కాకినాడ సెజ్ పై పోరాటానికి సిద్ధమవుతున్న చంద్రబాబు

Publish Date:Apr 16, 2012

Advertisement

కాకినాడ ప్రత్యేక ఆర్థికమండలి (కె.ఎస్.ఇ.జెడ్.) ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీనిలో భాగంగా ఇటీవల కొందరు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఇటీవల సెజ్ ప్రాంతాన్ని సందర్శించి బాధిత రైతులకు సంఘీభావం ప్రకటించారు. వారియా సలహాపై చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 20వ తేదీన తూర్పుగోదావరిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించ బోతున్నారు. ఈ ప్రాంతంలో సెజ్ పేరుతొ చిన్న చిన్న రైతుల నుంచి వందలాది ఎకరాలను సేకరించి పెద్దలకు అప్పనంగా అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

కాకినాడ ఎస్.ఇ.జెడ్.లో భాగంగా పొన్నాడ, రమణక్కపేటల్లో 1100 ఎకరాలు, ఏవి నగరం, కోదాడ వద్ద 1500 ఎకరాలు బుచ్చిరెడ్డిపాలెం వద్ద 500 ఎకరాలు, చోడిపల్లిపేట 450 ఎకరాలు సేకరించాలని లక్షంగా పెట్టుకున్నారు. ఈ మొత్తం భూముల్లో దాదాపు సగభాగం జి.ఎమ్.ఆర్. గ్రూప్ కు దక్కుతాయి. చిన్నా సన్నకారు రైతులను సెజ్ పేరుతొ భూములను సేకరించి బడా పారిశ్రామిక వేత్తల ధనదాహాన్ని తీరుస్తున్నారు తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ప్రజల వ్యతిరేకత కారణంగా కొన్నిచోట్ల భూసేకరణ కష్టంగా మారింది.

ఈ సెజ్ లో ధర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటును కూడా స్థానికులు అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వం సెజ్ నిర్వాహకులు కూడా పట్టువదలకుండా భూ సేకరణకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటిదాకా సేకరించిన సుమారు 2000 ఎకరాల్లో బూమిని చదునుచేసే కార్యక్రమాలు ముగించారు. ధర్మల్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పదానికి జి.ఎమ్.ఆర్. సంస్థ ప్రయత్నించింది. అయితే ప్రజలు ఎదుర్కోవడంతో కాకినాడ తీరంలో నీళ్ళపై తేలియాడే బార్జమౌంట్ విద్యుత్ ప్లాంట్ ను నెలకొల్పడానికి జి.ఎమ్.ఆర్. సన్నాహాలు చేస్తోంది. సెజ్ లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.

కాకినాడ నుంచి విశాఖకు ఆరు లైన్ల రహదారి ఏర్పాటు చేయబోతున్నారు. అన్నవరం లేదా కత్తిపూడి నుంచి జాతీయ రహదారితో సెజ్ ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తున్నారు. అలాగే రావికంపాడు స్టేషన్ నుంచి రైలు మార్గాన్ని సెజ్ ప్రాంతానికి వేయడానికి ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సెజ్ కోసం ప్రత్యేకంగా ఒక పోర్టును కూడా నిర్మించాలనుకుంటున్నారు. సెజ్ కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న నిర్వాహకులు రైతుల భూములకు పరిహారం చెల్లించే విషయానికి వచ్చేటప్పటికి సంకుచిత భాగంతో వ్యవహరిస్తున్నారు.

By
en-us Political News

  
టూరిజం, ఎడ్యుకేషన్ రంగాల్లో సహకరించండి..!
నానక్‌రామ్‌గూడలోని భూ వివాదానికి సంబంధించి సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే. చంద్రశేఖర్ రెడ్డి, మురళీ ధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
ట్రాఫిక్, కాలుష్యాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం..!
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.