ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించారన్న కారణంతో ఒక జూనియర్ న్యాయవాదిని నేరుగా పోలీస్ కస్టడీకి పంపడం ఇప్పుడు న్యాయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కోర్టు హాల్లోనే జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది.
వివరాల్లోకి వెళ్తే.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఆ సందర్భంగా న్యాయవాది జడ్జిని క్షమించమని కోరారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఒకింత అనుచితంగా ప్రవర్తించానని వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయినా జడ్జి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. కనీసం 10 ఏళ్ల అనుభవం లేని జూనియర్ ఇలా ప్రవర్తించడమేంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన పెను సంచలనం రేకెత్తించింది. ఒక న్యాయవాదిని నేరుగా కస్టడీకి పంపడంపై బార్ కౌన్సిల్ ప్రతినిధులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమూర్తుల పట్ల గౌరవం ఉండాల్సిందేనని.. అయితే తక్షణమే కస్టడీకి ఆదేశించడం కఠినమైన చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కూడా దీనిపై స్పందించే అవకాశం ఉంది. జూనియర్ లాయర్లపై ఇలాంటి చర్యలు తీసుకోవడం వారి కెరీర్ను దెబ్బతీస్తుందని న్యాయవాదుల సంఘాలు అంటున్నాయి.
కోర్టు హాల్ మర్యాదలు, న్యాయమూర్తులు, న్యాయవాదుల మధ్య సంబంధాలపై ఈ ఘటన పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది? ఏపీ హైకోర్టులో జరిగిన ఈ సంఘటనకు ముగింపు ఎక్కడ? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థలో క్రమశిక్షణ అవసరమని భావించే వారు జడ్జి నిర్ణయాన్ని సమర్థిస్తుండగా.. మానవతా దృక్పథం ఉండాలని మరికొందరు కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/junoir-layer-sent-to-police-custody-36-219234.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.