ఇండియాకు ఐఎమ్ఎఫ్ ఊతం!

Publish Date:Apr 15, 2026

Advertisement

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య కూడా  భారత్ జీడీపీ వృద్ధి అంచనాను  అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ (ఐఎమ్ఎఫ్) పెంచింది.  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఘర్షణలు, గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ ద్రవ్య నిధి  సానుకూల అంచనాలు వెలువరించడం విశేషం.  రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను భారత్ జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతంగా పేర్కొంది. 
ఐఎమ్ఎఫ్ తాజా నివేదిక ప్రకారం..  భారత్ రాబోయే రెండేళ్లలో కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగనుంది.
ప్రధాన ఆర్థిక వ్యవస్థల జీడీపీ వృద్ధి అంచనాలు ఇలా ఉన్నాయి. 
- భారత్    6.5శాతం
- చైనా    4.4శాతం
- అమెరికా    2.3శాతం
- రష్యా    1.1శాతం
- ఫ్రాన్స్    0.9శాతం
-జర్మనీ    0.8శాతం
- బ్రిటన్    0.8శాతం
- జపాన్    0.7శాతం
- ఇటలీ    0.5శాతం
ఈ జాబితాలో భారత్  అగ్రస్థానంలో నిలిచింది.
   గ్లోబల్ వృద్ధి అంచనాను 3.3  నుంచి 3.1శాతానికి తగ్గించిన ఐఎమ్ఎఫ్ అందుకు కారణాలు కూడా వివరించింది. 
 
- ఇరాన్ పై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు
- ఇరాన్ ప్రతీకార చర్యలు
- హార్ముజ్ జలసంధిగుండా రవాణా అంతరాయం
- చమురు, గ్యాస్, ఎరువుల ధరల పెరుగుదల
- ద్రవ్యోల్బణం పెరుగుదల
అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ ప్రకారం, ఈ ఏడాది ప్రపంచ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి కి చేరే అవకాశం ఉంది  గతఅంచనాతో పోలిస్తే 0.6శాతం ఎక్కువ.
 
ఇంధన ధరలు సంవత్సరం పొడవునా అధికంగా ఉంటే, ప్రపంచ వృద్ధి రెండు శాతం వరకు పడిపోవచ్చని ఐఎంఎఫ్ హెచ్చరించింది. 1980 తర్వాత కేవలం నాలుగు సందర్భాల్లో మాత్రమే ప్రపంచ వృద్ధి 2శాతం కంటే దిగువకు పతనమైంది. అది కూడా 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ మహమ్మారి వంటి సందర్భాల్లో మాత్రమే. 
 ఇక పోతే అమెరికా, చైనా ఆర్థిక వ్యవస్థలపై కూడా అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ విశ్లేషించింది.  
- అమెరికావృద్ధి అంచనా 2.3 శాతంగా పేర్కొంది. 
- గ్యాసోలిన్ ధరలు పెరిగినా, అధిక ఇంధన ధరలు అమెరికాకు కొంత ప్రయోజనం కలిగించవచ్చని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది.  
- ఇక 2026 వృద్ధి అంచనా: 4.4శాతంగా పేర్కొంది. 
- దేశీయ డిమాండ్ కంటే ఎగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల అసమతుల్యత కొనసాగుతోందని పేర్కొంది.  
 
ప్రపంచ చమురు రవాణాలో 20శాతం కంటే ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే  ఇరాన్, ఆ తరువాత అమెరికా   అమెరికా నావికాదళ దిగ్బంధన ఆదేశాల కారణంగా   గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది.  అయితే ఈ పరిస్థితులలో కూడా భారత్ వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం సానుకూల సంకేతమనే చెప్పాలి. 
 - ఐఎమ్ ఎఫ్ అంచనాలు  పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచుతాయి
-  గ్లోబల్ అస్థిరత మధ్య భారత్ స్థిరమైన వృద్ధి చూపుతోంది
- అమెరికా సుంకాల తగ్గింపు భారత ఎగుమతులకు లాభం
- భారత్ ను అంతర్జాతీయ సంస్థలుగ్లోబల్ గ్రోత్ ఇంజిన్ గా చూస్తున్నాయి.  
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ ద్రవ్యోల్బణం, సరఫరా చెయిన్  సమస్యలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ ద్రవ్యనిథి సంస్థ ఇండియాపై  చూపుతున్న విశ్వాసం అత్యంత ముఖ్యమైన ఆర్థిక సంకేతంగా ప్రపంచ ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తున్నారు.   రాబోయే రెండేళ్లలో కూడా ఇండియా ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న   ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.  మధ్యప్రాచ్య సంఘర్షణ ఉన్నప్పటికీ,  భారత్ జీడీపీ వృద్ధి అంచనాను పెంచడం గ్లోబల్ మార్కెట్ లో భారత్ బ్రాండ్ విలువను పెంచిందనడంలో సందేహం లేదు. 

2027, 2028 ఆర్థిక సంవత్సరాలలో   భారత్ జీడీపీ వృద్ధి 6.5 తాతానికి ఐఎమ్ ఎఫ్ పెంచిన నేపథ్యంలో  ప్రధాన ఆర్థక వ్యవస్థల్లో భారత్ అగ్రస్థానంలో నిలబడింది.  అంటే వచ్చే రెండేళ్లలో కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా  అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది.

-  అయితే.. 2026లో ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తన అంచనాలను ఈ సంస్థ తగ్గించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ, వస్తు మార్కెట్లను అస్థిరపరిచి, ధరలను పెంచడం ద్వారా ప్రపంచ ఆర్థిక గమనాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అది హెచ్చరించింది.
- ప్రస్తత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వృద్ధిని 3.1 శాతంగా ఐఎంఎఫ్ అంచనా వేసింది. జనవరిలో జారీ చేసిన 3.3 శాతం అంచనాతో పోలిస్తే ఇది తగ్గింపు.  ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత ఉద్రిక్తతలు పెరగడం, దీనికి ప్రతిగా ఇరాన్   ప్రతీకార దాడులకు పాల్పడటంతో  ఆ ప్రాంతమంతటా సంఘర్షణ విస్తరించడం వంటి పరిణామాలకు ముందే  3.3 శాతం అంచనా వెలువడింది. ఈ సంఘర్షణ లేకపోయి ఉంటే, 2026 నాటి వృద్ధి అంచనాలను 3.4 శాతానికి పెంచి ఉండేవాళ్ళమని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థికవేత్త పియరీ ఆలివియర్ గౌరిన్చాస్ పేర్కొన్నారు.

ఈ ఘర్షణల కారణంగా చమురు, గ్యాస్ మరియు ఎరువులు వంటి కీలక వస్తువుల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య రవాణాకు అత్యంత కీలక మార్గమైన  స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్'గుండా జరిగే రాకపోకలను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడం ఇందుకు ఒక ప్రధాన కారణం. అదే సమయంలో, ఇరాన్ నౌకాశ్రయాలను లక్ష్యంగా చేసుకుంటూ నావికా దిగ్బంధనాన్ని  అమలు చేయాలని డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.  ఫలితంగా..  ఈ సంవత్సరం ప్రపంచ ద్రవ్యోల్బణం 4.4 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ ఇప్పుడు తాజాగా అంచనా వేసింది.   ప్రపంచ వృద్ధి, ద్రవ్యోల్బణ అంచనాలలో మొత్తం మార్పులు సాపేక్షంగా పరిమితంగా ఉన్నప్పటికీ, ఈ సంఘర్షణ ప్రభావాలు మధ్యప్రాచ్యంలో,  మరింత బలహీనమైన ఆర్థిక వ్యవస్థలలో చాలా ఎక్కువగా ఉన్నాయని ఐఎంఎఫ్ హెచ్చరించింది.

 సేకరణ, సంకలనం : సీతారాం కంఠమనేని

By
en-us Political News

  
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం, ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోల సృష్టి మరియు వ్యాప్తిపై గుజరాత్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూట‌మి ప్ర‌భుత్వం కృషితో క్రీడావికాసం సాధ్య‌మ‌వుతోంద‌ని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన సమయంలో ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు వేరని వారు వాదిస్తున్నారు. కులాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల, అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారి వాదనలో వ్యక్తమవుతోంది. ఆర్థిక అసమానతల అంశంపై చర్చ తీవ్రమవుతున్న తరుణంలో.. కులం కంటే ఆర్థిక స్థితే ముఖ్యం అనే నినాదం బలంగా వినిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
మీసేవ కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు.
అథ్లెటిక్స్ ప్రపంచంలో పరుగు అంటేనే గుర్తొచ్చే పేరు ఉసేన్ బోల్ట్. ఆయన సృష్టించిన రికార్డులు దశాబ్ద కాలంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.
ఇరాన్ తో అమెరికా యుద్ధం అన్నది ఒక పెద్ద వ్యూహంలో చిన్న ఆటవిడుపు మాత్రమే అంటున్నారు అంతర్జాతీయ వ్యూహకర్తలు. ప్రస్తుతం జరుగుతున్నవన్నీ, ఒక భారీ వ్యూహంలో భాగమైన చిన్న చిన్న ఘర్షణలు మాత్రమేనని విశ్లేషిస్తున్నారు. అసలు సిసలు యుద్ధం అగ్రరాజ్యం అమెరికాకు, వేగంగా పురోగమిస్తూ.. అమెరికా ఆధిపత్యానికి గండి కొడుతున్న చైనాకు మధ్య జరుగుతోంది.
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి 90రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించారు.
ఐపీఎల్ వంటి అగ్రశ్రేణి వేదికపై ఒక్క రాత్రిలో స్టార్లుగా మారే ఆటగాళ్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, కఠిన శ్రమ దాగి ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.