శాసనసభలో జగన్ కు మరోసారి భంగపాటు

Publish Date:Sep 6, 2014

Advertisement

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ షరా మామూలుగానే ముందూ వెనుక చూసుకోకుండా అత్యుత్సాహానికి పోయి అధికార పార్టీని తప్పుపట్టబోయి, అధికార పార్టీ చేతిలో మరోమారు భంగపడ్డారు.

 

ఈరోజు కొంచెం ఆలస్యంగా శాసనసభకు వచ్చిన జగన్, అజెండాలో లేని బీసీ తీర్మానంపై ఏవిధంగా చర్చిస్తున్నారని, అసలు ప్రతిపక్షానికి ఎందుకు తెలియజేయలేదంటూ అధికార పార్టీపై విరుచుకు పడ్డారు. ప్రతీరోజూ అధికారపార్టీ సభ్యులు తనకు నియమ నిబంధనలు తెలియవని సభలో అందరి ముందు ఎద్దేవా చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఈరోజు తనకు ఆ విమర్శలను త్రిప్పికొట్టే అవకాశం దొరికిందని సభలో చెలరేగిపోయారు. కానీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పిన జవాబుతో ఆయన కంగుతిన్నారు.

 

యనమల ఏమన్నారంటే, “మీరు సభకు ఆలస్యంగా వచ్చి సభలో ఏమి జరుగుతోందో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మమ్మల్ని విమర్శించేముందు కనీసం సభలో ఉన్న మీ పార్టీ సభ్యులను అడిగి తెలుసుకొన్నా బాగుండేది. కానీ సభా నియమాలు ఏమీ తెలుసుకోకుండా, బీసీ తీర్మానంపై చర్చ మొదలయిన తరువాత మధ్యలో ప్రవేశించి అది అజెండాలో లేదు కనుక దానిని మళ్ళీ మొదలుపెట్టమని అడగటం సభా నియమాల పట్ల మీకు అవగాహన లేదని స్పష్టంజేస్తోంది,” అని ఘాటుగా బదులిచ్చారు.

 

కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, అజెండా కాపీని చూపిస్తూ "దీనిలో ఈరోజు ఈ తీర్మానంపై చర్చిస్తామని ఎక్కడ వ్రాసి ఉందో చెప్పమంటూ" ఆయనను నిలదీసారు. “సభలో ఉన్న ప్రతిపక్షానికి తెలియపరచకుండా ఏవిధంగా చర్చ చేప్పట్టారు? అది ఏ నియమ నిబంధనల క్రింద వీలుపడుతుందో చెప్పమంటూ” చాలా ఆవేశంగా ప్రశించారు. కానీ ఆవిధంగా ప్రశ్నించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మరోమారు యనమల చేతిలో భంగపడక తప్పలేదు.

 

యనమల ఆయన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “ఈరోజు సభా సమావేశాలు మొదలయ్యే ముందే మేము స్పీకర్ గారిని ఈ అంశాన్ని అజెండాలో చేర్చమని కోరి ఈ అంశంపై చర్చకు అనుమతి కూడా తీసుకొన్నాము. ఆ విషయాన్ని స్పీకర్ గారు మీ సభ్యులకు కూడా తెలియజేసారు. కానీ మీరు ఇదేమీ తెలుసుకోకుండా మధ్యలో ప్రవేశించి అజెండాలో ఈ అంశం లేదు కనుక చర్చ జరగడానికి వీలులేదనో లేకపోతే మళ్ళీ మొదటి నుండి చర్చించాలని కోరడం మంచి పద్ధతి కాదు. ఇటువంటి ఆదేశాలు మీరు మీ పార్టీ సభ్యులకు మీ లోటస్ పాండ్ నివాసంలో నిరభ్యంతరంగా ఇచ్చుకోవచ్చును. కానీ ఇది మీ లోటస్ పాండ్ నివసమూ కాదు. ఇక్కడ జరుగుతున్నది మీ పార్టీ సమావేశం కాదు. కనుక సభలో మాట్లాడే ముందు విషయం తెలుసుకొని, సభా నియమ నిబంధనలు క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఆ తరువాతనే మాట్లాడితే ఇటువంటి పరిస్థితి ఎదురవదు,” అని జవాబిచ్చారు.

 

అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు కూడా కలుగజేసుకొని, ఈ రోజు అజెండాలో బీసీ తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చకు అనుమతి తీసుకొందని, ఆవిషయాన్ని సభలో ఉన్న ప్రతిపక్ష సభ్యులకు కూడా తాను ముందే తెలియజేసానని, కనుక దీనిపై అనవసర రాద్దాంతం చేయవద్దని జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు.

 

కానీ జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.  నోటిమాటగా తీర్మానం ప్రవేశపెట్టేందుకు, దానిపై చర్చ జరిపేందుకు స్పీకరును అనుమతి కోరడం నియమ నిబంధనలకు విరుద్దమని, అది ఏ నిబంధన క్రింద వీలవుతుందో తనకు చెప్పాలని యనమలను నిలదీశారు. అది కూడా మళ్ళీ జగన్ కు మరోసారి చేదు అనుభవమే మిగిల్చింది.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు లేచి మాట్లాడుతూ ‘మంత్రులు ఏదయినా ఒక ముఖ్యమయిన అంశంపై సభలో చర్చ జరగాలని భావిస్తే వారు స్పీకరును నోటిమాటగా అనుమతి కోరవచ్చును. స్పీకరు అనుమతిస్తే దానిని అజెండాలో చేర్చకుండానే సభలో సభ్యులందరికీ తెలియజేసి దానిపై స్పీకర్ చర్చ చేప్పట్టవచ్చును. ఈ నియమం గురించి తెలుసుకోకుండా ప్రతిపక్ష నాయకుడికి  మాకు నియమ నిబంధనల గురించి పాటాలు నేర్పిస్తున్నారు,” అని జగన్మోహన్ రెడ్డిని ఎద్దేవా చేసారు.

 

ఆ తరువాత మాట్లాడిన యనమల రామకృష్ణుడు, ఆవిధంగా చర్చకు అనుమతించే నియమ నిబంధనలను రూల్ బుక్ లో నుండి చదివి వినిపించారు. రూల్ బుక్ క్షుణ్ణంగా చదువుకోమని జగన్ కు సలహా కూడా ఇచ్చారు.

 

ఇంత అవమానకర పరిస్థితులు ఎదుర్కొన్న తరువాత ఎవరయినా సభలో మళ్ళీ మాట్లాడేందుకు జంకుతారు. కానీ జగన్ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా అధికారపార్టీ సభ్యులు సభలో ప్రతిపక్ష పార్టీ గళం వినిపించకుండా చాలా నియంతృత్వంగా, ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించి మళ్ళీ మరో కొత్త సమస్యను కోరి తెచ్చుకొన్నారు. ఆయన ‘అధికార పార్టీ సభ్యులకు మానవత్వం’ లేదని అనడం అన్-పార్లమెంటరీ పదమని యనమల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ తరువాత కొద్ది సేపు దానిపై కూడా వారిరువురి మధ్య వాదోపవాదాలు సాగాయి.

 

మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అనుభవలేమి కారణంగా సభలో చాలా దుందుడుకుగా వ్యవహరిస్తూ అధికార పార్టీని ఇబ్బందిపెట్టబోయి చివరికి తనే వారి చేతిలో పదేపదే భంగపడుతున్నారు. అయినప్పటికీ ఆయన తన తీరు మార్చుకోకపోవడం చాలా ఆశ్చరం కలిగిస్తుంది.

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.