కంటైనర్ ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆరుగురు దుర్మరణం.!

Publish Date:Aug 25, 2026

Advertisement

సూర్యాపేట జిల్లాలో  బుధవారం (ఆగస్టు 26) తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో  ఆగి ఉన్న కంటైనర్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి   ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

హైదరాబాద్ నుంచి ఏలూరుకు  వెడుతున్న ఈ బస్సులో ప్రమాదం జరిగిన సమయంలో 42 మంది ప్రయాణీకులు ఉన్నారు. . కోదాడ సమీపంలోని దొరకుంట వద్దకు రాగానే..  జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన కంటైనర్‌ను    ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సహాయక  సిబ్బంది  అతికష్టం మీద బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు.  ఈ ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు  అంతరాయం ఏర్పడింది.  అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. 

Kodada road accident, Suryapet bus crash, Telangana private bus accident, Hyderabad to Eluru bus accident, Kodada news today, National Highway road accident

By
en-us Political News

  
అమెరికాలోని మేరీల్యాండ్‌లో హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోడిశాల అనుమానాస్పదంగా మృతి చెందింది.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మవారి దేవాలయంలో మైనర్ బాలికపై ఒక వృద్ధుడు లైంగిక దాడి
హైబ్రిడ్‌ సైబర్‌ ఫ్రాడ్‌పై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక..!
పెళ్లి మండపంలో సాధారణంగా వరుడు వధువు మెడలో మంగళసూత్రం కడతాడు.
అమెరికా కలలు కంటూ విదేశీ గడ్డపై అడుగుపెట్టిన ఆ యువకుడి భవిష్యత్తు ఒక్క క్షణంలో ముగిసిపోయింది.
పెళ్లి ప్రస్తావన తీసుకురాగా పవన్ నిరాకరించారనీ, ముఖం చాటేశారనీ, తనకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.  
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.