హైకోర్టును ఆశ్రయించిన మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్..!

Publish Date:Aug 25, 2026

Advertisement

 

 మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేసు నమోదైన అనంతరం సుమంత్ పరారయ్యాడు. హైదరాబాద్‌లోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ముగ్గురు నిందితులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అయితే ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమంత్‌ను ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడంపై పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమంత్ ఓ మంత్రి నివాసంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా మరోవైపు సుమంత్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తనపై హత్యాయత్నం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒకవైపు ముగ్గురు నిందితుల అరెస్టు అవ్వడం... మరోవైపు సుమంత్ కోర్టును ఆశ్రయించడం.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Former OSD Sumanth, Minister Konda Surekha, Task Force Police, Telangana High Court, CM Revanth reddy, CP Sajjanar

By
en-us Political News

  
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.   ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణను హత్య చేసేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన నిరాహార దీక్షను మంగళవారం విరమించారు.
శంషాబాద్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్‌..!
ముషీరాబాద్‌లో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేసిన సురేఖ కుమార్తె సుస్మితను ఇకపై కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంచాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.  ఇక పోతే.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో తాను  జోక్యం చేసుకోకుండా విషయాన్ని అధిష్టానానికి వదిలేయడం ద్వారా   ఈ   వివాదానికి   త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
విద్యార్థుల హక్కులు, ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల డిమాండ్ తో  రామచందర్ రావు నేతృత్వంలో బీజేపీ చేపట్టిన ఆందోళన సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో నాంపల్లి పరిసరాల్లో ఒక్క సారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో వైద్యులుగా చలామణి అవుతూ ప్రజలకు వైద్యం అందిస్తున్న నకిలీ డాక్టర్లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు కొరడా ఝుళిపించారు.
అత్తాపూర్‌, మియాపూర్‌, అమీన్‌పూర్‌, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో లారీల్లో చికెన్‌ వ్యర్థాలను డంప్‌ చేసి తరలిస్తున్న సమయంలో అధికారులు నిర్వహించారు. చికెన్‌ వ్యర్థాలను సేకరించి వాటిని చేపల చెరువుల యజమానులకు విక్రయిస్తూ  సొమ్ము చేసుకుంటు న్నట్లు అధికారులు గుర్తించారు.
 మార్టూరులో అరుణ్ కుమార్, మత్యాల మహేందర్ రెడ్డి, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది.
తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, తనకు పోటెన్సీ టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.  ఈ పిటిషన్‌పై సోమవారం  హైకోర్టు విచారించనుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.