నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని మామిడిపళ్ళ సందేశం

Publish Date:Sep 5, 2014

Advertisement

 

భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య గొప్ప సంబంధాలు ఎప్పుడూ లేవు. అందుకు పాకిస్తాన్నే నిందించక తప్పదు. భారత్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కు స్నేహస్తం అందిస్తూనే ఉంది. కానీ పాక్ ప్రభుత్వంపై సైన్యం, ముస్లిం చాంధసవాదుల పెత్తనం చేస్తుండటంతో భారత్ తో బలమయిన స్నేహ సంబంధాలు పెంచుకోవాలని పాక్ ప్రభుత్వాధినేతలు కోరుకొంటునప్పటికీ వీలుపడటం లేదు. అందుకే ఇరుదేశాలకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా వాటి మధ్య ఇంతవరకు పటిష్టమయిన స్నేహ సంబంధాలు ఏర్పడలేకపోయాయి.

 

మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం కోవాలనే ఆలోచనతో, పాక్ ప్రధానిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం, ఆయన దానిని మన్నించి రావడం, ఆ తరువాత ఇరువురు ప్రధానులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వరకు అంతా సవ్యంగానే సాగిపోయింది. కానీ మళ్ళీ షరా మామూలుగానే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సేనలు పదేపదే భారత జవాన్లపై, సరిహద్దు గ్రామాలపై కాల్పులకి తెగబడటంతో, రెండు దేశాల నడుమ చిగురిస్తున్న స్నేహ పుష్పం వడిలిపోవడం మొదలయింది.

 

భారత్ లో పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్, భారత ప్రభుత్వం వారిస్తున్నా వినకుండా డిల్లీలోనే కాశ్మీరు వేర్పాటువాదులతో సమావేశం అవడంతో, ఉభయదేశాల విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయిలో జరగవలసిన సమావేశం భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవడం ద్వారా పాక్ తీరుకు తన నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి సరిహద్దులలో కాల్పులు తిరిగి మొదలయినప్పుడే భారత ప్రభుత్వం ఆ పని చేసిఉండేది. కానీ సహనంతో ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. రెండు దేశాల మధ్య స్నేహ పుష్పం వికసిస్తున్న ప్రతీసారి దానికి ముగింపు ఇంచుమించుగా ఇలాగే ఉండటానికి కారణం ముందే చెప్పుకొన్నాము.

 

పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని మోడీతో కొంచెం సన్నిహితమవుతున్నట్లు సూచనలు కనబడగానే, ప్రతిపక్ష నేతలు ఇమ్రాన్ ఖాన్ మరియు తహీరుల్ ఖాద్రీల నేతృత్వంలో అకస్మాత్తుగా తిరుగుబాటు మొదలయింది. వారిరువురు నవాజ్ షరీఫ్ వెంటనే ప్రధాని పదవిలో నుండి దిగిపోవాలంటూ ప్రజలతో కలిసి పార్లమెంటును, ప్రధాని నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. అయితే అందుకు వారు చెపుతున్న కారణాలు వేరు. వారిరువురినీ పాకిస్తాన్ సైన్యంలో మత ఛాందసవాదులయిన సైనికాధికారులే నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే నేటికీ వారిరువురినీ పాక్ సైన్యం ఉపేక్షిస్తోంది. ప్రజాసమస్యలను సాకుగా చూపి పాకిస్తాన్ లో ప్రభుత్వాలను నేరుగానో లేదా ఈవిధంగా పరోక్షంగానో కూలద్రోయడం పాక్ సైన్యానికి అలవాటే.బహుశః ఇప్పుడు కూడా అదే జరుగుతోందని భావించవచ్చును.

 

అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా పాకిస్తాన్ ప్రధాని భారత్ తో స్నేహ సంబంధాలు పునరుద్దరించుకోవాలని తాపత్రయపడటం చాలా మంచి ఆలోచనే. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి, ప్రధాని మోడీకి మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు భారత్ లో తమ అధికారుల ద్వారా పాకిస్తాన్ లో సుప్రసిద్దమయిన సింద్రీ, చౌస రకం అత్యుత్తమ మామిడి పళ్ళను బహుమతిగా పంపించారు. తద్వారా భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనే తన బలమయిన కోరికను వ్యక్తం చేసారు. బహుశః మోడీ ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించవచ్చును. కానీ పాక్ ప్రభుత్వంపై పాక్ సైన్యం, మత ఛాందసవాదుల పెత్తనం కొనసాగుతున్నంత కాలం భారత్-పాక్ సంబంధాలు మూడడుగులు ముందుకీ మూడడుగులు వెనక్కీ సాగుతూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోవచ్చును.

By
en-us Political News

  
రేవంత్ కొండా సురేఖను బర్త్ రఫ్ చేసిన మరుసటి రోజు.. ఆమె శాఖల నిర్వహణ బాధ్యత స్వయంగా రేవంత్ తీసుకోవడంతో ఇప్పట్లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉండదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
కొండా అధిష్ఠానం సూచన మేరకు రాజీనామా చేపసి ఉంటే.. ఈ రోజు కాకున్నా రేపు, లేదా ఆ తరువాత  పార్టీలో  ఆమెకు మళ్లీ గుర్తింపు, ఆ గుర్తింపునకు తగిన స్థానం లభించే అవకాశాలు ఉండేవి, అయితే కొండా సురేఖ.. అధిష్ఠానాన్ని నిలదీసి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని హస్తిన వేదికగానే విమర్శలు గుప్పించడంతో ఆమెకు ఆ అవకాశం లేకుండా పోయింది.
అధికారంలో ఉన్నా, లేకున్నా నిరంతరం ప్రజా సమస్యలపైనే రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం చంద్రబాబుదే.  మీకోసం యాత్ర ద్వారా రాష్ట్రమంతా 117 రోజులు పర్యటించి ప్రజా సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. బాబ్లి ప్రాజెక్టు వ్యతిరేకంగా ఉద్యమించి మహారాష్ట్రలో జైలుపాలై ఎనిమిది రోజుల పాటు   నిరహారదీక్ష చేశారు.
గత దశాబ్ద కాలంగా రాజును మించిన రాజభక్తి చందంగా  బీజేపీకి అడుగులకు మడుగులొత్తుతూ ఆ పార్టీతో సఖ్యత చెడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్న జగన్.. ఇప్పుడు ఆ పార్టీకి పూర్తిగా కటీఫ్ చేప్పేస్తున్నారా?
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. విజయ సాయి రెడ్డి ఆరోపణలు వైసీపీని నిస్సందేహంగా డిఫెన్స్ లోకి నెట్టేశాయి. ఆ పార్టీలోని అంతర్గత విభేదాలను ప్రస్ఫుటంగా ఎండగట్టాయి. ఇప్పుడిక విజయసాయి ఆరోపణలు, విమర్శలపై జగన్ స్పందించి నోరు తెరవక తప్పని పరిస్థితిని కల్పించాయి.
ఎన్నికలను ఆపడానికి వైపీపీ కోర్టులు ఆశ్రయించింది. దీనిని బట్టి చూస్తుంటే స్థానిక సమరంలో గట్టి పోటీ అంటూ జగన్ చేస్తున్న ఆర్భాటపు ప్రకటనలు, ప్రసంగాలూ మేకపోతు గాంభీరమేనని అర్ధమౌతోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 
రాష్ట్రవ్యాప్తంగా అధికార తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న తరుణంలో.. జగన్ తీరు, శైలి పార్టీ శ్రేణులను మరింత నిరుత్సాహానికి గురి చేస్తోందని పరిశీలకులు అంటున్నారు. అసలు స్థానిక ఎన్నికలలో బరిలో నిలిచేందుకు వైసీపీకి చాలా నియోజకవర్గాలలో అభ్యర్థులే కరవయ్యే పరిస్థితులు ఉన్నాయని పార్టీ వర్గాలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో బొత్స సత్యనారాయణ తన అంచనాలకు తగ్గట్టుగా పని చేయడంలేదన్న భావనతో జగన్ ఉన్నారని అంటున్నారు. ముఖ్యంగా మండలిలో డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయడంలో విఫలం కావడం, అలాగే.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ బలహీనపడుతున్నా.. పట్టించుకోకపోవడంతో జగన్ బొత్సపై జగన్ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వర్గాలే అంటున్నాయి. 
ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో  అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు.
ఇదే రీతిలో  అసమ్మతి వర్గం ఒత్తిడి పెంచితే, అలాగే బీఆర్ఎస్ ఆరోపణలపై  దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగితే.. సీఎం మార్పు దిశగా హైకమాండ్ అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  
పార్టీ కార్యక్రమాలు,  నిర్ణయాల్లో  ఆయన ప్రమేయం మచ్చుకైనా లేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీలో ఉక్కపోతకు గురౌతున్నా, పార్టీయే ఆయనకు పొమ్మనలేక పొగపెడుతున్నా తమ్మినేని సీతారాం మాత్రం వైసీపీని పట్టుకు వేళాడటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.   
కడప జిల్లా నుంచి జగన్ కుమార్తె హర్షారెడ్డి రాజకీయ అరంగేట్రం జరుగుతుదంటూ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే  సామాజిక మాధ్యమంలో, వైసీపీ శ్రేణుల్లో  హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. అయితే హర్షారెడ్డి పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటి వరకూ   వైసీపీ నుంచి కానీ, జగన్ నుంచి కానీ ఎటువంటి ప్రకటనా రాలేదు.
అంబేడ్కర్ ఆశయాల సాధనకు తనతో కలిసి పనిచేయాలని  పిలుపునిచ్చారు. చురుకైన అంబేడ్కర్ వాదిగా గుర్తింపు పొందిన అభిజీత్ దీప్కే.. ఈ ఆఫర్‌ను స్వీకరిస్తారా లేదా అన్నది పక్కన పెడితే రామదాస్ అవధానే ఆహ్వానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.