాయం చేయడానికి సదా సిద్ధంగా ఉండేవారు. ఇక చలన చిత్ర రంగం లో కి ప్రవేశించిన తరువాత ఆయన అశేష ఆంధ్రుల ఆరాధ్య దైవం అయ్యారు.
Publish Date:May 27, 2022
వైసీపీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట చేస్తున్న బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. గడపకూ మన ప్రభుత్వం అంటూ జనం వద్దకు వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు గడప గడపలోనూ నిరసనలు ఎదురైతే ఇప్పుడు సామాజిక న్యాయ భేరి అంటూ 17 మంది చేపట్టిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రకు జనం మొహం చాటేస్తున్నారు. విజయ నగరంలో జనం లేకపోవడంతో వర్షం నెపం చెప్పి అర్థంతరంగా సభను రద్ధు చేసుకున్న మంత్రులకు రాజమండ్రిలో జనం లేకపోవడంతో మళ్లీ నిరాస తప్ప లేదు.
Publish Date:May 27, 2022
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరు తారక రామ రావు,,జయంతి రేపు.(శనివారం) 1923 మే 23 న జన్మిచిన ఎన్టీఅర్, 1996 జనవరి 18 కన్ను మూశారు. అప్పటి నుంచి తెలుగు దేశం పార్టీ, హైదరాబాద్’లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రతి సంవత్సరం ఎన్టీఅర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం కూడా, తెలంగాణ తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహిస్తోంది. అయితే, ఈ సంవత్సరం వేడుకలకు ఒక ప్రత్యేకత వుంది. ముఖ్యంత్రి కేసీఆర్ జయంతి వేడుకలకు హాజరవుతున్నారు.
Publish Date:May 27, 2022
స్పీకర్ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ పదవిలో ఉన్న వారు రాజకీయాలు మాట్లాడరు. తాము గెలిచి వచ్చిన పార్టీ కార్యక్రమాలలో పాల్గొనరు. బాధ్యత గలిగిన రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఎవరైనా పాటించాల్సిన నైతికత ఇది. అలాంటి బాధ్యత కలిగిన రాజ్యంగ పదవిలో ఉన్న తమ్మినేని ఆ గౌరవానికి తగరని తన వ్యాఖ్యలతో నిరూపించుకున్నారు. తెలుగుదేశం మహానాడుపై అనుచిత వ్యాఖ్యలతో బరితెగించి స్పీకర్ పదవికి మాయని మచ్చ తీసుకొచ్చారు. మహానాడును వల్లకాడనీ, చచ్చిపోయిన పార్టీకి దహన సంస్కారాలు చేస్తున్నారనీ సంస్కార హీనమైన వ్యాఖ్యలు చేశారు.